సినీ రచయితగా సత్యానంద్ది ఓ శకం. ఆయన కలం నుంచి జాలువారిన సిరాక్షరాలు... నిర్మాతలకు సిరులు కురిపించాయంటే అతిశయోక్తి కాదు. కెరీర్ ప్రారంభించి నాలుగు దశాబ్దాలు దాటుతున్నా... ఇంకా ఆయన కలం జెట్ వేగంతో రచిస్తూనే ఉంది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, పవన్కల్యాణ్ లాంటి అగ్ర కథానాయకుల చిత్రాలకు తన రచనలతో అద్భుత విజయాలు అందించిన సత్యానంద్.. ప్రస్తుతం యువ దర్శకుల చిత్రాలతో బిజీగా ఉన్నారు. నేడు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ఆయనతో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ.
పుట్టిన రోజు శుభాకాంక్షలు సార్?
పుట్టిన రోజు చేసుకునే అలవాటు నాకు మొదట్నుంచీ లేదు. దానికి పెద్ద ప్రాముఖ్యతను కూడా ఇవ్వను. అందుకే... నా పుట్టిన రోజు తేదీ చాలామందికి తెలీదు కూడా. గుర్తుంచుకున్నందుకు థ్యాంక్స్.
‘రచన- సత్యానంద్’... ఈ కార్డ్ తెరపై కనిపిస్తే చాలు ‘సినిమా హిట్’ అని నిర్ధారించుకునేవారు ప్రేక్షకులు. ఆ వైభవం గుర్తొస్తే ఏమనిపిస్తుంది?
సంతోషంగా ఉంటుంది. రచయితగా నాకంటూ ఓ గౌరవ స్థానాన్నిచ్చిన తెలుగు సినిమాకు జీవితాంతం రుణపడి ఉంటాను. నాకు రాయడం అంటే ఇష్టం. ఆ ఇష్టమే నన్ను ఈ స్థాయికి తెచ్చింది. నేను ఇంత ధాటిగా సినిమాలు రాశానంటే దానికి నా తొలి సినిమా విజయమే కారణం. ‘మాయదారి మల్లిగాడు’ నా తొలి చిత్రం. నా మేనమామగారైన ఆ చిత్ర దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు చెప్పిన చిన్న ఐడియా ఆధారంగా కథ తయారు చేసి ఆయనకు వినిపించాను. ఆ కథ నచ్చి.. ఆ చిత్రానికి మాటలు రాసే అవకాశాన్ని కూడా నాకే ఇచ్చారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత భారీ అఫర్లు వాటంతట అవే నా తలుపు తట్టాయి. 80ల్లో అయితే... ఊపిరి సలపకుండా పనిచేశాను. ఆ వయసు అలాంటిది. అవకాశాలొస్తుంటే... అన్నింటినీ నిలబెట్టుకోవాలనే కసి. ఒక సినిమా సెట్లో ఉంటే, రెండు సినిమాలు డిస్కషన్స్లో ఉండేవి. కె.రాఘవేంద్రరావుతోనే 45 సినిమాలకు పనిచేశాను. కోదండరామిరెడ్డితో 20 సినిమాలు చేశాను. కెరీర్ మొత్తం మీద 400 సినిమాలకు పై మాటే.
ఇలా జనరేషన్తో నిమిత్తం లేకుండా.. అప్ డేట్ అవ్వడం మీకే సాధ్యమైంది.
రచయితకు పరిశీలనాత్మక దృష్టి అవసరం. కథలు, మాటలు ఎక్కడ్నుంచో పుట్టవు. సమాజం నుంచే పుడతాయి. ఈ విషయం తెలిసిన వాణ్ణి కాబట్టే ఇలా ఉండగలుగుతున్నా. దర్శకుల మనోభావాలకు తగ్గట్టుగా నా రచనలు ఉంటాయి. ఇప్పుడు యంగ్స్టర్స్తో వర్క్ చేస్తున్నా. వాళ్ల ఆలోచనల్ని గమనిస్తున్నా. పుస్తకాలు చదువుతా. అది కూడా నాకు హెల్ప్ అయ్యింది.
మీ కెరీర్లో ఛాలెంజ్గా తీసుకొని రాసిన సినిమా?
శివాజీగణేశన్ నటించిన తమిళ చిత్రం ‘తంగపతకం’ని తెలుగులో చేయాలి అనుకున్నప్పుడు.. ఆ ఐడియాను మాత్రమే తీసుకొని, మాతృకకు పూర్తి భిన్నంగా ‘కొండవీటి సింహం’ కథ తయారు చేశాం. ఎన్టీఆర్కున్న నంబర్వన్ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన ఆ కథ నాకు మంచి పేరు తెచ్చింది. అలాగే.. ‘జస్టిస్చౌదరి’. ‘జడ్జి అంటే మాస్ అప్పీల్ ఏముంటుంది?’ అని స్వయంగా ఎన్టీఆర్గారే అన్నారు. దాంతో ఛాలెంజ్గా తీసుకొని మాస్ని మెస్మరైజ్ చేసేలా కథను తయారు చేశాం. ‘అద్భుతంగా చేశారు బ్రదర్’ అని ఎన్టీఆర్గారు అభినందించిన ఆ క్షణాలు నా కెరీర్లో మరచిపోలేనివి.
చూడ్డానికి సాఫ్ట్గా కనిపిస్తారు. ఇంత మాస్ సినిమాలు ఎలా చేశారు?
మర్డర్ చేసేవాడు కూడా మర్యాదగానే కనిపిస్తాడు (నవ్వుతూ).బయటకు నేనెలా కనిపించినా... నా లోపల ఉంది మాసే.
చిరంజీవి నటించిన ఎక్కువ హిట్ సినిమాలకు రచయిత మీరే కదా?
అదేంలేదు. అందరి హీరోలకూ రాశాను. చిరంజీవి కెరీర్ ప్రారంభంలో వచ్చిన మొగుడు కావాలి, న్యాయం కావాలి, కోతలరాయుడు చిత్రాలకు రచన చేసింది నేనే. ఆయన స్టార్ అయ్యాక... యముడికి మొగుడు, అత్తకు యముడు-అమ్మాయికి మొగుడు, దొంగమొగుడు... ఇలా చాలా సినిమాలకు రాశాను.
కళాత్మక చిత్రాలకు ఎక్కువగా రాయలేదని ఎప్పుడైనా బాధ అనిపించిందా?
లేదు.. నా దృష్టిలో సినిమా అంటే ఎంటర్టైన్మెంట్. సినిమాకు ఎంటర్టైన్మెంట్ టాక్స్ పెట్టారు కానీ, సీరియస్ టాక్స్ పెట్టలేదు కదా! సినిమా బావుండటం ముఖ్యం. మాయదారి మల్లిగాడు, న్యాయం కావాలి, పెళ్లిసందడి లాంటి సినిమాలకు రాసినందుకు గర్వపడతా.
అప్పట్లో జంధ్యాల, మీరూ పోటాపోటీగా రాసేవారు కదా?
మేమిద్దరం మంచి స్నేహితులం. ఇద్దరం కలిసి పది సినిమాలకు పనిచేశాం. వాటిలో నా కథకు ఆయన డైలాగులు రాస్తే, ఆయన కథకు నేను డైలాగులు రాశాను. నా సినిమాల గురించి ఆయనతో డిస్కస్ చేసేవాణ్ణి. ఆయన కూడా తన సినిమా గురించి నాతో డిస్కస్ చేసేవారు. చాలా ఆరోగ్యకరంగా ఉండేది మా బంధం. పారితోషికాలు కూడా దాదాపు సరిసమానంగా తీసుకునేవాళ్లం. మా ముందు తరం రైటర్లకు పదివేలు దాకా ఇచ్చేవారట. మేమిద్దరం 75 వేలు తీసుకునేవాళ్లం.
రచయితగా మీకు ప్రేరణ?
ఆత్రేయగారి డైలాగులంటే ఇష్టం. ముళ్లపూడి వెంకటర మణ, భమిడిపాటి రాధాకృష్ణమూర్తి హ్యూమర్ అంటే ఇష్టం. వీళ్ల రచనలు చూసి ‘ఇలా రాస్తే బావుండు’ అనుకుంటాను కానీ, వారిలా రాయడానికి ప్రయత్నించను.
మీ తర్వాత జనరేషన్లో మీకు నచ్చిన రచయిత?
త్రివిక్రమ్. ప్రస్తుతం తనే నంబర్వన్. రాబోయే జనరేషన్పై కూడా అతని ప్రభావం ఉంటుంది. తను బాగా చదువుకున్న వ్యక్తి. గొప్పగా రాస్తాడు.
ప్రస్తుతం పంచ్ డైలాగుల ట్రెండ్ నడుస్తోంది. దీనిపై మీ కామెంట్?
స్పాంటేనియస్గా చప్పట్లు కొట్టించడానికి పంచ్ డైలాగ్ అనేది ఉపయోగపడుతుంది. అంతేతప్ప కథతో దానికి సంబంధం ఉండదు. దీనివల్ల ఆడియన్స్ నుంచి త్వరగా రియాక్షన్ వస్తుంది. అందుకే పంచ్డైలాగులను ఆశ్రయిస్తున్నారు. కానీ నా ఉద్దేశంలో పంచ్ డైలాగైనా, మంచి డైలాగ్ అయినా సన్నివేశానికి తగ్గట్టే ఉండాలి. సందర్భంగా వచ్చే డైలాగ్ అప్పటికప్పుడు బావుంటుంది కానీ, రాన్రానూ జనానికి విసుగు వస్తుంది.
సినిమా మొదలయ్యేది పేపర్ వర్క్తో. అంతటి ప్రాధాన్యమున్న రైటర్కి ఇండస్ట్రీలో గౌరవం లేదనే వాదనతో మీరు ఏకీభవిస్తారా? పారితోషికాల్లోనూ రైటర్స్కి అన్యాయం జరుగుతోందంటున్నారు. మీరేమంటారు?
పరిశ్రమలో ఎవరికి తగ్గ గౌరవం వారికి తప్పకుండా లభిస్తుంది. ఇక్కడ టాలెంట్ ఎంత కౌంట్ చేస్తుందో, బిహేవియర్ కూడా అంత కౌంట్ చేస్తుంది. నా వరకు అయితే.... అలాంటి చేదు అనుభవాలు లేవు. ఇక రెమ్యునరేషన్లు అంటారా... మనం సక్సెస్ఫుల్గా పని చేస్తున్నప్పుడు డబ్బులు కూడా ఆటోమేటిగ్గా మనల్ని ఫాలో అవుతాయి. సక్సెస్ఫుల్గా చేయనప్పుడు సమస్యలొస్తాయి. సమస్యలు సృష్టించేవారు ప్రతి రంగంలోనూ ఉంటారు. ఒక్క సినిమా రంగంలోనే కాదు.
అందుకే ఆ సినిమా ఆడలేదు
నేను ఓ సినిమాను డెరైక్ట్ చేశానని చాలామందికి తెలీదు. ‘ఝాన్సీరాణి’ మంచి సినిమా. మల్లాది వెంకట కృష్ణమూర్తి ‘మిస్టర్ వి’ నవల ఆధారంగా తీశాను. ఆ సినిమాకు ముందే రాజేంద్రప్రసాద్ ‘లేడీస్టైలర్’ విడుదలైంది. తను కామెడీ స్టార్ అయిపోయాడు. తనతో సినిమా అనగానే... కామెడీనే ఎక్స్పెక్ట్ చేశారు. కానీ, ‘ఝాన్సీరాణి’లో అతనిది నెగిటివ్ పాత్ర. దాంతో జనానికి సహించలేదు. సినిమాకు మాత్రం మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత కొందరు నిర్మాతలు నాతో సినిమా చేయడానికి ముందుకొచ్చారు. కానీ, నాకే కుదర్లేదు.
- బుర్రా నరసింహ
పుట్టిన రోజు శుభాకాంక్షలు సార్?
పుట్టిన రోజు చేసుకునే అలవాటు నాకు మొదట్నుంచీ లేదు. దానికి పెద్ద ప్రాముఖ్యతను కూడా ఇవ్వను. అందుకే... నా పుట్టిన రోజు తేదీ చాలామందికి తెలీదు కూడా. గుర్తుంచుకున్నందుకు థ్యాంక్స్.
‘రచన- సత్యానంద్’... ఈ కార్డ్ తెరపై కనిపిస్తే చాలు ‘సినిమా హిట్’ అని నిర్ధారించుకునేవారు ప్రేక్షకులు. ఆ వైభవం గుర్తొస్తే ఏమనిపిస్తుంది?
సంతోషంగా ఉంటుంది. రచయితగా నాకంటూ ఓ గౌరవ స్థానాన్నిచ్చిన తెలుగు సినిమాకు జీవితాంతం రుణపడి ఉంటాను. నాకు రాయడం అంటే ఇష్టం. ఆ ఇష్టమే నన్ను ఈ స్థాయికి తెచ్చింది. నేను ఇంత ధాటిగా సినిమాలు రాశానంటే దానికి నా తొలి సినిమా విజయమే కారణం. ‘మాయదారి మల్లిగాడు’ నా తొలి చిత్రం. నా మేనమామగారైన ఆ చిత్ర దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు చెప్పిన చిన్న ఐడియా ఆధారంగా కథ తయారు చేసి ఆయనకు వినిపించాను. ఆ కథ నచ్చి.. ఆ చిత్రానికి మాటలు రాసే అవకాశాన్ని కూడా నాకే ఇచ్చారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత భారీ అఫర్లు వాటంతట అవే నా తలుపు తట్టాయి. 80ల్లో అయితే... ఊపిరి సలపకుండా పనిచేశాను. ఆ వయసు అలాంటిది. అవకాశాలొస్తుంటే... అన్నింటినీ నిలబెట్టుకోవాలనే కసి. ఒక సినిమా సెట్లో ఉంటే, రెండు సినిమాలు డిస్కషన్స్లో ఉండేవి. కె.రాఘవేంద్రరావుతోనే 45 సినిమాలకు పనిచేశాను. కోదండరామిరెడ్డితో 20 సినిమాలు చేశాను. కెరీర్ మొత్తం మీద 400 సినిమాలకు పై మాటే.
ఇలా జనరేషన్తో నిమిత్తం లేకుండా.. అప్ డేట్ అవ్వడం మీకే సాధ్యమైంది.
రచయితకు పరిశీలనాత్మక దృష్టి అవసరం. కథలు, మాటలు ఎక్కడ్నుంచో పుట్టవు. సమాజం నుంచే పుడతాయి. ఈ విషయం తెలిసిన వాణ్ణి కాబట్టే ఇలా ఉండగలుగుతున్నా. దర్శకుల మనోభావాలకు తగ్గట్టుగా నా రచనలు ఉంటాయి. ఇప్పుడు యంగ్స్టర్స్తో వర్క్ చేస్తున్నా. వాళ్ల ఆలోచనల్ని గమనిస్తున్నా. పుస్తకాలు చదువుతా. అది కూడా నాకు హెల్ప్ అయ్యింది.
మీ కెరీర్లో ఛాలెంజ్గా తీసుకొని రాసిన సినిమా?
శివాజీగణేశన్ నటించిన తమిళ చిత్రం ‘తంగపతకం’ని తెలుగులో చేయాలి అనుకున్నప్పుడు.. ఆ ఐడియాను మాత్రమే తీసుకొని, మాతృకకు పూర్తి భిన్నంగా ‘కొండవీటి సింహం’ కథ తయారు చేశాం. ఎన్టీఆర్కున్న నంబర్వన్ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన ఆ కథ నాకు మంచి పేరు తెచ్చింది. అలాగే.. ‘జస్టిస్చౌదరి’. ‘జడ్జి అంటే మాస్ అప్పీల్ ఏముంటుంది?’ అని స్వయంగా ఎన్టీఆర్గారే అన్నారు. దాంతో ఛాలెంజ్గా తీసుకొని మాస్ని మెస్మరైజ్ చేసేలా కథను తయారు చేశాం. ‘అద్భుతంగా చేశారు బ్రదర్’ అని ఎన్టీఆర్గారు అభినందించిన ఆ క్షణాలు నా కెరీర్లో మరచిపోలేనివి.
చూడ్డానికి సాఫ్ట్గా కనిపిస్తారు. ఇంత మాస్ సినిమాలు ఎలా చేశారు?
మర్డర్ చేసేవాడు కూడా మర్యాదగానే కనిపిస్తాడు (నవ్వుతూ).బయటకు నేనెలా కనిపించినా... నా లోపల ఉంది మాసే.
చిరంజీవి నటించిన ఎక్కువ హిట్ సినిమాలకు రచయిత మీరే కదా?
అదేంలేదు. అందరి హీరోలకూ రాశాను. చిరంజీవి కెరీర్ ప్రారంభంలో వచ్చిన మొగుడు కావాలి, న్యాయం కావాలి, కోతలరాయుడు చిత్రాలకు రచన చేసింది నేనే. ఆయన స్టార్ అయ్యాక... యముడికి మొగుడు, అత్తకు యముడు-అమ్మాయికి మొగుడు, దొంగమొగుడు... ఇలా చాలా సినిమాలకు రాశాను.
కళాత్మక చిత్రాలకు ఎక్కువగా రాయలేదని ఎప్పుడైనా బాధ అనిపించిందా?
లేదు.. నా దృష్టిలో సినిమా అంటే ఎంటర్టైన్మెంట్. సినిమాకు ఎంటర్టైన్మెంట్ టాక్స్ పెట్టారు కానీ, సీరియస్ టాక్స్ పెట్టలేదు కదా! సినిమా బావుండటం ముఖ్యం. మాయదారి మల్లిగాడు, న్యాయం కావాలి, పెళ్లిసందడి లాంటి సినిమాలకు రాసినందుకు గర్వపడతా.
అప్పట్లో జంధ్యాల, మీరూ పోటాపోటీగా రాసేవారు కదా?
మేమిద్దరం మంచి స్నేహితులం. ఇద్దరం కలిసి పది సినిమాలకు పనిచేశాం. వాటిలో నా కథకు ఆయన డైలాగులు రాస్తే, ఆయన కథకు నేను డైలాగులు రాశాను. నా సినిమాల గురించి ఆయనతో డిస్కస్ చేసేవాణ్ణి. ఆయన కూడా తన సినిమా గురించి నాతో డిస్కస్ చేసేవారు. చాలా ఆరోగ్యకరంగా ఉండేది మా బంధం. పారితోషికాలు కూడా దాదాపు సరిసమానంగా తీసుకునేవాళ్లం. మా ముందు తరం రైటర్లకు పదివేలు దాకా ఇచ్చేవారట. మేమిద్దరం 75 వేలు తీసుకునేవాళ్లం.
రచయితగా మీకు ప్రేరణ?
ఆత్రేయగారి డైలాగులంటే ఇష్టం. ముళ్లపూడి వెంకటర మణ, భమిడిపాటి రాధాకృష్ణమూర్తి హ్యూమర్ అంటే ఇష్టం. వీళ్ల రచనలు చూసి ‘ఇలా రాస్తే బావుండు’ అనుకుంటాను కానీ, వారిలా రాయడానికి ప్రయత్నించను.
మీ తర్వాత జనరేషన్లో మీకు నచ్చిన రచయిత?
త్రివిక్రమ్. ప్రస్తుతం తనే నంబర్వన్. రాబోయే జనరేషన్పై కూడా అతని ప్రభావం ఉంటుంది. తను బాగా చదువుకున్న వ్యక్తి. గొప్పగా రాస్తాడు.
ప్రస్తుతం పంచ్ డైలాగుల ట్రెండ్ నడుస్తోంది. దీనిపై మీ కామెంట్?
స్పాంటేనియస్గా చప్పట్లు కొట్టించడానికి పంచ్ డైలాగ్ అనేది ఉపయోగపడుతుంది. అంతేతప్ప కథతో దానికి సంబంధం ఉండదు. దీనివల్ల ఆడియన్స్ నుంచి త్వరగా రియాక్షన్ వస్తుంది. అందుకే పంచ్డైలాగులను ఆశ్రయిస్తున్నారు. కానీ నా ఉద్దేశంలో పంచ్ డైలాగైనా, మంచి డైలాగ్ అయినా సన్నివేశానికి తగ్గట్టే ఉండాలి. సందర్భంగా వచ్చే డైలాగ్ అప్పటికప్పుడు బావుంటుంది కానీ, రాన్రానూ జనానికి విసుగు వస్తుంది.
సినిమా మొదలయ్యేది పేపర్ వర్క్తో. అంతటి ప్రాధాన్యమున్న రైటర్కి ఇండస్ట్రీలో గౌరవం లేదనే వాదనతో మీరు ఏకీభవిస్తారా? పారితోషికాల్లోనూ రైటర్స్కి అన్యాయం జరుగుతోందంటున్నారు. మీరేమంటారు?
పరిశ్రమలో ఎవరికి తగ్గ గౌరవం వారికి తప్పకుండా లభిస్తుంది. ఇక్కడ టాలెంట్ ఎంత కౌంట్ చేస్తుందో, బిహేవియర్ కూడా అంత కౌంట్ చేస్తుంది. నా వరకు అయితే.... అలాంటి చేదు అనుభవాలు లేవు. ఇక రెమ్యునరేషన్లు అంటారా... మనం సక్సెస్ఫుల్గా పని చేస్తున్నప్పుడు డబ్బులు కూడా ఆటోమేటిగ్గా మనల్ని ఫాలో అవుతాయి. సక్సెస్ఫుల్గా చేయనప్పుడు సమస్యలొస్తాయి. సమస్యలు సృష్టించేవారు ప్రతి రంగంలోనూ ఉంటారు. ఒక్క సినిమా రంగంలోనే కాదు.
అందుకే ఆ సినిమా ఆడలేదు
నేను ఓ సినిమాను డెరైక్ట్ చేశానని చాలామందికి తెలీదు. ‘ఝాన్సీరాణి’ మంచి సినిమా. మల్లాది వెంకట కృష్ణమూర్తి ‘మిస్టర్ వి’ నవల ఆధారంగా తీశాను. ఆ సినిమాకు ముందే రాజేంద్రప్రసాద్ ‘లేడీస్టైలర్’ విడుదలైంది. తను కామెడీ స్టార్ అయిపోయాడు. తనతో సినిమా అనగానే... కామెడీనే ఎక్స్పెక్ట్ చేశారు. కానీ, ‘ఝాన్సీరాణి’లో అతనిది నెగిటివ్ పాత్ర. దాంతో జనానికి సహించలేదు. సినిమాకు మాత్రం మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత కొందరు నిర్మాతలు నాతో సినిమా చేయడానికి ముందుకొచ్చారు. కానీ, నాకే కుదర్లేదు.
- బుర్రా నరసింహ
పదకొండున్నరకి లంచ్ ఎందుకు చేయించారో అప్పుడర్థమైంది...
Sakshi | Updated: June 19, 2014 01:08 (IST)

హీరో రాజేంద్రప్రసాద్ - దర్శకుడు జంధ్యాలది హిట్ కాంబినేషన్. రెండు రెళ్లు ఆరు, అహ నా పెళ్లంట, వివాహ భోజనంబు, జయమ్ము నిశ్చయమ్మురా, విచిత్ర ప్రేమ, ప్రేమ జిందాబాద్... ఇలా అరడజను చిత్రాలు వీరి కలయికలో రూపొందాయి. జంధ్యాలంటే రాజేంద్రప్రసాద్కి ప్రాణం. తమది జన్మజన్మల బంధం అంటారాయన. జంధ్యాలతో పరిచయం నుంచి ఇప్పటికీ గుర్తొచ్చే సంఘటనల దాకా రాజేంద్రుని మదిలోని జ్ఞాపకాలు ‘సాక్షి’కి ప్రత్యేకం.
ఓ సినిమా షూటింగ్ పని మీద వైజాగ్ వెళ్లాను. కారులో భీమిలి వైపు వెళ్తుంటే, రోడ్డు పక్కన నందమూరి బాలకృష్ణ కనిపించాడు. నేను కారు దిగి ‘‘ఇదేంటి బాలా..! ఇక్కడేం చేస్తున్నావ్?’’ అనడిగా. ఆ పక్కన కొండ మీద కెమెరా యూనిట్ చూపించి ‘‘ ‘బాబాయ్-అబ్బాయ్’ షూటింగ్ జరుగుతోంది’’ అని చెప్పాడు. ఆ సినిమాకి దర్శకుడు జంధ్యాలగారు. నన్నాయనకు పరిచయం చేశాడు బాలకృష్ణ. ఆయన వెంటనే ‘‘ఈ సీన్ చేయడానికి ట్యాక్సీ డ్రైవర్ పాతిక టేక్లు తిన్నాడు. ఆ వేషం మీరు వేస్తారా?’’ అనడిగారు. నేను ఎస్, నో చెప్పక ముందే డ్రైవర్ దగ్గర్నుంచీ ఖాకీ చొక్కా తీసేసుకుని నాకిచ్చి వేసుకోమన్నారు. అంత పెద్ద వ్యక్తి అడిగితే చేయననడం బాగోదని, ఏదో ఓ ట్రాన్స్లో ఉన్నట్టుగా నేను ఆ ట్యాక్సీ డ్రైవర్ వేషం చేసేశాను. సింగిల్ టేక్లో షాట్ ఓకే. ‘‘ఏంటండీ... నాతో మరీ జూనియర్ ఆర్టిస్ట్ వేషం వేయించారు’’ అన్నాను. ‘‘దేవుడు మనిద్దర్నీ కలిపాడు. చూద్దాం... ఏమవుతుందో’’ అన్నారాయన.
కొన్ని రోజుల తర్వాత... జంధ్యాలగారి నుంచి ‘రెండు రెళ్ళు ఆరు’ కోసం కబురొచ్చింది. చంద్రమోహన్గారు, నేనూ హీరోలం. నాపై తీసిన ఫస్ట్ షాట్ డైలాగ్ ఏంటో తెలుసా? ‘‘ఏంటయ్యా... నేను కమెడియన్లా కనిపిస్తున్నానా? నేను హీరోని’’. ఇంతవరకూ బాగానే ఉంది. ఆ నెక్ట్స్ షాట్ మాత్రం నన్ను ఇరుకున పడేసింది. విఠలాచార్య సినిమాల్లో హీరో నరసింహరాజు కాస్ట్యూమ్ లాంటి దొకటి తీసుకొచ్చి నన్ను వేసుకోమన్నారు. రాజు గెటప్ అన్న మాట. నేను గుర్రం మీద ఓ పాడుబడిన కోట దగ్గరకు వెళ్లి ‘ఇది ఎవరి సంస్థానం?’ అనడగడంతో సినిమా టైటిల్స్ మొదలవుతాయి. ‘ఏమిటీ పిచ్చి డెరైక్షన్... ఎవడు డెరైక్టర్?’ అని నేను అడిగినప్పుడు, ఆ షాట్ ఫ్రీజ్ చేసి జంధ్యాల గారి పేరు వేస్త్తారన్నమాట. ఇలా మీ గురించి నేను కామెంట్ చేస్తే ‘జనం నన్ను తిడతారండీ’ అన్నాను. ‘‘రేపు థియేటర్లో చూడు... జనం దీనికి క్లాప్స్ కొడతారు’’ అని జంధ్యాలగారు ఒత్తిడి చేయడంతో, నేను ఇబ్బంది పడుతూనే ఆ షాట్ చేశాను. నిజంగానే ఆ షాట్కి థియేటర్లో క్లాప్స్ పడ్డాయి.
‘రెండు రెళ్లు ఆరు’లో నాది చాలా మంచి వేషం. ప్రముఖ మెజీషియన్ బీవీ పట్టాభిరామ్గారు, జంధ్యాల గారికి క్లోజ్ ఫ్రెండ్. ఈ సినిమాలో నేను కొన్ని మేజిక్స్ చేయాలి. అందుకోసం నన్ను పట్టాభిరామ్గారి దగ్గర మూడు రోజులు మేజిక్స్ నేర్చుకోమన్నారు. ఒక్క రోజులోనే నేర్చేసుకుని జంధ్యాల గారికి చూపిస్తే ఆనందపడిపోయారు. ఇక ‘వివాహ భోజనంబు’లో నాతో తొలిసారిగా లేడీ గెటప్ వేయించారు. అది జంధ్యాలగారి గొప్పతనమే. ‘వివాహ భోజనంబు’లో హీరోయిన్ ఇంటి ఎదురుగా నేను కానిస్టేబుల్ వేషంలో ఉండే ఎపిసోడ్లో నాకు అస్సలు డైలాగులు ఉండవు. అప్పుడు నేనిచ్చే ఎక్స్ప్రెషన్స్కి పొట్ట పట్టుకుని నవ్వాల్సిందే. డైలాగులు కూడా లేకుండా కామెడీ పుట్టించాలంటే జంధ్యాల గారి తర్వాతే ఎవరైనా.
‘వివాహ భోజనంబు’ షూటింగ్ వైజాగ్లో జరుగుతోంది. అప్పుడు టైమ్ ఉదయం పదకొండున్నర అవుతోంది. జంధ్యాలగారు నా దగ్గరకొచ్చి ‘‘బాగా ఆకలేస్తోంది. లంచ్కి వెళ్దాం పద’’ అన్నారు. ఇప్పుడు లంచ్ ఏంటండీ? అన్నాను. బలవంతంగా తీసుకెళ్లారు. జంధ్యాలగారు మంచి భోజన ప్రియులు. మేం రెగ్యులర్గా కలిసే భోంచేస్తుంటాం. నేను ఆయన కోసమని లంచ్ చేస్తున్నాను. అయితే అంత ఆకలి అన్న జంధ్యాలగారు పెద్దగా తినడం లేదు. ఆయన కళ్లల్లో నీళ్లు తిరుగుతుంటే, కర్చీఫ్తో తుడుచుకుంటున్నారు. సమ్థింగ్ రాంగ్ అనిపించి, ‘‘ఏం జరిగిందండీ?’’ అనడిగాను. ఆయన ఏం మాట్లాడలేదు. నా లంచ్ పూర్తయ్యాక, ‘‘ప్రసాద్..! అర్జంట్గా మీ ఊరు బయల్దేరు. మీ నాన్నగారు నిన్ను చూడాలనుకుంటున్నారట. కారు రెడీ’’ అని చెప్పారు. నాకు విషయం అర్థమైపోయింది. మా నాన్నగారు చనిపోయారన్న వార్త తెలిసి, ఇలా చేశారని అర్థమైంది. నా గురించి ఎంత కేర్ తీసుకున్నారో అనిపించింది.
మా ఇద్దరి కాంబినేషన్లో నెంబర్వన్ - ‘అహ నా పెళ్లంట’. ఆ సినిమా గురించి మాట్లాడుకోని తెలుగువాడు ఉండరంటే అతిశయోక్తి కాదు. నిర్మాత డి. రామానాయుడు గారికి స్టోరీ లైన్ చెబితే నచ్చేసింది. కానీ ఫుల్ స్క్రిప్ట్ ఉంటేనే షూటింగ్ మొదలుపెడతానని చెప్పారట. మరి ఈయనకు పౌరుషం వచ్చిందో ఏమో, రాత్రికి రాత్రి కూర్చుని ‘అహ నా పెళ్లంట’ స్క్రిప్ట్ రాసేశారు. నేను చాలామంది దర్శకులతో పని చేశాను కానీ, జంధ్యాల తరహా పనితీరు ఎక్కడా చూడలేదు. ఆయన షూటింగ్ అంటే ఓ పిక్నిక్ కింద లెక్క. ఎంత సందడిగా ఉంటుందో. ఆయన మాట్లాడే ప్రతి మాటలోనూ ఫన్ ఉంటుంది. అలాగే ఎవర్నీ హర్ట్ చేసిన సందర్భం లేదు. బాగా కోపం వచ్చిందంటే... ఓ చోట సెలైంట్గా కూర్చునేవారు తప్ప, ఒక్క పరుష వాక్యం మాట్లాడేవారు కాదు.
చుట్టుపక్కల జరిగేవాటి నుంచే ఆయన బోలెడంత కామెడీ పుట్టిస్తారు. అప్పటికప్పుడు సీన్లు సృష్టించేస్తారు. స్పాట్ ఇంప్రొవైజేషన్స్ బ్రహ్మాండం. జంధ్యాల ఎంత గొప్పగా రాసేవారో, అంత గొప్పగా మాట్లాడేవారు. అంతకన్నా గొప్పగా డెరైక్షన్ చేసేవారు. ఆయనలోని మరో గొప్ప విషయం - ఏదీ శ్రుతి మించకపోవడం. బూతు అనేది ఆయన అక్షరాల్లో భూతద్దం వేసినా కనబడదు. అంతా సహజత్వమే. ఎక్కడా కృత్రిమత్వం ఉండదు. ఆయన కామెడీ ప్రాణంతో ఉన్న బొమ్మ లాంటిది. జంధ్యాల ఓ క్రియేటివ్ జీనియస్. కొంతమంది గొప్ప గొప్ప వాళ్లని దేవుడు ఏదో అర్జంట్ పని ఉన్నట్టుగా పైకి తీసుకుపోతాడు. ఈ కెరీర్లో దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అందమైన కల జంధ్యాలగారు. ఆయన ఎప్పుడూ గుర్తొస్తుంటారు. జంధ్యాలగారు నాకు బ్రదరా? బాబాయా? బావా? తండ్రా? స్నేహితుడా? ఏమో... మా ఇద్దరి మధ్య ఏదో రుణానుబంధం ఉన్నట్టే అనిపిస్తుంది. ఓ బిడ్డను చూసుకున్నట్టుగానే నన్ను చూసుకున్నారు. జంధ్యాల గారు బతికి ఉండి ఉంటే మా కాంబినేషన్లో మరిన్ని ‘అహ నా పెళ్లంట’లు వచ్చేవి.
ఓ సినిమా షూటింగ్ పని మీద వైజాగ్ వెళ్లాను. కారులో భీమిలి వైపు వెళ్తుంటే, రోడ్డు పక్కన నందమూరి బాలకృష్ణ కనిపించాడు. నేను కారు దిగి ‘‘ఇదేంటి బాలా..! ఇక్కడేం చేస్తున్నావ్?’’ అనడిగా. ఆ పక్కన కొండ మీద కెమెరా యూనిట్ చూపించి ‘‘ ‘బాబాయ్-అబ్బాయ్’ షూటింగ్ జరుగుతోంది’’ అని చెప్పాడు. ఆ సినిమాకి దర్శకుడు జంధ్యాలగారు. నన్నాయనకు పరిచయం చేశాడు బాలకృష్ణ. ఆయన వెంటనే ‘‘ఈ సీన్ చేయడానికి ట్యాక్సీ డ్రైవర్ పాతిక టేక్లు తిన్నాడు. ఆ వేషం మీరు వేస్తారా?’’ అనడిగారు. నేను ఎస్, నో చెప్పక ముందే డ్రైవర్ దగ్గర్నుంచీ ఖాకీ చొక్కా తీసేసుకుని నాకిచ్చి వేసుకోమన్నారు. అంత పెద్ద వ్యక్తి అడిగితే చేయననడం బాగోదని, ఏదో ఓ ట్రాన్స్లో ఉన్నట్టుగా నేను ఆ ట్యాక్సీ డ్రైవర్ వేషం చేసేశాను. సింగిల్ టేక్లో షాట్ ఓకే. ‘‘ఏంటండీ... నాతో మరీ జూనియర్ ఆర్టిస్ట్ వేషం వేయించారు’’ అన్నాను. ‘‘దేవుడు మనిద్దర్నీ కలిపాడు. చూద్దాం... ఏమవుతుందో’’ అన్నారాయన.
కొన్ని రోజుల తర్వాత... జంధ్యాలగారి నుంచి ‘రెండు రెళ్ళు ఆరు’ కోసం కబురొచ్చింది. చంద్రమోహన్గారు, నేనూ హీరోలం. నాపై తీసిన ఫస్ట్ షాట్ డైలాగ్ ఏంటో తెలుసా? ‘‘ఏంటయ్యా... నేను కమెడియన్లా కనిపిస్తున్నానా? నేను హీరోని’’. ఇంతవరకూ బాగానే ఉంది. ఆ నెక్ట్స్ షాట్ మాత్రం నన్ను ఇరుకున పడేసింది. విఠలాచార్య సినిమాల్లో హీరో నరసింహరాజు కాస్ట్యూమ్ లాంటి దొకటి తీసుకొచ్చి నన్ను వేసుకోమన్నారు. రాజు గెటప్ అన్న మాట. నేను గుర్రం మీద ఓ పాడుబడిన కోట దగ్గరకు వెళ్లి ‘ఇది ఎవరి సంస్థానం?’ అనడగడంతో సినిమా టైటిల్స్ మొదలవుతాయి. ‘ఏమిటీ పిచ్చి డెరైక్షన్... ఎవడు డెరైక్టర్?’ అని నేను అడిగినప్పుడు, ఆ షాట్ ఫ్రీజ్ చేసి జంధ్యాల గారి పేరు వేస్త్తారన్నమాట. ఇలా మీ గురించి నేను కామెంట్ చేస్తే ‘జనం నన్ను తిడతారండీ’ అన్నాను. ‘‘రేపు థియేటర్లో చూడు... జనం దీనికి క్లాప్స్ కొడతారు’’ అని జంధ్యాలగారు ఒత్తిడి చేయడంతో, నేను ఇబ్బంది పడుతూనే ఆ షాట్ చేశాను. నిజంగానే ఆ షాట్కి థియేటర్లో క్లాప్స్ పడ్డాయి.
‘రెండు రెళ్లు ఆరు’లో నాది చాలా మంచి వేషం. ప్రముఖ మెజీషియన్ బీవీ పట్టాభిరామ్గారు, జంధ్యాల గారికి క్లోజ్ ఫ్రెండ్. ఈ సినిమాలో నేను కొన్ని మేజిక్స్ చేయాలి. అందుకోసం నన్ను పట్టాభిరామ్గారి దగ్గర మూడు రోజులు మేజిక్స్ నేర్చుకోమన్నారు. ఒక్క రోజులోనే నేర్చేసుకుని జంధ్యాల గారికి చూపిస్తే ఆనందపడిపోయారు. ఇక ‘వివాహ భోజనంబు’లో నాతో తొలిసారిగా లేడీ గెటప్ వేయించారు. అది జంధ్యాలగారి గొప్పతనమే. ‘వివాహ భోజనంబు’లో హీరోయిన్ ఇంటి ఎదురుగా నేను కానిస్టేబుల్ వేషంలో ఉండే ఎపిసోడ్లో నాకు అస్సలు డైలాగులు ఉండవు. అప్పుడు నేనిచ్చే ఎక్స్ప్రెషన్స్కి పొట్ట పట్టుకుని నవ్వాల్సిందే. డైలాగులు కూడా లేకుండా కామెడీ పుట్టించాలంటే జంధ్యాల గారి తర్వాతే ఎవరైనా.
‘వివాహ భోజనంబు’ షూటింగ్ వైజాగ్లో జరుగుతోంది. అప్పుడు టైమ్ ఉదయం పదకొండున్నర అవుతోంది. జంధ్యాలగారు నా దగ్గరకొచ్చి ‘‘బాగా ఆకలేస్తోంది. లంచ్కి వెళ్దాం పద’’ అన్నారు. ఇప్పుడు లంచ్ ఏంటండీ? అన్నాను. బలవంతంగా తీసుకెళ్లారు. జంధ్యాలగారు మంచి భోజన ప్రియులు. మేం రెగ్యులర్గా కలిసే భోంచేస్తుంటాం. నేను ఆయన కోసమని లంచ్ చేస్తున్నాను. అయితే అంత ఆకలి అన్న జంధ్యాలగారు పెద్దగా తినడం లేదు. ఆయన కళ్లల్లో నీళ్లు తిరుగుతుంటే, కర్చీఫ్తో తుడుచుకుంటున్నారు. సమ్థింగ్ రాంగ్ అనిపించి, ‘‘ఏం జరిగిందండీ?’’ అనడిగాను. ఆయన ఏం మాట్లాడలేదు. నా లంచ్ పూర్తయ్యాక, ‘‘ప్రసాద్..! అర్జంట్గా మీ ఊరు బయల్దేరు. మీ నాన్నగారు నిన్ను చూడాలనుకుంటున్నారట. కారు రెడీ’’ అని చెప్పారు. నాకు విషయం అర్థమైపోయింది. మా నాన్నగారు చనిపోయారన్న వార్త తెలిసి, ఇలా చేశారని అర్థమైంది. నా గురించి ఎంత కేర్ తీసుకున్నారో అనిపించింది.
మా ఇద్దరి కాంబినేషన్లో నెంబర్వన్ - ‘అహ నా పెళ్లంట’. ఆ సినిమా గురించి మాట్లాడుకోని తెలుగువాడు ఉండరంటే అతిశయోక్తి కాదు. నిర్మాత డి. రామానాయుడు గారికి స్టోరీ లైన్ చెబితే నచ్చేసింది. కానీ ఫుల్ స్క్రిప్ట్ ఉంటేనే షూటింగ్ మొదలుపెడతానని చెప్పారట. మరి ఈయనకు పౌరుషం వచ్చిందో ఏమో, రాత్రికి రాత్రి కూర్చుని ‘అహ నా పెళ్లంట’ స్క్రిప్ట్ రాసేశారు. నేను చాలామంది దర్శకులతో పని చేశాను కానీ, జంధ్యాల తరహా పనితీరు ఎక్కడా చూడలేదు. ఆయన షూటింగ్ అంటే ఓ పిక్నిక్ కింద లెక్క. ఎంత సందడిగా ఉంటుందో. ఆయన మాట్లాడే ప్రతి మాటలోనూ ఫన్ ఉంటుంది. అలాగే ఎవర్నీ హర్ట్ చేసిన సందర్భం లేదు. బాగా కోపం వచ్చిందంటే... ఓ చోట సెలైంట్గా కూర్చునేవారు తప్ప, ఒక్క పరుష వాక్యం మాట్లాడేవారు కాదు.
చుట్టుపక్కల జరిగేవాటి నుంచే ఆయన బోలెడంత కామెడీ పుట్టిస్తారు. అప్పటికప్పుడు సీన్లు సృష్టించేస్తారు. స్పాట్ ఇంప్రొవైజేషన్స్ బ్రహ్మాండం. జంధ్యాల ఎంత గొప్పగా రాసేవారో, అంత గొప్పగా మాట్లాడేవారు. అంతకన్నా గొప్పగా డెరైక్షన్ చేసేవారు. ఆయనలోని మరో గొప్ప విషయం - ఏదీ శ్రుతి మించకపోవడం. బూతు అనేది ఆయన అక్షరాల్లో భూతద్దం వేసినా కనబడదు. అంతా సహజత్వమే. ఎక్కడా కృత్రిమత్వం ఉండదు. ఆయన కామెడీ ప్రాణంతో ఉన్న బొమ్మ లాంటిది. జంధ్యాల ఓ క్రియేటివ్ జీనియస్. కొంతమంది గొప్ప గొప్ప వాళ్లని దేవుడు ఏదో అర్జంట్ పని ఉన్నట్టుగా పైకి తీసుకుపోతాడు. ఈ కెరీర్లో దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అందమైన కల జంధ్యాలగారు. ఆయన ఎప్పుడూ గుర్తొస్తుంటారు. జంధ్యాలగారు నాకు బ్రదరా? బాబాయా? బావా? తండ్రా? స్నేహితుడా? ఏమో... మా ఇద్దరి మధ్య ఏదో రుణానుబంధం ఉన్నట్టే అనిపిస్తుంది. ఓ బిడ్డను చూసుకున్నట్టుగానే నన్ను చూసుకున్నారు. జంధ్యాల గారు బతికి ఉండి ఉంటే మా కాంబినేషన్లో మరిన్ని ‘అహ నా పెళ్లంట’లు వచ్చేవి.
సినీ జీవిత నిష్ఠూరాలపై ఫోకస్ లైట్
Sakshi | Updated: February 02, 2015 16:37 (IST)

అందుకే... అంత బాగుంది!
లెమ్ లైట్ (1952)
తారాగణం: చార్లీ చాప్లిన్, క్లెయిర్ బ్లూమ్, నిగెల్ బ్రూస్, బిస్టర్ కీటన్, సిడ్నీ ఎర్ల్ చాప్లిన్, వీలర్ డ్రైడెన్, నార్మన్ లాయిడ్, సంగీతం: చార్లీ చాప్లిన్, రచన-నిర్మాత-దర్శకుడు: చార్లీ చాప్లిన్, విడుదల: 1952, ఛాయాగ్రహణం: కార్ల్ స్ట్రస్, సినిమా నిడివి: 137 నిమిషాలు,
నిర్మాణ వ్యయం: 9 లక్షల డాలర్లు (ఇప్పటి లెక్కలో దాదాపు 5 కోట్ల 40 లక్షల రూపాయలు), వసూళ్లు: 80 లక్షల డాలర్లు (48 కోట్ల రూపాయలు)
చార్లీ చాప్లిన్! కామెడీ కింగ్... కాదు విషాద కథానాయకుడు...
మానవాళికి ఓ దివ్య వరం!
ఒక సినిమా... ఒక కళాకారుడూ మానవ జీవితం మీద, ఆ మాటకొస్తే యావత్ భూగోళంలో ఉన్న మానవజాతి మీద ఇంత ప్రభావం చూపించడం సాధ్యమా... అనిపిస్తుంది!
అరవై ఏళ్ల క్రితం... అంటే ఇంచుమించు నేను పుట్టక ముందు తీసిన సినిమా... ఇంకా నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోందంటే... ఆ కళారూపానికి సాష్టాంగ పడడం తప్ప మరేం చేయగలం...
లైమ్లైట్!... 1952లో వచ్చిన చిత్రం...
అప్పటి దాకా మూకీ యుగాన్ని శాసించిన చాప్లిన్, సినిమాకి మాట వచ్చాక చేసిన మహోన్నత చిత్రం - ఓ కళాకారుడి జీవిత కథ... ఓ రకంగా ఇది చాప్లిన్ కథే కావచ్చు గూడా.
టూకీగా ‘కాల్వెరో’ అనే కమెడియన్ అవసానదశలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకుంటూ... నానా రకాలుగా మానసికంగా కుంగిపోయి... ఒకసారి హార్ట్ అటాక్కి కూడా గురై ఏదో జీవితం లాగిస్తున్న వాడల్లా.. ఆత్మహత్యకు పాల్పడబోయిన ‘టెర్రీ’ అనే కళాకారిణిని కాపాడడం ... తర్వాత ఆమెకు ధైర్యం నూరిపోసి... మళ్లీ ఆమె చేత అర్థవంతంగా డాన్స్ చేయించడం... కృతజ్ఞతగా... ఆ పిల్ల వయస్సులో తనకన్నా పెద్దవాడైన కాల్వెరోని గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకుందామని చెప్తే... వయస్సులో ఉన్న ఆ పిల్లను సముదాయించలేక మరో గత్యంతరం లేక... ఆ పిల్ల జీవితంలో నుంచి తానే పారిపోవడం... చివరికి మళ్లీ కలిసి... జాయింట్గా ప్రదర్శనలిచ్చి... ఏ ప్రేక్షకులైతే తనను నిరాదరించారో, వాళ్లతో నీరాజనాలు పట్టించుకుని... తృప్తిగా వెళ్లిపోవడం... జీవితం కొనసాగించడం...
స్థూలంగా ఇదే కథైనా... జనరల్గా చాప్లిన్ మూకీ చిత్రాల్లో ఉండే.. బాడీ లాంగ్వేజ్ ఇందులో ఉండదు. అసలు చాలాసేపటి వరకూ మనం చాప్లిన్ని గుర్తుపట్టం! తెల్లటి జుట్టుతో... క్లీన్ షేవ్తో చాలా డిగ్నిఫైడ్గా... కొన్నిచోట్ల చాలా సీరియస్గా కనిపిస్తాడు. జీవితంలో నుంచి బలవంతంగా పారిపోదామనుకుంటున్న టెర్రీకి... జీవిత ధర్మాన్ని చెబుతున్నప్పుడు కౌరవ సేన మధ్య గాండీవం, గుండె రెండూ జారిపోయిన అర్జునుణ్ణి కార్యోన్ముఖుణ్ణి చేసిన కృష్ణుడిలా అనిపించాడు చాప్లిన్. ఓ వైపు జీవితంలో అన్ని రకాలుగా చితికి పోయినా, జీవిత మాధుర్యాన్ని బొట్టుబొట్టుగా గ్రోలుతూ ‘లైఫ్ ఈజ్ నో మీనింగ్, ఇట్స్ ఓన్లీ డిజైర్’ (ఔజీజ్ఛ జీట ౌ ఝ్ఛ్చజీజ, ఐ్ట’ట ౌడ ఈ్ఛటజీట్ఛ) అని చెప్పే చాప్లిన్ని చూస్తే... జీవితం మీద ఆశ పుడుతుంది.
ఎంతటి మహానటుడైనా... ‘లైమ్లైట్’లో ఉన్నంత కాలమే!... తర్వాత పట్టించుకునే నాథుడుండడు అనే కర్కశమైన సత్యానికి బొమ్మకట్టాడు చాప్లిన్. అవును ‘లైమ్లైట్లో’ ఉంటే నీకు నీరాజనాలు... నీ నెత్తి మీద నుంచి లైట్ వెళ్లిపోతే నిన్ను గుర్తించలేదని నువ్వు ఏడవడం ఎందుకు? అసలు నువ్వు కనపడితే కదా!
సిన్మా చూస్తున్నంతసేపూ... మన కళ్ల ముందు సావిత్రులూ... నాగయ్యలూ... రాజనాలలూ... కాంతారావులూ... శివరామ్లూ... కదలాడుతూనే ఉంటారు.
దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో అని కదూ... దీపం ఉండగా గుండె నిండా వెలుగులు నింపుకో... ఆ వెలుగులు పదిమందికీ పంచు... ఇదీ లైమ్లైట్ సారాంశం!
సినిమా చూస్తున్నప్పుడు చాప్లిన్... నట విశ్వరూపా నికి మనం హారతులు పట్టాల్సిందే! నవరసాల్నీ క్షణాల మీద కురిపించిన ఆ నటరాజు అభినయానికి మనం అవాక్కయిపోతాం.
అలాగే... మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకుందామనుకున్న లిల్లీ లాంటి పిల్ల మీద కాల్వెరో కరుణ చిలకరించేటప్పటికి లిల్లీలా విరిసిన తీరు... టెర్రీ పాత్రలో క్లెయిర్ బ్లూమ్ నవ్వినప్పుడల్లా... ప్రేక్షకుడి గుండె గిలక్కాయలా కొట్టుకుంటుంది...
ఎంత అందమైన నవ్వు...
అలాగే బ్లాక్ అండ్ వైట్లో... లైట్ అండ్ షేడ్స్లో చిత్రీకరించిన విధానం... ప్రతీ షాటూ కథ చెబుతుంది! చాలాసార్లు చాప్లిన్ బాధను తనలో దిగమింగుకుంటాడు. ఆ సీన్లలో గుక్కెట్టి ఏడుస్తాం. సినిమాలు నాటకాలైపోతున్న ఈ రోజుల్లో కళ్ల ముందు, ఓ కళాకారుడి జీవితాన్ని కిటికీ తెరిచి చూస్తున్నట్టనిపించే ‘లైమ్లైట్’ చిరస్మరణీయ చిత్రం.
ఇంకోళ్లకి సాయపడ్డానికి కాల్వరో పడుతున్న తాపత్రయం చూస్తే మనలోంచి మనిషి... మంచి మనిషి మళ్లీ పుట్టుకొచ్చి, తోటివాణ్ణి పట్టించుకోని ప్రస్తుత పరిస్థితికి సిగ్గుపడతాం. మన మీద మనం జాలి పడతాం. మూడో కంటికి తెలియకుండా మనల్ని మనం అసహ్యించుకుంటాం.
అలాగే... తనకు సాయం చేసి... తనకి కొత్త బతుకిచ్చిన కాల్వెరో పట్ల టెర్రీ కృతజ్ఞతాభావంతో లొంగిపోవడం... ఆమె కళ్లల్లో అతని పట్ల ఆరాధన చూస్తే మనకు సిగ్గేసి, కృతఘు్నలకి ఓ నమస్కారం చేస్తాం.
మనసు కరిగించే కథ.. వజ్రాలు పొదిగినట్లు డైలాగులు... నటనంటే ఇదిరా అనిపించే అభినయం... ఓ కమ్మటి కల కని... కన్నీళ్లు తుడుచుకున్నట్లనిపించే ‘లైమ్లైట్’ చూడకపోతే వెంటనే చూడండి! కుదిరితే డీవీడీ కొని ఇంట్లో అపురూప నిధిగా దాచుకోండి!
మీకు సంతోషం కలిగినప్పుడూ... కోపం వచ్చినప్పుడూ... హృదయం ద్రవించినప్పుడూ... గుండె రాయైనప్పుడూ... చూడండి! మళ్లీ... మన జీవితాల మీద కొత్త కాంతి ప్రసరించి తమాషాగా మళ్లీ మనుషులమవుతాం...
ప్రపంచ సినిమాలో చిరంజీవి
జగత్ప్రసిద్ధ ఇంగ్లీషు హాస్య నటుడు, చలనచిత్ర రూపకర్త చార్లీ చాప్లిన్ (1889 - 1977). మూకీ సినిమా యుగంలో ప్రేక్షకులను ఊపేసి, తన సినిమాలతో ప్రపంచాన్ని జయించిన కళాకారుడు. చిన్నవయసులోనే నటించడం మొదలుపెట్టి 88 ఏళ్ళ వయసులో మరణించడానికి ఏడాది ముందు దాకా విస్తరించిన 75 ఏళ్ళ సుదీర్ఘమైన కెరీర్ ఆయనది. కష్టాలు, కన్నీళ్ళు, దుర్భర దారిద్య్రం నుంచి కష్టపడి పైకొచ్చి తన ట్రేడ్ మార్క్ టోపీ, టూత్బ్రష్ లాంటి మీసం, చిత్రమైన వేషధారణతో అందరినీ ఆకట్టుకున్న చాప్లిన్ మొదట్లో తన లఘు చిత్రాల దర్శకులకు సలహాలు చెప్పి, వారి కోపానికి గురవుతుండేవారు. అయితే, ఆ లఘుచిత్రాలకు లభించిన ఆదరణ కారణంగా మరిన్ని చిత్రాలు కావాలంటూ డిస్ట్రిబ్యూటర్లు దర్శకులను కోరడంతో చాప్లిన్ దర్శకుడయ్యారు.
లెమ్ లైట్ (1952)
తారాగణం: చార్లీ చాప్లిన్, క్లెయిర్ బ్లూమ్, నిగెల్ బ్రూస్, బిస్టర్ కీటన్, సిడ్నీ ఎర్ల్ చాప్లిన్, వీలర్ డ్రైడెన్, నార్మన్ లాయిడ్, సంగీతం: చార్లీ చాప్లిన్, రచన-నిర్మాత-దర్శకుడు: చార్లీ చాప్లిన్, విడుదల: 1952, ఛాయాగ్రహణం: కార్ల్ స్ట్రస్, సినిమా నిడివి: 137 నిమిషాలు,
నిర్మాణ వ్యయం: 9 లక్షల డాలర్లు (ఇప్పటి లెక్కలో దాదాపు 5 కోట్ల 40 లక్షల రూపాయలు), వసూళ్లు: 80 లక్షల డాలర్లు (48 కోట్ల రూపాయలు)
చార్లీ చాప్లిన్! కామెడీ కింగ్... కాదు విషాద కథానాయకుడు...
మానవాళికి ఓ దివ్య వరం!
ఒక సినిమా... ఒక కళాకారుడూ మానవ జీవితం మీద, ఆ మాటకొస్తే యావత్ భూగోళంలో ఉన్న మానవజాతి మీద ఇంత ప్రభావం చూపించడం సాధ్యమా... అనిపిస్తుంది!
అరవై ఏళ్ల క్రితం... అంటే ఇంచుమించు నేను పుట్టక ముందు తీసిన సినిమా... ఇంకా నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోందంటే... ఆ కళారూపానికి సాష్టాంగ పడడం తప్ప మరేం చేయగలం...
లైమ్లైట్!... 1952లో వచ్చిన చిత్రం...
అప్పటి దాకా మూకీ యుగాన్ని శాసించిన చాప్లిన్, సినిమాకి మాట వచ్చాక చేసిన మహోన్నత చిత్రం - ఓ కళాకారుడి జీవిత కథ... ఓ రకంగా ఇది చాప్లిన్ కథే కావచ్చు గూడా.

టూకీగా ‘కాల్వెరో’ అనే కమెడియన్ అవసానదశలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకుంటూ... నానా రకాలుగా మానసికంగా కుంగిపోయి... ఒకసారి హార్ట్ అటాక్కి కూడా గురై ఏదో జీవితం లాగిస్తున్న వాడల్లా.. ఆత్మహత్యకు పాల్పడబోయిన ‘టెర్రీ’ అనే కళాకారిణిని కాపాడడం ... తర్వాత ఆమెకు ధైర్యం నూరిపోసి... మళ్లీ ఆమె చేత అర్థవంతంగా డాన్స్ చేయించడం... కృతజ్ఞతగా... ఆ పిల్ల వయస్సులో తనకన్నా పెద్దవాడైన కాల్వెరోని గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకుందామని చెప్తే... వయస్సులో ఉన్న ఆ పిల్లను సముదాయించలేక మరో గత్యంతరం లేక... ఆ పిల్ల జీవితంలో నుంచి తానే పారిపోవడం... చివరికి మళ్లీ కలిసి... జాయింట్గా ప్రదర్శనలిచ్చి... ఏ ప్రేక్షకులైతే తనను నిరాదరించారో, వాళ్లతో నీరాజనాలు పట్టించుకుని... తృప్తిగా వెళ్లిపోవడం... జీవితం కొనసాగించడం...
స్థూలంగా ఇదే కథైనా... జనరల్గా చాప్లిన్ మూకీ చిత్రాల్లో ఉండే.. బాడీ లాంగ్వేజ్ ఇందులో ఉండదు. అసలు చాలాసేపటి వరకూ మనం చాప్లిన్ని గుర్తుపట్టం! తెల్లటి జుట్టుతో... క్లీన్ షేవ్తో చాలా డిగ్నిఫైడ్గా... కొన్నిచోట్ల చాలా సీరియస్గా కనిపిస్తాడు. జీవితంలో నుంచి బలవంతంగా పారిపోదామనుకుంటున్న టెర్రీకి... జీవిత ధర్మాన్ని చెబుతున్నప్పుడు కౌరవ సేన మధ్య గాండీవం, గుండె రెండూ జారిపోయిన అర్జునుణ్ణి కార్యోన్ముఖుణ్ణి చేసిన కృష్ణుడిలా అనిపించాడు చాప్లిన్. ఓ వైపు జీవితంలో అన్ని రకాలుగా చితికి పోయినా, జీవిత మాధుర్యాన్ని బొట్టుబొట్టుగా గ్రోలుతూ ‘లైఫ్ ఈజ్ నో మీనింగ్, ఇట్స్ ఓన్లీ డిజైర్’ (ఔజీజ్ఛ జీట ౌ ఝ్ఛ్చజీజ, ఐ్ట’ట ౌడ ఈ్ఛటజీట్ఛ) అని చెప్పే చాప్లిన్ని చూస్తే... జీవితం మీద ఆశ పుడుతుంది.
ఎంతటి మహానటుడైనా... ‘లైమ్లైట్’లో ఉన్నంత కాలమే!... తర్వాత పట్టించుకునే నాథుడుండడు అనే కర్కశమైన సత్యానికి బొమ్మకట్టాడు చాప్లిన్. అవును ‘లైమ్లైట్లో’ ఉంటే నీకు నీరాజనాలు... నీ నెత్తి మీద నుంచి లైట్ వెళ్లిపోతే నిన్ను గుర్తించలేదని నువ్వు ఏడవడం ఎందుకు? అసలు నువ్వు కనపడితే కదా!
సిన్మా చూస్తున్నంతసేపూ... మన కళ్ల ముందు సావిత్రులూ... నాగయ్యలూ... రాజనాలలూ... కాంతారావులూ... శివరామ్లూ... కదలాడుతూనే ఉంటారు.
దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో అని కదూ... దీపం ఉండగా గుండె నిండా వెలుగులు నింపుకో... ఆ వెలుగులు పదిమందికీ పంచు... ఇదీ లైమ్లైట్ సారాంశం!
సినిమా చూస్తున్నప్పుడు చాప్లిన్... నట విశ్వరూపా నికి మనం హారతులు పట్టాల్సిందే! నవరసాల్నీ క్షణాల మీద కురిపించిన ఆ నటరాజు అభినయానికి మనం అవాక్కయిపోతాం.
అలాగే... మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకుందామనుకున్న లిల్లీ లాంటి పిల్ల మీద కాల్వెరో కరుణ చిలకరించేటప్పటికి లిల్లీలా విరిసిన తీరు... టెర్రీ పాత్రలో క్లెయిర్ బ్లూమ్ నవ్వినప్పుడల్లా... ప్రేక్షకుడి గుండె గిలక్కాయలా కొట్టుకుంటుంది...
ఎంత అందమైన నవ్వు...
అలాగే బ్లాక్ అండ్ వైట్లో... లైట్ అండ్ షేడ్స్లో చిత్రీకరించిన విధానం... ప్రతీ షాటూ కథ చెబుతుంది! చాలాసార్లు చాప్లిన్ బాధను తనలో దిగమింగుకుంటాడు. ఆ సీన్లలో గుక్కెట్టి ఏడుస్తాం. సినిమాలు నాటకాలైపోతున్న ఈ రోజుల్లో కళ్ల ముందు, ఓ కళాకారుడి జీవితాన్ని కిటికీ తెరిచి చూస్తున్నట్టనిపించే ‘లైమ్లైట్’ చిరస్మరణీయ చిత్రం.
ఇంకోళ్లకి సాయపడ్డానికి కాల్వరో పడుతున్న తాపత్రయం చూస్తే మనలోంచి మనిషి... మంచి మనిషి మళ్లీ పుట్టుకొచ్చి, తోటివాణ్ణి పట్టించుకోని ప్రస్తుత పరిస్థితికి సిగ్గుపడతాం. మన మీద మనం జాలి పడతాం. మూడో కంటికి తెలియకుండా మనల్ని మనం అసహ్యించుకుంటాం.
అలాగే... తనకు సాయం చేసి... తనకి కొత్త బతుకిచ్చిన కాల్వెరో పట్ల టెర్రీ కృతజ్ఞతాభావంతో లొంగిపోవడం... ఆమె కళ్లల్లో అతని పట్ల ఆరాధన చూస్తే మనకు సిగ్గేసి, కృతఘు్నలకి ఓ నమస్కారం చేస్తాం.
మనసు కరిగించే కథ.. వజ్రాలు పొదిగినట్లు డైలాగులు... నటనంటే ఇదిరా అనిపించే అభినయం... ఓ కమ్మటి కల కని... కన్నీళ్లు తుడుచుకున్నట్లనిపించే ‘లైమ్లైట్’ చూడకపోతే వెంటనే చూడండి! కుదిరితే డీవీడీ కొని ఇంట్లో అపురూప నిధిగా దాచుకోండి!
మీకు సంతోషం కలిగినప్పుడూ... కోపం వచ్చినప్పుడూ... హృదయం ద్రవించినప్పుడూ... గుండె రాయైనప్పుడూ... చూడండి! మళ్లీ... మన జీవితాల మీద కొత్త కాంతి ప్రసరించి తమాషాగా మళ్లీ మనుషులమవుతాం...
ప్రపంచ సినిమాలో చిరంజీవి
జగత్ప్రసిద్ధ ఇంగ్లీషు హాస్య నటుడు, చలనచిత్ర రూపకర్త చార్లీ చాప్లిన్ (1889 - 1977). మూకీ సినిమా యుగంలో ప్రేక్షకులను ఊపేసి, తన సినిమాలతో ప్రపంచాన్ని జయించిన కళాకారుడు. చిన్నవయసులోనే నటించడం మొదలుపెట్టి 88 ఏళ్ళ వయసులో మరణించడానికి ఏడాది ముందు దాకా విస్తరించిన 75 ఏళ్ళ సుదీర్ఘమైన కెరీర్ ఆయనది. కష్టాలు, కన్నీళ్ళు, దుర్భర దారిద్య్రం నుంచి కష్టపడి పైకొచ్చి తన ట్రేడ్ మార్క్ టోపీ, టూత్బ్రష్ లాంటి మీసం, చిత్రమైన వేషధారణతో అందరినీ ఆకట్టుకున్న చాప్లిన్ మొదట్లో తన లఘు చిత్రాల దర్శకులకు సలహాలు చెప్పి, వారి కోపానికి గురవుతుండేవారు. అయితే, ఆ లఘుచిత్రాలకు లభించిన ఆదరణ కారణంగా మరిన్ని చిత్రాలు కావాలంటూ డిస్ట్రిబ్యూటర్లు దర్శకులను కోరడంతో చాప్లిన్ దర్శకుడయ్యారు.
‘కాట్ ఇన్ ది రెయిన్’ (1914) అనే 16 నిమిషాల లఘుచిత్రంతో ఆయన దర్శకుడి అవతారమెత్తారు. ‘ది ట్రామ్ప్’ (1915) చిత్రం దర్శకుడిగా ఆయన తీసిన పూర్తి నిడివి సినిమా. అది బ్రహ్మాండమైన విజయం సాధించడంతో ఇటు నటుడిగా, అటు దర్శకుడిగా ఆయన హవా మొదలైంది. అక్కడ నుంచి ఆయన రూపుదిద్దిన కళాఖండాలెన్నో! ఫెల్లినీ దగ్గర నుంచి ట్రూఫాట్ దాకా పలువురు ప్రముఖ దర్శకులను తనదైన ‘చాప్లిన్ తరహా’ చిత్రీకరణతో ప్రభావితం చేసిన ఘనత ఆయనది.
తనికెళ్ల భరణి
ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు
ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు
జంధ్యాలగారిలా క్లీన్ మూవీస్ చేయాలనేది నా లక్ష్యం
Sakshi | Updated: December 19, 2013 00:37 (IST)

ఇండస్ట్రీలో హిట్ రాగానే... నిర్మాతలు అడ్వాన్సులతో ముంచెత్తేస్తారు. మరి మీ పరిస్థితి ఎలా ఉంది? అడ్వాన్సులు అందుకుంటున్నారా?
నా పరిస్థితి అచ్చం మీరు చెప్పినట్టే ఉంది. అయితే.. అడ్వాన్సులు మాత్రం అందుకోవడం లేదు. ‘నా తొలి సినిమా ప్రమోషన్ పనులే ఇంకా పూర్తవ్వలేదు. ఇప్పుడే నెక్ట్స్ సినిమా గురించి ఆలోచించలేను’ అని గట్టిగా చెప్పేస్తున్నా. కెరీర్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నా. నా తర్వాత సినిమా ఏంటో త్వరలో తెలియజేస్తా.
కథ రెడీగా ఉందా?
ప్రస్తుతం అదే పనిలో ఉన్నా. కథ ఓ కొలిక్కి వచ్చింది. ఇది కూడా తొలి సినిమా లాగా భిన్నమైన కథాంశమే. లిటిల్బిట్ జర్నీ కూడా ఉంటుంది. ప్రేమ నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ ఇది. హాయిగా నవ్వుకునేలా సినిమా ఉంటుంది.
కొందరు దర్శకులు ఎఫర్ట్ మొత్తం తొలి సినిమాకే పెట్టేస్తున్నారు. మలి సినిమాకొచ్చేసరికి దెబ్బ తింటున్నారు. ఈ విషయంలో మీరు తీసుకునే జాగ్రత్తలు?
కథ ఫర్ఫెక్ట్గా ఉండాలి. స్క్రీన్ప్లే ఇంటిలిజెంట్గా ఉండాలి. ‘వీడు ఏదో గమ్మత్తు చేశాడ్రా’ అనిపించాలి. అలా ఉంటే విజయం తథ్యం. యువతరం చూస్తున్నారు కదా.. అని ప్రేమకథల వెంటే పడకూడదు... ఎప్పటికప్పుడు కొత్తగా వెళ్లాలనేది నా అభిమతం. సాధ్యమైనంత వరకూ నా సినిమాల్లో హ్యూమర్, మెసేజ్ ఉండేలా చూసుకుంటాను. జంధ్యాలగారు తీసిన సినిమాల్లా క్లీన్ మూవీస్ తీయాలనేది నా లక్ష్యం. నాకు తొలి విజయం కంటే మలి విజయమే ఇంపార్టెంట్.
మీ నాన్నగారు మేర్లపాక మురళి రచయిత కదా. ఆయన ప్రభావం మీపై ఎంత?
చాలా ఉంది. కళలపట్ల ఆసక్తి నాకు ఆయన నుంచే సంక్రమించింది. చిన్నప్పట్నుంచీ నాకు పుస్తకాలు చదవడం అలవాటు చేశారు నాన్న. బుక్ కంప్లీట్ చేస్తే ఇరవై రూపాయలు ఇచ్చేవారు. పోనుపోనూ పుస్తకాలు చదవడం నాకు వ్యసనంలా మారింది. చివరకు నేనే ఆయనకు డబ్బులిచ్చి పుస్తకాలు తెమ్మనేవాణ్ణి. చలం, బుచ్చిబాబు, శ్రీశ్రీ, తిలక్ ఇలా మహామహుల పుస్తకాలు చదివేశాను.
అనుకోకుండా డెరైక్టర్ అయ్యారా? లేక మీ లక్ష్యం కూడా ఇదేనా?
నా లక్ష్యం ఇదే. ఇంటర్ టైమ్లోనే డెరైక్టర్ని అవుతానని నాన్నతో చెప్పాను. ‘బీటెక్ పూర్తి చేశాక నీ ఇష్టం వచ్చినట్లు చేయ్’ అన్నారాయన. ఆళ్లగడ్డలో ఇంజినీరింగ్ బయోటెక్నాలజీ చేశాను. కోర్స్ పూర్తవ్వగానే, అన్నమాట ప్రకారం చెన్నయ్ ఎల్వీప్రసాద్ ఫిలిం ఇనిస్టిట్యూట్లో చేర్పించారు నాన్న. అయితే, డెరైక్షన్ కోర్స్ అంటే సెల్ఫ్ సెక్యూరిటీ ఉండదని నాన్న ఫీలింగ్. అందుకే.. నాన్న కోసం సినిమాటోగ్రఫీ కోర్స్లో చేరాను. కానీ, ఎక్కువగా డెరైక్షన్ క్లాసుల్లోనే ఉండేవాణ్ణి.
‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ అవకాశం ఎలా వచ్చింది?
చెన్నయ్లో కోర్స్ పూర్తి చేసుకొని హైదరాబాద్ రాగానే.. ‘ఖర్మరా దేవుడా’ అనే షార్ట్ ఫిలిం చేశాను. అది బాగా పాపులర్ అయ్యింది. వాసవి ఇంజినీరింగ్ కాలేజ్ చిత్రోత్సవాలో బెస్ట్ షార్ట్ఫిలింగా ఎంపికైంది. దర్శకుడు హరీష్శంకర్ చేతులపై జ్ఞాపిక అందుకున్నాను. తర్వాత తన సినిమాకు పనిచేయమని హరీష్ అడిగారు. కలుద్దామనుకునేలోపు ఆయన ఫారిన్ వెళ్లిపోయారు. ఈ గ్యాప్లో తయారు చేసుకున్న ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ కథను సందీప్కిషన్కి చెప్పాను. తనకు బాగా నచ్చేసింది. తనే కథ వినిపించమని నన్ను పలువురు నిర్మాతల వద్దకు పంపారు. కథ అయితే.. అందరికీ నచ్చేది కానీ, సందీప్ అనగానే.. బడ్జెట్ వర్కవుట్ అవుతుందా అని భయపడేవారు. ఓసారి మా ఊరు రేణిగుంటలో ఉండగా, ‘చోటా కె.నాయుడు కథ వింటారట’ రమ్మని సందీప్ నుంచి ఫోన్ వచ్చింది. వెళ్లి చోటాగారికి కథ చెప్పాను. ఆయనకు కథ తెగ నచ్చేసింది. వెంటనే.. జెమినీ కిరణ్గారికి చెప్పించారు. ఆయనకూ నచ్చడంతో ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ పట్టాలెక్కింది.
ఈ సినిమా విడుదలవ్వగానే మీకు దక్కిన గొప్ప కాంప్లిమెంట్?
సినిమా విడుదలైన రోజు ఓ ఫిలిం జర్నలిస్ట్ అన్నారు.. ‘నేను మంచి దర్శకుల మీద ఇటీవలే ఓ బుక్ రాశాను. మీ సినిమా నెల రోజులు ముందు విడుదలైనట్లయితే... నా బుక్లో మీరూ ఉండేవారు’ అని. ఈ సినిమా విషయంలో ఎన్ని ప్రశంసలు దక్కినా... ఆయన అన్నమాట మాత్రం నాకు అమితానందాన్నిచ్చింది.
హాస్యమాల జంధ్యాల
Sakshi | Updated: January 14, 2014 00:26 (IST)
అన్నానగర్, న్యూస్లైన్ : రాజ్కపూర్ తన ఆత్మగురువు అని జం ద్యాల ఒకసారి వేటూరితో అన్నారట. అందుకేనేమో ఆయన చిత్రంలో ప్రేమ గొప్పదనాన్ని గురించి తెలిపే ఒక పాట తప్పనిసరిగా ఉండాల్సిందే. అది కూడా వేటూరి సుందరరామ్మూర్తిది మాత్రమే ఉండేలా ఆయన శ్రద్ధ వహించేవారు. జంధ్యాల మనసు వెన్నముద్ద అయితే ఆయన కళ్లు వెన్నెల పొద్దులు, ఆయన మాటలు జలపాత సున్నితాలు, నవరసాలన్నింటిలోనూ జంధ్యాల హాస్య రసాన్నే అవపోసన పట్టారు. నవ్వులను పండించారు. పెద్ద కళ్లేపల్లెలో మూడు రోజుల పాటు సాగే తెలుగు వసంతోత్సవాలు జంధ్యాలకు అత్యంత ఇష్టమైనవి. ఎందుకంటే అక్కడ ఆయన తన జోకులతో కళా రసికులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించడమే కాక తన పొట్టను కూడా చెక్కలు చేసుకునేలా నవ్వేవారు. వేలుగాడు, స్టువర్టుపురం పోలీసు స్టేషన్, స్టేషన్ మాస్టరు సినిమాల్లో జంధ్యాల రాసిన సంభాషణలు ప్రాసక్రీడగా జగత్ విఖ్యాతమయ్యాయి. ముళ్లపూడిని గురువుగా భావించే జంధ్యాలకు బ్రాహ్మణీకపు ప్రథమ కోపాలూ, గ్రంధాక్షరీ శాపాలు కూడా హాస్యంలోని ప్రధాన వస్తువులే అయ్యూయి. రెండు జళ్ల సీత సినిమాలో జంధ్యా ల రాసిన ఊరగాయ స్త్రోత్రాలు - దండకాలూ, మాయాబజార్ సినిమాలోని పింగళివారు రాసిన గోంగూరోపాఖ్యానాన్ని తల పింప చేస్తాయి.
వేటూరి అంటే జంధ్యాలకు ఆరోప్రాణం అందుకే ఆయన చేత మల్లెపూవు చిత్రంలో కకుమభంజనం స్వాములవారి పాత్ర వేయించి మురిసిపోయారు. అందుకే జంధ్యాల మృతి చెందినపుడు వేటూరు దుఃఖం ఆపుకోలేక జంధ్యాల జీవితం ఎంత చిన్నదైనా.. అది తనకు మనుచరిత్రే అని బాధపడ్డారు. ఒక సభలో బాలు, ఎస్.జానకి, శైలజ ప్రసంగించి శ్రోతల కనుల వెంట నీరు తెప్పిస్తే ఆ సభకే అతిథిగా వచ్చిన జంధ్యాల మైకు ముందుకొచ్చి ఇంత వరకు ‘పాడు’ మనుషులు ముగ్గురొచ్చి కంట తడి పెట్టించారని ప్రసంగం ప్రారంభించగానే సభలో నవ్వులు మార్మోగాయి. శ్రీరమణ మహర్షి వేదాంతం రమణోపనిషత్తులనే గ్రంధ రూపంలో వచ్చినట్లుగానే జంధ్యాల చమత్కారాలు చెణుకులు కూడా ఒక జం ద్యోపనిషత్తు గ్రంథంగా తేవడానికి ఆయన అభిమానులం తా ప్రయత్నిస్తే భేషుగ్గా ఉంటుంది. కాలధర్మాన్ని, జీవనతత్వాన్ని 50ఏళ్ల వయసులో గ్రహించిన జంధ్యాల తృతీయ పురుషార్థాన్ని దాటి వెళ్లిపోయిన మహాజ్ఞాని. ఆయన గుర్తుగా మిగిలినవి హాస్య చిత్రాలు మాత్రమే.
ఇదీ ప్రస్థానం
జంధ్యాల 1951 జనవరి 14(మకర సంక్రాంతి రోజు)న నరసాపురంలో జన్మించారు. విజయవాడలో బీకాం గ్రాడ్యుయేట్గా బయటకు వచ్చారు. సిరిసిరి సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. 1983లో జంధ్యాల 12 నెలల వ్యవధిలో 80 సినిమాలకు మాటలు రాశారు. 1984, 87, 1992ల్లో ఆనందభైరవి, పడమటి సంధ్యారా గం, ఆపద్బాంధవుడు చిత్రాలకు ఉత్తమ దర్శక, ఉత్తమ కథ, ఉత్తమ సంభాషణల రచయతగా మూడు సార్లు నంది అవార్డులు పొందారు. రెం డు రెళ్లు ఆరు, ఆపద్బాంధవుడు చిత్రాల్లో నటించారు. చూపులు కలిసిన శుభవేళ, భారతీయుడు, ఇద్దరు, పడమట సంధ్యారాగం, అరుణాచలం, భామనే సత్య భామనే చిత్రాల్లోని కొన్ని ముఖ్య పాత్రలకు డబ్బింగ్ చెప్పారు. 40 చిత్రాలకు దర్శకత్వం వహించారు. భారత ప్రభుత్వం జంధ్యాలను పద్మశ్రీతో సత్కరించింది. సీఏ చదవాలని చెన్నైకు వచ్చి గుమ్మడి ప్రోద్బలంతో సంభాషణలు - కథా రచయితగా అవతారమెత్తారు. ఆత్మాహుతి, గుండెలు మార్చబడును, ఏక్దిన్కే సుల్తాన్ అనేది జంధ్యాలకు పేరు తెచ్చిన నాటకాలు. ఇందులో ఏక్ దిన్కా సుల్తాన్ పది వేల సార్లు ప్రదర్శితమవడమే కాకుండా, దాని తాలుకూ ముద్రణా ప్రతులు 15 సార్లు పునర్ముద్రణకు నోచుకున్నాయి.
బద్ధకం వదలండి
Sakshi | Updated: August 17, 2014 00:33 (IST)

- యువతకు తనికెళ్ల భరణి పిలుపు
ఏయూ క్యాంపస్: యువత బద్ధకం వీడి కార్యోన్ము ఖులు కావాలని ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం ఏయూ లో జరిగిన యండమూరి వీరేంద్రనాథ్ ‘లోయ లోంచి శిఖరానికి..’ పుస్తకావిష్కరణ సభలో ఆయన ప్రసంగించా రు. భరణి మాటల తూటాలు... ఇటు తల్లి దండ్రులను, అటు విద్యార్థులను ఆలోచింపజేశాయి.
మేలుకొలుపు
నేను తప్ప మా ఇంటిలో అందరూ గోల్డ్ మెడలిస్ట్లే. కళాశాల చదువు అయిపోయాక తెలుసుకున్నాను నేను బాగా చదవలేదని. ‘ఆలస్యంగా లేచి పైకొచ్చిన వాడిని నేను చూడలేదు’ అనే కొటేషన్ నన్ను ఎంతగానో మార్చివేసింది. ఉదయాన్నే నిద్ర లేవడాన్ని అలవాటుగా చేసుకుంటే ఎంతో సమయం మనకు కలసి వస్తుంది. దయచేసి దీనిని ఆచరించి చూడండి.
గీతాసారం వ్యక్తిత్వ వికాస కేంద్రం
భగవద్గీత అరవయ్యో ఏట చదవాల్సిన గ్రంథమనుకోవడం పొరపాటు. ఇది కచ్చితంగా 16వ ఏట పఠించాల్సినది. మన భారతీయ హైందవ మూలం నుంచి ఉద్భవించిన భగవద్గీత ఎన్నో వ్యక్తిత్వ వికాస సూత్రాలకు కేంద్రంగా నిలుస్తుంది. ఎవరో కాలం చేసినపుడు వినాల్సినదిగా భావించడం ఎంతమాత్రం భావ్యం కాదు.
అమ్మా నాన్నలను మరవొద్దు
తల్లిదండ్రులు పిల్లలతో స్నేహితులుగా మెలగాలి. మగ, ఆడ పిల్లలను సమానంగా చూడాలి. వివక్ష ఉండటం సరికాదు. ప్రొడక్టివ్గా, యూజ్ఫుల్గా బతకడానికి ప్రయత్నించండి. పదో తరగతి వరకు చెప్పులు లేకుండానే తిరిగాను. మధ్యతరగతి కుటుంబ కష్టాలు బాగా తెలిసిన వాడిని. అమ్మా అన్నం తిన్నావా అని ఒక్క రోజు అడగండి చాలు. వేరొకరికి పెట్టడానికి పుట్టిందే అమ్మ అనే విషయం మరువకండి. మన కోసం రాత్రింబవళ్లు పనిచేసే నాన్న కష్టం తెలుసుకుని చదివి ఉన్నతంగా రాణించండి.
అందుకే ముద్దు సీన్లో క్లాత్ అడ్డం పెట్టా!
Sakshi | Updated: February 02, 2014 00:46 (IST)

పూరి జగన్నాథ్తో కాసేపు మాట్లాడితే... ఆయన సినిమా చూసినట్లే ఉంటుంది. ఇంకాస్త లోతుగా వెళితే ‘చలం సాహిత్యం’ చదువుతున్నట్లుగా ఉంటుంది. పూరి గొప్ప దర్శకుడే కాదు, తత్వవేత్త కూడా. తన సినిమాల్లో హీరోల్లా సూటిగా సుత్తి లేకుండా మాట్లాడతారాయన. నితిన్ హీరోగా పూరి దర్శకత్వంలో ఇటీవలే విడుదలైన సినిమా ‘హార్ట్ ఎటాక్’. ఈ చిత్రానికి లభిస్తున్న స్పందన, ఇతర విశేషాలను శనివారం విలేకరులతో పంచుకున్నారు.
‘హార్ట్ ఎటాక్’కి స్పందన ఎలా ఉంది?
చాలా బావుంది. యూత్కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యింది. రాష్ట్రంలోని అన్ని ఏరియాల బయ్యర్ల నుంచీ పాజిటివ్ రిపోర్ట్. నైజాంలో తొలి రోజే కోటి రూపాయలు వసూలు చేసింది. నేనెంతో ప్రేమించి చేసిన సినిమాకు మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది.
అక్కడక్కడా నెగిటివ్ టాక్ ఉన్నట్లుంది?
ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కోలా ఉంటుంది. సక్సెస్ అనేది ఏ ఒక్కరి అభిప్రాయంతోనో ముడిపడి ఉండదు. ‘అత్తారింటికి దారేది’ సినిమాను కూడా చాలామంది బాలేదనే చెప్పారు. ఆ సినిమా వంద కోట్లు వసూలు చేసింది.
అసలు ఈ కథకు ప్రేరణ ఏంటి?
హిందీ సినిమా‘రాక్స్టార్’లో ఏఆర్ రెహమాన్ ట్యూన్ చేసిన ‘ఔర్ హో’ పాట సాహిత్యం నుంచి నాకీ కథ పుట్టుకొచ్చింది. నాగబాబుగారి అబ్బాయి వరుణ్తేజ్ కోసం తయారు చేసుకున్న కథ ఇది. కానీ ఆ ప్రాజెక్ట్ ఎందుకో కుదర్లేదు. అందుకే ఇందులో హీరో పేరు వరుణ్.
‘ముద్దు’ అనేది కథలో కీలక పాత్ర పోషించింది కదా. మరి.. ఆ సన్నివేశంలో హీరోహీరోయిన్ల మొహాలకు క్లాత్ అడ్డం పెట్టేశారే?
సెన్సార్బోర్డ్ ధనలక్ష్మిగారి కోసం అలా క్లాత్ అడ్డం పెట్టా. ఆ విషయం ఆమెక్కూడా చెప్పాను.
డైలాగులు మీ గత సినిమాల స్థాయిలో లేవని టాక్?
డ్రగ్ తీసుకునేవాడికి డోస్ పెంచకపోతే కిక్ ఉండదు. మందు తాగేవాడికి పెగ్గు తక్కువైనా కిక్ ఉండదు. నా డైలాగులూ అంతే... నేను ఎంత రాసిన ప్రేక్షకులకు కిక్ సరిపోవడం లేదు. అదే... ఈ సినిమాకు టైటిల్ కార్డ్ నాది కాకుండా ఎవరిదైనా వేస్తే... ‘వీడెవడో పూరీలా రాశాడ్రా’ అని అప్రిషియేట్ చేస్తారు.
బ్యాంకాక్, స్పెయిన్ వదిలి ఎప్పుడొస్తారు? మన నేటివిటీతో సినిమా ఎప్పుడు తీస్తారు?
80 ఏళ్ల నుంచీ మన నేటివిటీతో సినిమాలు వస్తూనే ఉన్నాయండీ. అందుకే కాస్త కొత్తగా వేరే దేశంలో కొత్త కొత్త లొకేషన్లలో సినిమాలు చేస్తే ఆడియన్స్కి కూడా ఓ ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుందని అలా తీస్తున్నాను. ఎమోషన్స్ అన్ని చోట్లా ఒకేలా ఉంటాయి. అవి ప్రేక్షకులకు టచ్ అయితే హిట్.
ఇట్లు శ్రావణీ సుబ్రమణ్యం, అమ్మానాన్నా ఓ తమిళమ్మాయి లాంటి ఫీల్గుడ్ సినిమాలు చేసిన మీరు ఇప్పుడు భిన్నంగా వెళుతున్నారు. ఎందుకని?
ప్రేక్షకుల ధోరణి చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్లను తృప్తి పరచడం అనుకున్నంత తేలిక్కాదు. ‘పోకిరి’ తర్వాత నా నుంచి వచ్చిన సినిమాలు చూసి, ‘అదే కథను ఎన్నిసార్లు తిప్పి తిప్పి తీస్తాడు’ అన్న వాళ్లు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇలా అంటున్నారు. నేను చెప్పేది ఒక్కటే... ‘అమ్మానాన్న ఓ తమిళమ్మాయి’ టైమ్లో అది కొత్త ప్రయత్నం. ఇప్పుడు ఇది కొత్త ప్రయత్నం. అయితే, శ్రావణీ సుబ్రమణ్యం, తమిళమ్మాయి లాంటి కథాంశాలకు నేను దూరమైన మాట నిజం. అందుకే.. అలాంటి కథలతో త్వరలోనే సినిమాలు చేస్తా.
మహేష్తో సినిమా చేయబోతున్నారు కదా. ఆ కథ ఎలా ఉంటుంది?
ఇంకా కథ తయారవ్వలేదు.
కథల కోసం బ్యాంకాక్కే ఎందుకు? ఇక్కడా లొకేషన్లు ఉన్నాయిగా?
సంవత్సరం మొత్తం మీద నేను బ్యాంకాక్లో ఉండేది నెల. మిగిలిన 11 నెలలు ఇక్కడే ఉంటాను. ఆ 11 నెలల్ని వదిలేసి, ఆ నెల రోజుల గురించే ఎందుకు పట్టించుకుంటారు?
తమ్ముడు సాయిరామ్కి హిట్ ఇవ్వలేకపోయారేం?
మన పిల్లలకు మనం డబ్బులివ్వగలుగుతాం కానీ... బ్రేక్ ఇవ్వలేమండీ. అది వారి అదృష్టంపై ఆధారపడి ఉంటుంది. త్వరలో వాడు హీరోగా ఓ సినిమా చేస్తా.
మరి మీ అబ్బాయి సంగతి?
అది అయిదేళ్ల తర్వాత కథ. అప్పుడు ఫామ్లో ఉంటానో లేదో. వాడైతే ఇప్పుడే రెడీ.
పూరీ టాకీస్ అనే చిత్ర నిర్మాణ సంస్థ స్టార్ట్ చేశారు. కారణం?
కొన్నాళ్ల తర్వాత ఎలాగూ అవకాశాలు తగ్గుతాయి. అప్పుడు ముందు జాగ్రత్తగా మనకు సొంత దుకాణం ఉండాలి కదా. అందుకే ప్రొడక్షన్ స్టార్ట్ చేశా. న్యూ టాలెంట్ని పరిచయం చేయాలనుకుంటున్నా. నిర్మాతగా కొనసాగడమే కాక, కథ, మాటలు కూడా బయటవారికి ఇవ్వాలనుకుంటున్నా.
‘బుడ్డా’ తర్వాత మళ్లీ బాలీవుడ్లో చేయలేదు...?
‘సన్నాఫ్ సర్దార్’ చిత్ర నిర్మాతకు రెండు సినిమాలు సైన్ చేశాను.
మీ కుడిచేతిపై ఉన్న ‘నాట్ పర్మినెంట్’ అని పచ్చబొట్టుకి కారణం ఏంటి?
మనకు కష్టాలొస్తాయి. అవసరానికి డబ్బులుండవ్. నచ్చిన అమ్మాయి ప్రేమను తిరస్కరిస్తుంది. దిక్కు తోచక ఒంటరిగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి సమయంలో ఇవేమీ శాశ్వతం కాదని గుర్తు చేస్తుందీ టాటూ. అలాగే, జీవితంలో గొప్ప విజయాలు లభిస్తాయి. అవసరానికి మించి డబ్బు ఉంటుంది. అందరి ప్రేమకూ పాత్రులం అవుతాం. అలాంటి సమయంలోనూ ఇవేమీ శాశ్వతం కాదని గుర్తు చేస్తుంది.
టేక్ టూ అనేది ఆయన డిక్షనరీలోనే లేదు!
Sakshi | Updated: July 18, 2014 00:45 (IST)
- ఎస్వీఆర్... పేరు తలచుకోగానే మనసు పులకించిపోతుంది!
- ఆయనను కలిసిన తొలి క్షణం...
- పెరిగిన పరిచయం... ఏర్పడిన అనుబంధం...
- ఇలా అన్నీ నా మనసులో సజీవంగా నిలిచిపోయాయి!

తొలిసారి కలిసింది అక్కడే...
ఆ రోజు... మద్రాసులోని వాణీమహల్లో ‘పద్మశ్రీ’ నాటక ప్రదర్శన.
రచయితనూ నేనే... దర్శకుణ్ణి నేనే... హీరోని కూడా నేనే!
హాలు మొత్తం నిండిపోయింది!
నాటకం పూర్తికాగానే ఒకటే కరతాళ ధ్వనులు!
వీటన్నిటి కన్నా, ఒక వ్యక్తి ప్రశంసలు నాలో ఉద్వేగాన్ని రేకెత్తించాయి.
‘‘వెల్డన్! నాటకం చాలా బాగా రాశావ్. ముఖ్యంగా నీ నటనలో చాలా ఈజ్ ఉంది. ఎక్కడా బిగుసుకుపోకుండా సునాయాసంగా నటించావు. రైటర్గా, ఆర్టిస్టుగా నీకు మంచి భవిష్యత్తు ఉంది.’’
ఈ మాటలన్నది ఓ మామూలు వ్యక్తి కాదు...
మహానటుడు... అభినయ మేరునగధీరుడు... ఎస్వీ రంగారావు!
నా గురువు కేవీ నందనరావు ఆహ్వానిస్తే ఆ నాటకాన్ని వీక్షించడానికి వచ్చారు ఎస్వీఆర్. అలా ‘పద్మశ్రీ’ నాటకంతో ఆయనతో పరిచయ భాగ్యం కలిగింది. ఆ తర్వాత అనుకోకుండా రెండు మూడు పెళ్లి వేడుకల్లో కలిశాం. కలిసినప్పుడల్లా నన్ను గుర్తుపట్టి పలకరించేవారు.
అలా మొదలైంది మా సాన్నిహిత్యం...

దుర్యోధనుడు, భీముడు లాంటి రకరకాలు పౌరాణిక పాత్రలు చేసిన ఆయనను మెక్సికన్ డ్రెస్లో చూడటం గమ్మత్తుగా అనిపించింది.
ఆ తర్వాత ‘జగత్జెట్టీలు’...
ఈ చిత్రానికి నేనే స్క్రీన్ప్లే, మాటలు రాశా. సెట్లో ఉంటూ అసోసియేట్ డెరైక్టర్లా పని చేశా. ఇందులో కూడా ఎస్వీఆర్ది లీడ్ రోల్. ఈ క్రమంలో ఆయనతో నా సాన్నిహిత్యం మరింత పెరిగింది. ఎస్వీఆర్ డెరైక్ట్ చేసిన ‘బాంధవ్యాలు’, ‘చదరంగం’ చిత్రాలకు నా గురువు కేవీ నందన్రావు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్. ఆయన ద్వారా నేను కూడా ఆ సినిమాలకు పని చేస్తూ, కొంత మేరకు స్క్రిప్టు వర్కులో పాలుపంచుకున్నా. ఎస్వీఆర్కి నా పనితీరు నచ్చింది. నన్నొక ఆత్మీయుడిలా చూసుకునేవారు. ఆయన ఇంటికి అప్పుడప్పుడూ వెళ్లి కాసేపు గడిపి వస్తుండేవాణ్ణి.
మొదట ఆయనకే కథ చెప్పా...
ఈ క్రమంలో ఓసారి ఆయనతో సూచాయగా ఒక కథ చెప్పాను. ఆయనకు బాగా నచ్చింది. నేను దర్శకుడు కావడం కోసం నిర్మాతలకు కథలు వినిపించే ప్రయత్నంలో ఉన్నాను. కృష్ణతో ‘బందిపోటు భీమన్న’ (1969) తీసిన దోనేపూడి బ్రహ్మయ్యకు ఓ సెంటిమెంట్ కథ వినిపించాను. అది ఎస్వీఆర్కి చెప్పిన కథే. కానీ బ్రహ్మయ్యకు క్రైమ్ సినిమా చేయాలని ఉంది. అందుకే ఆ కథ వద్దన్నారు. మరో వైపు నిర్మాత కె. రాఘవను కలిశాను. ఆయన కూడా క్రైమ్ కథే కావాలన్నారు. కొన్ని చర్చలు కూడా జరిగాయి.
ఎస్వీఆర్, కె. రాఘవ క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్లిద్దరి మాటల్లో నా ప్రస్తావన వస్తే, అతని దగ్గర మంచి సెంటిమెంట్ కథ ఉందని ఎస్వీఆర్ చెప్పారట. వెంటనే కె. రాఘవ నన్ను పిలిపించి కథ చెప్పమన్నారు. ఆయనక్కూడా విపరీతంగా నచ్చేసింది. అదే ‘తాత-మనవడు’! అందులో ఎస్వీఆర్ది రైతు రంగయ్య పాత్ర. సినిమాకు వెన్నెముకలాంటి పాత్ర. ఆయన లేకుండా సినిమాను అస్సలు ఊహించలేం!
అలిగి వెళ్లిపోయారు...

1973 జూలై 21న మద్రాసులోని విక్రమ స్టూడియోలో షూటింగ్ మొదలు పెట్టాం. ఆరోజు ఫార్మల్గా రెండు, మూడు షాట్స్ తీశాం.
మరుసటిరోజు క్లైమాక్స్ తీయాలని ప్లాన్ చేశాం.
జూలై 22 ఆదివారం... సెట్లో 20 మంది ఆర్టిస్టులున్నారు. తొలి షాట్ కైకాల సత్యనారాయణ, జయంతిపై తీశాం.
రెండో షాట్ ఎస్వీఆర్, జయంతిపై తీయాలి.
నా అసోసియేట్ అంజిబాబుని ఎస్వీఆర్కి డైలాగ్ చెప్పమని పంపించాను. ఆయన ఆ డైలాగులన్నీ విని ‘‘ఇంత చెప్పాల్సిన అవసరం లేదు. ఇది చాలు’’ అని కొన్ని డైలాగులు తగ్గించేశారు. ‘ఆ రెండు డైలాగులూ తీసేస్తే, క్లైమాక్స్ చాలా దెబ్బ తింటుంది’ అని ఆయన దగ్గరకు వెళ్లి కన్విన్స్ చేయబోయాను. అయినా వినలేదు. ‘‘సార్... సినిమాలో మీరు నటిస్తున్న తొలి సీన్ ఇది. కానీ ఆర్డర్లో ఇది 99వ సీన్. 98 సీన్లు రాశాక నేను సీన్ రాశాను. ఈ సీన్ ఎలా ఉంటే బావుంటుందో టీమ్ అంతా చర్చించుకున్నాకనే డైలాగులు రాశాను’’ అని వివరించాను. దాంతో ఆయనకు కోపం వచ్చేసింది. విసురుగా బయటకు వెళ్లిపోయారు. కోపం తగ్గాక వస్తారని చాలాసేపు ఎదురు చూశాం. అయినా రాలేదు. ఆయనను బతిమిలాడి తీసుకురమ్మని కె. రాఘవకు చెప్పాను. ‘‘నేను క్లోజ్ ఫ్రెండ్ని కదా. ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పాలి కానీ, అలా వెళ్ళిపోతే ఎలా? ఏం పర్లేదు... రావు గోపాలరావుని పిలిపిద్దాం. ఆ వేషం అతనితో వేయిద్దాం’’ అని రాఘవ అప్పటికప్పుడు రావుగోపాలరావుకి కబురంపారు. రావు గోపాలరావు వచ్చి మేకప్ రూమ్లోకి వెళ్లేసరికి అక్కడ ఎస్వీఆర్ ఉన్నారు. ఈయన ఖంగుతిని ‘‘ఊరికే... మిమ్మల్ని కలుద్దామని వచ్చానండి’’ అని చెప్పి వెళ్లిపోయారు. ఎస్వీఆర్కి విషయం అర్థమై రాఘవని పిలిచి చనువుతో తిట్టారు. తర్వాత ఆ సీన్ నేను చెప్పినట్టుగానే యాక్ట్ చేశారు. ఆ తర్వాత నేను ఆయన దగ్గరకు వెళ్ళి ‘‘సారీ సార్... మీ మనసు నొప్పించాను. నాది మొండితనం కాదు. రషెష్ వచ్చాక మీకు చూపిస్తాను. అప్పుడు కూడా ఆ డైలాగులు వద్దంటే తీసేస్తాను’’ అని చెప్పాను. ఆయన కదిలిపోయి ‘‘నారాయణరావ్... నిన్ను చూసి గర్వపడుతున్నానయ్యా. డైరక్టర్ అంటే ఇలాగే ఉండాలి. నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఈ పరిశ్రమను శాసించే స్థాయికి ఎదుగుతావు... కీపిటప్’’ అని నా భుజం తట్టారు. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య ఇంకా క్లోజ్నెస్ పెరిగిపోయింది!
ఇంతలో విషాదం..!

మద్రాసులో వేరే సినిమా షూటింగ్లో ఉన్నాను.
ఎవరో వచ్చి వార్త చెప్పగానే నాకు కాస్సేపు గుండె ఆగిపోయినట్టుగా అనిపించింది!
షూటింగ్కి పేకప్ చెప్పేసి, వెంటనే ఎస్వీఆర్ ఇంటికి బయలుదేరాం. సింహం లాంటి మనిషి... అలా నిర్జీవంగా కనబడేసరికి, ఇక మళ్లీ కనబడరనే సరికి ఏడుపొచ్చేసింది. దుఃఖం ఆపుకోవడం నావల్ల కాలేదు! అంత్యక్రియలు పూర్తయ్యేవరకూ అక్కడే ఉన్నా. ఇంటికి వచ్చాక కూడా ఆయన జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆయన్ను బేస్ చేసుకుని ఇంకో 10 సినిమా కథలు తయారు చేసుకున్నా. అవన్నీ ఇప్పుడు అనాథలేనా? ఇంత గొప్ప నటుడితో కేవలం రెండే సినిమాలు చేసే అదృష్టం దక్కిందా నాకు? ఇలా ఏవేవో నాలో ఆలోచనలు ముప్పిరిగొన్నాయి.
నో రీప్లేస్మెంట్..!
నాకు తెలిసి ఎస్వీఆర్కి ఎలాంటి శారీరక సమస్యలు లేవు. చివరి క్షణం వరకూ అదే విగ్రహం, అదే ఠీవి! ఏమైనా చిన్నా చితకా కుటుంబ సమస్యలుండేవేమో... అది కూడా నాకు పెద్దగా తెలీదు. ఎందుకో అప్పుడప్పుడూ డిస్ట్రబ్డ్గా మాత్రం అనిపించేవారు.
ఎస్వీఆర్ సింగిల్ టేక్ ఆర్టిస్టు అని నేను కొత్తగా సర్టిఫికెట్ ఇవ్వనవసరం లేదు. ఇది ప్రపంచమంతా ఒప్పుకునే మాట. టేక్ టూ అనేది ఆయన డిక్షనరీలోనే లేదు! ఓ విద్యార్థిలాగా డైలాగ్ పేపర్ శ్రద్ధగా చదివేవారు. అలాంటి ఆర్టిస్టుని మళ్లీ చూడలేం.
ఎస్వీఆర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే - ఆయన నటప్రపూర్ణుడు. చాలామంది తాము ఎస్వీఆర్ అంతటి నటులమని ఫీలైపోతుంటారు కానీ, ఎస్వీఆర్కి నో రీప్లేస్మెంట్! అంతటి నటుడు ఇక రారు... రాబోరు!
ఆయనకు తగ్గ గుర్తింపు రాలేదన్నది వాస్తవమే!

భావితరాలకు ఆయనొక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్..!
ఎస్వీఆర్... ఓ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కిందే లెక్క! ఆయన సినిమాలు చూసి భావితరం నటులు ఎన్నో నేర్చుకోవచ్చు. పాత్రకు తగ్గ ఆహార్యం, పాత్రకు తగ్గ మాడ్యులేషన్, వీటన్నిటితో పాటు డైలాగ్స్ లేని చోట ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలో... ఇవన్నీ ఆయన నటన చూసి నేర్చేసుకోవచ్చు!
- సంభాషణ: పులగం చిన్నారాయణ
లోతులకు వెళ్తున్నారు!
Sakshi | Updated: November 13, 2014 01:12 (IST)

♦ మొదటిసారి ఎర్రబస్సు ఎప్పుడెక్కారో ఓసారి గుర్తు చేసుకుంటారా?
ఏలూరులోని ఎంప్లాయ్మెంట్ ఎక్సేంజ్ ఆఫీసులో నా పేరు నమోదు చేయించుకోవడానికి పాలకొల్లులో మొదటిసారి ఎర్ర బస్సెక్కాను. ఆ తర్వాత ఉద్యోగాన్వేషణలో భాగంగా ఎర్రబస్సెక్కి హైదరాబాద్ వచ్చాను. అప్పుడు భాగ్యనగరంలో నా ప్రయాణాలు సాగింది ఎర్రబస్సులోనే.
సో.. ఎర్రబస్ అని కొంతమంది తేలికగా తీసిపారేస్తారు కానీ, ఆ బస్సెక్కినవాళ్లూ పైకొస్తారనడానికి మీరో ఉదాహరణ అన్నమాట?
ఎర్ర బస్సుని తేలికగా తీసిపారేయకూడదు. ఎంతోమంది మహామహులు ఎక్కిన బస్ అది. అందుకే, ఈ సినిమాలో ‘ఎర్రబస్సని అంత తేలికగా మాట్లాడకండి.. ఎర్రబస్సు ఎక్కొచ్చినోళ్లు ఢిల్లీలోని ఎర్రకోట మీద జెండా ఎగరేశారు’ అని డైలాగ్ కూడా పెట్టాను.
♦ అప్పట్లో ఎర్ర బస్సులో మొదలైన మీ ప్రయాణం ఎయిర్ బస్ వరకూ వస్తుందని ఊహించారా?
అస్సలు లేదు. ఈ జీవితం ఆ దేవుడిచ్చిన వరం. చదువుకోవడానికి చాలా అవస్థలు పడినవాణ్ణి. పాలకొల్లు రోడ్ల మీద భుజం మీద అరటిపళ్ల కావిడేసుకుని, ‘అరటి పళ్లోయ్.. అరటి పళ్లోయ్..’ అని అమ్ముకున్న రోజులు నాకిప్పటికీ గుర్తే. ఇప్పుడున్న జీవితాన్ని నేనేప్పుడూ ఊహించలేదు. కేవలం నాటకాలు వేయడం, రాయడం అనే నా వ్యాపకం నన్నింతటివాణ్ణి చేసింది. టైప్ రైటింగ్ హయ్యర్లో నేను గోల్డ్ మెడలిస్ట్ని. షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నాను. అది కానీ, నేను పుచ్చుకున్న డిగ్రీ పట్టా కానీ.. నన్నీ స్థాయికి తీసుకురాలేదు. నాటకాల మీద ఉన్న ఆసక్తే నా ప్రయాణాన్ని ఇంతవరకూ తీసుకొచ్చింది.
♦ 150 సినిమాలకు దర్శకత్వం వహించడమంటే మాటలు కాదు.. ఇప్పుడు కథలు దొరక్క, సినిమాలు తీయడంలేదని చాలామంది అంటున్నారు. అసలు మీకు 150 కథలు ఎలా పుట్టాయి?
మంచి ప్రశ్న. కథల కోసం ఇప్పుడు చాలామంది ఆకాశానికి, సముద్ర లోతులకు వెళుతున్నారు. కానీ, కథలు అక్కడ పుట్టవు. మన విలేజ్లో, టౌన్లో, వీధిలో, ఎదురింట్లో, పక్కింట్లో ఎన్నో పాత్రలుంటాయి. అన్ని పాత్రలనూ క్షుణ్ణంగా పరిశీలిస్తే, అందులోంచి కథ పుడుతుంది. నా సినిమా కథలన్నీ జీవితంలోంచి పుట్టుకొచ్చినవే. అందుకే, ఎక్కువ శాతం విజయాలున్నాయి. నా సినిమాల్లోని ఆచారి, పోలీస్ వెంకటేశం, సూరిగాడు, మావగారు.. ఈ పాత్రలు జీవితంలో ఎక్కడోచోట తారసపడతాయి. అందుకే, ఆ పాత్రలు ప్రేక్షకులకు దగ్గరయ్యాయి.
♦ ప్రస్తుతం ‘హీరో వర్షిప్’ ట్రెండ్ నడుస్తోంది కదా.. ‘ఎర్రబస్సు’ చిత్రం అందుకు భిన్నంగా ఉంటుందేమో?
మళ్లీ మనకిలాంటి సినిమాలు రావాలి అని ‘ఎర్రబస్సు’ చూసినవాళ్లు అంటారు. హీరోల మీద కథలు రావడం తప్పు కాదు. కానీ, హీరోల కుటుంబాల గురించి, వంశాల గురించి మాట్లాడటం ఎక్కువైంది. దానివల్ల సినిమా అనే ఫీల్ పోయింది. తాతా, మనవళ్ల కథలెప్పుడూ బాగుంటాయి. తల్లీతండ్రి మందలిస్తే పిల్లలొచ్చి చెప్పుకునేది తాత దగ్గరే. తమకేదైనా కావాలంటే... తాతతో రికమండ్ చేయించుకుంటారు. ఇవన్నీ ఎంత బాగుంటాయో చెప్పక్కర్లేదు. ఇది యువతరానికి కనెక్ట్ అయ్యే సినిమా. మానవీయ విలువలున్న చిత్రం.
♦ నీరాజిత బాగా యాక్ట్ చేసింది
నీరాజిత అల్లరి పిల్ల. వాళ్ల అమ్మ హోమ్వర్క్ చేయమంటే సెలైంట్గా నా దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. నా దగ్గర ఉన్నప్పుడు పిలవరు కదా. అది తన ఐడియా. కానీ, ఆ తర్వాత ఎప్పటికో నాకు తెలుస్తుంది తను హోమ్వర్క్ రాయలేదని. అమ్మా, నాన్న తిడితే.. వచ్చేది నా ఒళ్లోకే. చాక్లెట్ తినొద్దని వాళ్ల అమ్మ అంటే.. ఆ చాక్లెట్ కోసం నా దగ్గరకు వస్తుంది. నీరాజిత నాతో స్క్రీన్ షేర్ చేసుకోవడం మర్చిపోలేని అనుభూతి. బాగా యాక్ట్ చేసింది.
♦ మీ ఆన్స్క్రీన్ మనవడు విష్ణు గురించి?
తమిళ చిత్రం ‘మంజ పై’ చూడగానే మా ఇద్దరికీ నప్పే కథ ఇదనిపించింది. మన తెలుగు నవలల్లో.. ఉదాహరణకు యద్దనపూడి సులోచనారాణి నవలల్లో హీరో ఉంటాడే.. విష్ణు అచ్చంగా అలాంటి హీరోనే. అమెరికాలో స్థిరపడాలనుకునే కుర్రాడి కథ ఇది. అందుకు మూడు నెలల సమయం ఉండటంతో తాతను నగరానికి పిలిపించి, ఆ మూడు నెలలు ఆనందంగా ఉంచాలనుకుంటాడు. తాత కావాలి.. ప్రేయసి కావాలి. తాత కోసం ఇక్కడ ఉండాలా? ప్రేయసి కోసం అమెరికా వెళ్లాలా? అని మదనపడే కుర్రాడిగా బాగా నటించాడు.
♦ ఇది మీకు 151వ సినిమా. విదేశాల్లో విడుదలవుతున్న మీ తొలి సినిమా ఇదే.. ఎలా అనిపిస్తోంది?
151 చిత్రాలు తీసినా.. నా ప్రతి సినిమా నాకు తొలి సినిమానే. అప్పట్లో తెలుగు సినిమాలు విదేశాల్లో విడుదలయ్యేవి కావు. ఆ ట్రెండ్ మొదలైన తర్వాత యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్ ఎక్కువగా అక్కడ విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో నా సినిమా విదేశాలకు వెళ్లలేదు. ఇప్పుడు వెళుతున్నందుకు ఉద్వేగంగా ఉంది. అమెరికాలో ఈ సినిమాకి ఎలాంటి రిపోర్ట్ ఇస్తారో తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే, అక్కడుంటున్న మనవాళ్లు మన సంస్కృతీ, సంప్రదాయాలను, పల్లెటూళ్లను మర్చిపోలేదు. అందుకని అక్కడి వాళ్లకి కూడా బాగా నచ్చుతుంది.
♦ మీరు ‘తాత-మనవడు’ తీసినప్పుడు తాత కాలేదు.. కానీ, ఇప్పుడు మనవళ్లు, మనవరాళ్లతో సంపూర్ణ జీవితం అనుభవిస్తున్నారు.. అది వెండితెరపై ప్రతిబింబిస్తుందనుకోవచ్చా?
కచ్చితంగా. తాతను అయ్యాను కాబట్టే, ‘ఎర్రబస్సు’ని బాగా తీయగలిగాను. నిజజీవితంలో నా మనవళ్లు, మనవరాళ్లు ఏదైనాసరే నా దగ్గర చెప్పుకుంటారు. వాళ్లు పుట్టకముందు ఈ సినిమా తీసి ఉంటే.. కొంచెం అవాస్తవంగా తీసి ఉండేవాణ్ణేమో. కానీ, ఇప్పుడు చాలా సహజంగా తీశాను. మనవడో, మనవరాలో ఏడుస్తుంటే ఓ తాత మనసు ఎలా కదులుతుందో నాకు తెలుసు. అందుకని, నిజంగానే తాతలానే ఫీలై, చేశాను.
♦ ‘తాత-మనవడు’ తీసినప్పుడు మీకు తాత అనుభవం లేదు కదా.. మరి అదెలా తీశారు?
పరిశీలనా దృష్టి వల్లే తీయగలిగాను. అప్పటికి మా తాతలను, ఇంటి పక్క తాతలను చూసి ఉన్నాను కాబట్టి, ఆ అనుభవంతో తెరకెక్కించాను. కానీ, ‘ఎర్రబస్సు’లో తాతగా ఒదిగిపోవాలి కాబట్టి, స్వీయానుభవం అవసరం.
♦ ప్రస్తుత సినిమాల్లో పంచ్ డైలాగులు, ప్రాసలు ఎక్కువగా ఉంటున్నాయి.. మరి.. ఈ సినిమాలో?
ఇప్పుడు పంచ్ డైలాగ్స్, ప్రాసల ట్రెండ్ నడుస్తోందన్నది చాలా మంది ఊహ. ఇది ఉంటేనే సినిమా ఆడుతుందని చెప్పడానికి ప్రత్యేకంగా పెద్ద బాలశిక్ష లేదు. కామెడీ సినిమా ఆడితే.. ఆ తరహా, యాక్షన్ అంటే.. ఆ రూట్లో వెళ్లిపోతున్నారు. మూడు రోజుల్లో వసూళ్లు రాబట్టాలంటే.. మన సినిమాలో ఏయే అంశాలుండాలని ఆలోచిస్తున్నారు తప్ప లాంగ్ స్టాండింగ్ కోసం చూడటంలేదు. ‘ఎర్ర బస్సు’లో ఏది ఉన్నా కథానుసారంగానే ఉంటుంది తప్ప, ట్రెండ్ అంటూ నేల విడిచి సాము చేయలేదు.
ఇవాళ్టికీ అదే తపన... అతనికి అదే శ్రీరామరక్ష!
Sakshi | Updated: November 07, 2014 00:24 (IST)

- ‘కళాతపస్వి’ కె. విశ్వనాథ్
అప్పుడే కమలహాసన్కు అరవై ఏళ్ళు నిండాయంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఇవాళ్టికీ అతనిలోని ఉత్సాహం, ఉద్వేగం చూస్తుంటే, అతనికి అంత వయసుందని అనిపించదు. దర్శకుడిగా కమలహాసన్తో నేను తీసిన చిత్రాలు మూడే! మా మొదటి సినిమా ‘సాగర సంగమం’. నిర్మాత ఏడిద నాగేశ్వరరావు గారి వద్ద కమల్ డేట్లున్నాయి కాబట్టి, అతణ్ణి దృష్టిలో పెట్టుకొనే ‘సాగరసంగమం’ కథ అల్లుకొన్నా. బాలనటుడిగా కొన్ని చిత్రాల్లో నటించిన కమల్ పెద్దయ్యాక కొన్నాళ్ళు డ్యాన్స్మాస్టర్ తంగప్పన్ దగ్గర సహాయకుడిగా పనిచేశాడు. దాన్ని ప్రాతిపదికగా తీసుకొని ‘సాగర సంగమం’లోని బాలు పాత్రను రాసుకున్నాను.
కొన్ని ఘట్టాల్లో అతను చూపిన నటన ఇవాళ్టికీ చూస్తుంటే, ‘తీసింది నేనేనా, చేసింది అతనేనా’ అనిపిస్తుంటుంది. ఇన్నేళ్ళ తన కెరీర్లో అత్యుత్తమమైన 10 చిత్రాల జాబితా వేస్తే, అందులో ‘సాగర సంగమం’ ఒకటని కమల్ పదే పదే ఇంటర్వ్యూల్లో చెప్పాడు. అన్ని భావోద్వేగాలూ ఉన్న ఆ చిత్ర రూపకల్పన ఇవాళ్టికీ ఓ తీపి గుర్తు. ఏది చేసినా అందులో ప్రత్యేకత, పర్ఫెక్షన్ ఉండాలని కమల్ భావిస్తాడు. దాని కోసం ప్రతి సన్నివేశంలో, సందర్భంలో ప్రయత్నిస్తాడు.
సరిగ్గా అలాంటి తపనతో సినిమాలు తీసే మా లాంటి దర్శకులకు అతను బాగా ఉపయోగపడతాడు. అతను ఎంత ప్రొఫెషనల్ అంటే, దర్శకుడు ఆశించినది ఇచ్చే వరకు, చాలాసార్లు అంతకు మించి ఇచ్చేవరకు రాజీ పడడు. షాట్ తీస్తున్నప్పుడు మన రియాక్షన్లో ఏదైనా తేడా ఉన్నా, మనం సరేనని కట్ చెప్పడం ఒక్క సెకన్ ఆలస్యమైనా చటుక్కున గ్రహించేస్తాడు. ఆశించినంత తృప్తిగా రాలేదని గ్రహించి, మళ్ళీ చేయడానికి సిద్ధపడతాడు. అంత సునిశితమైన గ్రహణశక్తి అతనిది. మనం ఎదైనా చెబితే సహృదయంతో తీసుకుంటాడు. చాలామంది లాగా అహంభావానికి పోడు.
అతనిలో కళాతృష్ణ ఇవాళ్టికీ తీరలేదు.తీరని దాహంతో ఆయన నిరంతరం కొత్త పాత్రలు, కథల కోసం అన్వేషిస్తూనే ఉంటాడు. అందుకే, అప్పటి ‘పుష్పక విమానం’ మొదలు ఇటీవలి ‘దశావతారం’ దాకా రకరకాల ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు. అలాంటి కథలు, పాత్రలతో ఎవరు వచ్చినా ధైర్యంగా ముందుకు వస్తాడు. ‘నీ పాత్ర గొప్ప ఫుట్బాల్ ఆటగాడి పాత్ర. కానీ, దురదృష్టవశాత్తూ రెండు కాళ్ళూ లేవు’ అని ఒక లైన్ చెప్పామనుకోండి. వెంటనే, సవాలుగా నిలిచే ఆ పాత్ర పోషించడానికి సిద్ధమైపోతాడు. పెపైచ్చు, చాలామందిలా అతనిది ఆరంభ శూరత్వం కాదు. సవాలుగా నిలిచే చిత్ర నిర్మాణాన్నో, పాత్రనో తీసుకున్న తరువాత చివరిదాకా అదే తపనను నిలుపుకొంటూ, పూర్తి చేస్తాడు. ఎక్కడా రాజీ పడడు.
ఒక్కమాటలో చెప్పాలంటే, దర్శకుల నటుడు - కమల్. ఒక పాత్రను ఎలా మలుచుకోవాలనుకున్నా సరే, నటుడిగా అతణ్ణి ఎంచుకోవచ్చు. దర్శకుడు నిశ్చింతగా కళ్ళు మూసుకొని పాత్రను అతని చేతుల్లో పెట్టవచ్చు. తీసుకున్న పాత్రలోకి ఇమిడిపోవడానికి ఏవేం కావాలో అవన్నీ కమల్ సమకూర్చుకుంటాడు. ఆ పాత్రను పండించడం కోసం హోమ్వర్క్ చేస్తాడు. మొదటి రోజుల నుంచి ఇప్పటికీ అతని పద్ధతి అదే!
అలాగే, షూటింగ్ జరుగుతుండగా అక్కడికక్కడ, అప్పటికప్పుడు బుర్రలో తళుక్కున మెరిసిన ఆలోచనను అమలు చేసేసి, సన్నివేశం అద్భుతంగా రావడానికి సహకరించే అరుదైన లక్షణం కమల్కు ఉంది. ఉదాహరణకు, ‘సాగర సంగమం’లో జయప్రదతో కలసి ఆలిండియా డ్యాన్స్ ఫెస్టివల్ ఆహ్వానపత్రిక చూసే సన్నివేశం చిత్రీకరిస్తున్నప్పుడు ఆ షాట్ చివరలో నాకేదో అనిపించి, ‘కమల్! ఒక్కసారిగా నవ్వేసెయ్’ అని పక్క నుంచి అరిచా. చాలామంది ఆర్టిస్టులు అలాంటి సందర్భాల్లో గందరగోళపడతారు.
‘కట్’ చెప్పారనుకుంటారు. కానీ, క్షణంలో వెయ్యోవంతులో కమల్ నా మాట గ్రహించి, అప్పడికప్పుడు నవ్వును జత చేర్చి, తన నట ప్రతిభతో ఆ సీన్ను పండించాడు. ‘దర్శకుడి భావం ఇదై ఉంటుంది, ఇలా చేయాలన్న’ సిక్స్త్సెన్స్ అతనికి బాగా పనిచేస్తుంది. ఇవాళ ఇంత పెద్ద స్టార్గా ఎదిగినప్పటికీ, ఇంకా తెలుసుకోవాలి, నేర్చుకోవాలన్న తపన ఉంది. అదే అతనికి శ్రీరామరక్ష.
‘శుభసంకల్పం’ చిత్రం అయిపోయిన తరువాత తమిళులకు పెద్ద పండుగ దీపావళికి అతను స్వయంగా మా ఇంటికి వచ్చి, మా దంపతులిద్దరికీ కొత్త బట్టలు పెట్టి, నమస్కారం చేసి వెళ్ళిన సంఘటన నాకిప్పటికీ గుర్తు. ఇవాళ ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగినా, అదే భక్తి, గౌరవంతో ఉండడం అతని సంస్కారం. ఇక, సినీ జీవిత గురువు కె. బాలచందర్ అంటే భక్తి గౌరవాలే కాక, చనువు కూడా! ఇప్పటికీ తన కష్టసుఖాలన్నీ ఆయనతో మనసు విప్పి చెప్పుకుంటాడు.
నన్ను బలవంతాన ఒప్పించి, నటుణ్ణి చేసింది కమలహాసన్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాలే. వాళ్ళిద్దరూ పట్టుబట్టి, ‘శుభసంకల్పం’లో తొలిసారిగా నన్ను నటింపజేశారు. ఆ సినిమా అయిపోయాక కూడా, ‘ఇక్కడితో ఆపవద్దు. నటన కొనసాగించండి’ అని నాకు సలహా ఇచ్చింది కూడా కమలే! అలా నా రెండో ఇన్నింగ్స్ నటుడిగా మొదలై తాజా ‘ఉత్తమ విలన్’, రజనీకాంత్ ‘లింగా’ వరకు కొనసాగుతోంది.
కమల్లో వెర్సటాలిటీ ఉంది. వినోదింపజేయగలడు. అంతే గొప్పగా విషాదమూ పలికించగలడు. ఇవాళ, దక్షిణభారతావని నుంచి వచ్చిన అత్యుత్తమ సినీ ప్రతిభాసంపన్నుల్లో అతను ఒకడని నిస్సందేహంగా చెప్పవచ్చు. అతను పుస్తకాలు బాగా చదువుతాడు. బాగా రాస్తాడు కూడా! తమిళంలో కొన్ని పాటలు అతనే రాశాడు. ఇక, సినిమాల్లో డైలాగులైతే, పేరుకు వేరొక డైలాగ్ రైటర్ ఉన్నా, కమల్ భాగస్వామ్యం ఎక్కువగా ఉంటుందట! విభిన్నమైన కథాంశాలతో స్వయంగా చిత్రాలు నిర్మిస్తుంటాడు.
ఇన్ని లక్షణాలున్న అతను దర్శకుడిగా కూడా వ్యవహరించడం పెద్ద విశేషమేమీ కాదు. అయితే, నేరుగా అతని దర్శకత్వంలో నటించే అవకాశం నాకు ఇప్పటి దాకా రాలేదు. టీవీ, చలనచిత్రోత్సవాలు, ప్రపంచ సినిమా గురించి అతనికి ఉన్న అవగాహన కూడా చాలా ఎక్కువ. అందుకే, ఎప్పుడైనా వాటి ప్రస్తావన వచ్చి, మాట్లాడితే - అన్నీ పూసగుచ్చినట్లు చెబుతాడు. అలాంటి వ్యక్తికి తాజా సినీ సాంకేతిక పరిజ్ఞానం క్షుణ్ణంగా తెలిసుండడంలో ఆశ్చర్యం లేదు. ఒక్కమాటలో, ఇటు సృజనాత్మక అంశాల్లోనూ, అటు సాంకేతికంగానూ అతను దిట్ట. సమయం, సందర్భం వచ్చినప్పుడు ఆధ్యాత్మిక అంశాలూ గొప్పగా మాట్లాడతాడు.
నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా - ఇంత సాధించిన వ్యక్తికి ఇవాళ మా లాంటి వాళ్ళం కొత్త కథ, పాత్ర రూపకల్పన చేయడం కూడా కష్టమే. నిజం చెప్పాలంటే, అతని ఇమేజ్ ఇవాళ మాబోటి వాళ్ళకు అందకుండా వెళ్ళిపోయింది. ‘దశావతారం’, ‘విశ్వరూపం’ లాంటి స్థాయి ప్రయోగాలు తాజాగా చేసిన నటుడికి ఎలాంటి పాత్ర రాయాలన్నది పెద్ద సవాలే. అందుకే, ‘ఇప్పుడు నీకు తగ్గ కథ రాయడం కష్టం’ అని నవ్వుతూ అంటూ ఉంటా.
అయితే, ‘నందనార్’, ‘రామానుజాచారి’ లాంటి చారిత్రక ప్రసిద్ధమైన పాత్రలకు అతను చక్కగా సరిపోతాడు. అలాంటి పాత్రలు చేయడం అతనికిష్టం కూడా! ఆ ప్రయోగాలు కూడా అతను చేస్తే, ఒక సినీ ప్రియుడిగా చూడాలని ఉంది. ఎప్పుడూ బద్ధకించకుండా, మనసులో ఏదో ఆలోచిస్తూ, కొత్తదనం కోసం అన్వేషించే కమల్ది మన సినీ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. అతని కన్నా వయసులో పెద్దవాణ్ణి కాబట్టి, అతనికి ఈ షష్టిపూర్తి క్షణంలో చెప్పేదొక్కటే - ‘‘శతమానం భవతి.’’
భార్యకు క్షమాపణ చెప్పండి!
Sakshi | Updated: October 14, 2014 22:54 (IST)

సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ఇటీవల గీతం యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. నల్లగొండ జిల్లా సుద్దాల అనే గ్రామంలో, 1960 వైశాఖ పున్నమి రోజు పుట్టిన అశోక్తేజ అంతరంగాన్ని వీక్షించే ప్రయత్నం ఇది!
మీలో నచ్చే లక్షణం, అలాగే నచ్చని లక్షణం?
నచ్చని లక్షణం... మా ఆవిడను విసుక్కోవడం. నచ్చే లక్షణం దేవతామూర్తుల తర్వాత స్త్రీమూర్తులను అంతగా గౌరవించడం.
ఎదుటి వారిని చూసే దృష్టి కోణం?
వీరి నుంచి నేర్చుకోగలిగింది ఏమిటి అని.
ఎలాంటి వారిని ఇష్టపడతారు?
మానవీయత ఉన్న వారిని ఏడు జన్మల స్నేహితులుగా భావిస్తాను.
డాక్టరేట్ అందుకున్న క్షణంలో కలిగిన భావం?
సినిమా అవార్డులు ఆ ఏడాది వచ్చిన సినిమాల ఆధారంగా ఇస్తారు. డాక్టరేట్ అనేది మన పనిని ఆమూలాగ్రం మూల్యాంకనం చేసి ఇచ్చేది. కాబట్టి ఎన్నో రెట్లు ఎక్కువ ఆనందాన్ని పొందాను. గౌను వేస్తున్నప్పుడు అద్భుతమైన, అప్రమేయమైన ఆనందం కలిగింది.
మీకు నచ్చిన పుస్తకాలు..!
అమ్మ టైలరింగ్ చేస్తున్నప్పుడు నేను చదివి వినిపించిన వాటిలో మాక్సిం గోర్కీ రాసిన ‘అమ్మ’ నవల బాగా నచ్చింది. నాన్న ఒళ్లో కూర్చోబెట్టుకుని కంఠతా వచ్చేలా చదివించిన మహాప్రస్థానం నా రక్తంలో ఇంకి పోయింది.
ఏ రంగలో స్థిరపడాలనుకునేవారు?
... ఆరవ తరగతి నుంచి డాక్టర్ సి.నా.రె.లా సినీరచయిత కావాలనుకునేవాడిని. అలాగే అయ్యాను.
మీరు ఎక్కువ ఇష్టపడే వ్యక్తి ఎవరు?
ఒకరు కాదు ఇద్దరు. అమ్మ, మా ఆవిడ.
మిమ్మల్ని ప్రభావితం చేసిన వారు!
మొదట నాన్న. తర్వాత నారాయణరెడ్డి.
తొలి పాట రాసినప్పటి అనుభూతి
... తొమ్మిదేళ్లకే రాశాను. అనుభూతి తెలియని వయస్సది. ఎనిమిదవ తరగతిలో పాఠాన్ని పాటగా రాసినప్పుడు వచ్చిన ప్రశంస అనిర్వచనీయం.
తొలి సంపాదన!
... దాసరి నారాయణరావు నా పాటలు విని ‘‘నీ పాటలు తీసుకుంటాను’’ అని కవిని ఊరికే పంపకూడదంటూ మూడువేల రూపాయలిచ్చారు. ఆ డబ్బుతో నా కుటుంబాన్నంతటినీ (అక్క- బావతోపాటు) తిరుపతికి తీసుకెళ్లాను. అది నా మనసును నింపిన తొలి సంపాదన.
అలాంటి మనసు నిండిన మరో సంఘటన?
నా భార్య నిర్మలతో కలిసి ఓ ఫంక్షన్కెళ్తుండగా ఒక ఫోన్. అవతలి వ్యక్తి ‘‘వైస్ చాన్స్లర్గారు మాట్లాడతారు’’ అని చెప్పారు. ఏదో కార్యక్రమం గురించేమో అనుకున్నాను. ఆయన డాక్టరేట్ గురించి చెప్పారు. నన్ను నేను తట్టుకోవడానికి నిర్మల చేతిని గట్టిగా పట్టుకున్నాను.
మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తి?
...ఒకరిద్దరు కాదు. సినిమా రంగంలో ఇది మామూలే.
అప్పుడలా చేసి ఉండాల్సింది కాదు అనిపిం చిన పని... నిర్ణయం?
ప్రతిదీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను పునరాలోచించుకోవాల్సిన అవసరమే రాలేదు.
ఎవరికైనా క్షమాపణ చెప్పారా?
మా ఆవిడకే. విసుక్కుని నొప్పించాను అనిపిస్తుండేది. అంతే... క్షమాపణ చెప్పేశాను.
మీలా ఆలోచించే భర్తలు తక్కువేమో?
ఇది భర్తలకు సూచన... ‘భార్యకు క్షమాపణ చెప్పడానికి వెనుకాడవద్దు. మీరు క్షమాపణ చెప్పిన విషయాన్ని ఆవిడ ఎవరికీ చెప్పదు. సత్యభామ కాళ్లు పట్టుకున్న విషయాన్ని కృష్ణుడు తనంతట తాను చెప్పుకున్నాడే తప్ప సత్యభామ చెప్పలేదు’.
భాగస్వామికి సమయం కేటాయిస్తున్నారా?
సినిమా ప్రయత్నాల సమయంలో ఒకరినొకరు దినాలు, నెలలు కూడా మిస్సయ్యాం.
పాటల్లో ఉపయోగించే భావం...
కృష్ణశాస్త్రి మెత్తదనాన్ని, శ్రీశ్రీ కత్తిదనాన్ని మేళవించి రాశాను. కవిత్వం, సాహిత్యం తెలియని వారికి కూడా హృదయం లోపల ఒక సున్నితమైన పాయింట్ ఉంటుంది. నా కలం ములుకు ఆ బిందువును తాకాలన్నట్లు రాస్తాను.
కుటుంబ జీవితంలో ఆనందపడిన క్షణాలు?
నా కూతురికి ఇద్దరు కూతుళ్లు. నా కొడుక్కి ఒక కొడుకు. వారితో ఆడుకుంటుంటే గర్భగుడిలో దైవం సాన్నిహిత్యంలో ఉన్నట్లుంటుంది.
ఒక్క రోజు మిగిలి ఉంటే ఏం చేస్తారు?
మొదలు పెట్టాల్సిన పనులు చాలా ఉన్నాయి. ముగించాల్సిన పని ఒక్కటీ లేదు.
ఎప్పుడైనా అబద్ధం చెప్పారా?
ఎక్కువ మా ఆవిడతోనే. అయితే అన్నీ ప్రమాదానికి దారితీయని చిల్లర అబద్ధాలే.
దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటారు?
మళ్లీ ఇలాగే... ప్రజల మనసులను తాకే రచయితగా... పుట్టించమని కోరుకుంటాను.
మీ గురించి మీరు ఒక్కమాటలో...
మాటతోనైనా, పాటతోనైనా హృదయాలను కదిలించే వ్యక్తిని
శివ @25
Sakshi | Updated: October 05, 2014 06:57 (IST)
గొప్ప గొప్ప వాళ్ల గురించి మాట్లాడుకునేటప్పుడు వాళ్ల బర్త్ ప్లేస్ల గురించి కూడా ప్రస్తావన వస్తుంది. గొప్ప సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు దాని బర్త్ ప్లేస్ గురించి కూడా మాట్లాడుకోవాలిగా! అయితే ఇప్పుడు మనం అర్జంట్గా అమీర్పేట చౌరస్తాలోని ‘మూవీహౌజ్’ వీడియో లైబ్రరీ దగ్గరకు వెళ్లాల్సిందే! ఎందుకంటే ‘శివ’ పుట్టింది అక్కడే...

నైజీరియాకు సివిల్ ఇంజినీర్గా వెళ్లాల్సిన అతగాణ్ణి... ఆ ఉన్మాదమే అప్పు చేసి మరీ వీడియో లైబ్రరీ ఓనర్ని చేసింది. బెజవాడలో సివిల్ ఇంజినీరింగ్ చేసినవాడు... ఈ చిన్న షాపు నడపడానికి సిగ్గు పడలేదు. అందుకు కారణమూ ఆ సినిమా అనే ఉన్మాదమే. ఎంత పెద్ద తాళం కప్పకైనా... చిన్న తాళం చెవే ఉంటుంది. ఆ కిటుకు వర్మకు తెలుసు. యార్లగడ్డ సురేంద్ర... నాగార్జునకు స్వయానా పెద బావగారు. ఆ వీడియో లైబ్రరీకి రెగ్యులర్ కస్టమర్. ఇక్కడ స్విచ్ నొక్కాడు. వెంకట్ అక్కినేని దగ్గర బల్బు వెలిగింది. కట్ చేస్తే - వెంకట్ దగ్గర కథ చెప్పే ఛాన్స్.
రాత్రంతా కష్టపడి తయారు చేసిన కథ. దాని పేరు ‘రాత్రే’. ప్చ్... వెంకట్ పెదవి విరిచాడు. వర్మకు కోపమొచ్చింది... కాదు కాదు... కసి రేగింది. ఆ వీడియో లైబ్రరీ పుణ్యమా అంటూ రాత్రింబవళ్లూ తను చూసిన ఇంగ్లీషు, హిందీ, తమిళ సినిమాలన్నీ మస్తిష్కం మీద దండయాత్ర చేశాయి. ఏవేవో ఆలోచనలు. వాటికి విజయవాడలోని తన కాలేజీ అనుభవాలన్నీ కలగలిపి అరగంటలో సింగిల లైన్ ఆర్డర్ రెడీ చేశాడు. అంతా ఆ వీడియో లైబ్రరీలో కూర్చుని రాసిందే. దీన్ని నాగ్... నాగార్జునకు వినిపించాలి. ఎలా? ఎంట్రీ... టు అన్నపూర్ణ స్టూడియో. ‘విజయ్’ సినిమాకు కెమెరామేన్ ఎస్. గోపాలరెడ్డి దగ్గర అబ్జర్వర్... ‘కలెక్టర్గారబ్బాయ్’కి దర్శకుడు బి.గోపాల్కు అప్రెంటీస్.. ‘రావుగారిల్లు’ దగ్గరకొచ్చేసరికి హోదా పెరిగింది.
వెంకట్, సురేంద్రలకు వర్మ మీద గురి కుదిరింది. అప్పటికే నాగ్కు లైన్ చెబితే ఓకే. ఇక వీళ్లను ఒప్పించాలి. వర్మ తిమ్మిని బమ్మి చేయగలడు. ఎలాంటివాణ్ణయినా బుట్టలో పడేయగలడు. వాళ్లిద్దరికీ నచ్చినట్టే ఉంది. కానీ రిస్కేమోనన్న డౌటూ ఉంది. ఇప్పుడు బాల్ కె. రాఘవేంద్రరావు కోర్టులో పడింది.బర్నింగ్ టిప్ ఆఫ్ ఎ సిగరెట్.. యాష్... ఇలా ఈచ్ అండ్ ఎవ్విర్థింగ్ షాట్స్తో సహా చెప్పాలనుకున్నాడు వర్మ.కానీ రాఘవేంద్రరావు కథను కథలా చెప్పమన్నారు.
అలాగైతే ఏం చెప్పాలి?

టోటల్గా స్క్రిప్టు రెడీ. వర్మ ఆ తర్వాత బౌండ్ స్క్రిప్టులు చేసుకున్నాడో లేదో తెలీదు కానీ, ‘శివ’కు మాత్రం పక్కా స్క్రిప్టు రెడీ.
షాట్ బై షాట్. ఏది రాసుకున్నాడో... అదే తీశాడు. నో ఛేంజెస్. ఫస్ట్ అనుకున్న టైటిల్ ‘భవానీ’. అది హీరో పేరే. విలనేమో శివ. నాగ్కి మాత్రం ‘శివ’ పేరు నచ్చింది. దాంతో టైటిల్ రివర్సయ్యింది. అమల హీరోయిన్. రఘువరన్ విలన్. కోట శ్రీనివాసరావు, మురళీమోహన్, సాయిచంద్, భరణి, గొల్లపూడి... వీళ్లే సీనియర్స్. మిగతావాళ్లంతా దాదాపుగా కొత్తవాళ్లే. జేడీ, ఉత్తేజ్... వగైరా వగైరా.
1989 అక్టోబర్ 5.
థియేటర్లో సినిమా విడుదలైంది. ప్రదర్శన మొదలైంది. పావుగంట గడిచింది. హీరో రెండు, మూడు ముక్కల డైలాగులు తప్ప పెద్దగా మాట్లాడటం లేదు. సినిమా అంతా అంతే. మాటలు తక్కువ. యాక్షన్లో అతి లేదు. విచిత్రమైన కెమేరా యాంగిల్స్. ఆర్ఆర్, ఫొటోగ్రఫీ, ఎడిటింగ్, ఆర్టు, ఫైట్సు... ఇలా ప్రతి క్రాఫ్టులోనూ ఏదో మెస్మరిజం! థియేటర్లో నో విజిల్స్. నో క్లాప్స్. పిన్డ్రాప్ సెలైన్స్. బయటికొచ్చాక కూడా ప్రేక్షకుడిలో అదే మౌనం. ఆ సెలైన్స్ ఎంత వయొలెన్స్ను సృష్టించిందో ఇప్పుడు మళ్లీ మనం కొత్తగా చెప్పనవసరం లేదు. అదంతా చరిత్ర. గుర్తు పెట్టుకోవాల్సిన చరిత్ర. కొత్తదనానికి కవర్పేజీ లాంటి చరిత్ర. హీరో అంటే ఇలానే ఉండాలి... సినిమా అంటే ఇలాగే తీయాలి లాంటి బాక్సాఫీస్ పడికట్టు సూత్రాలను షిఫ్ట్ డిలీట్ చేసి, కొత్త సాఫ్ట్వేర్ ఎక్కించిన చరిత్ర.
‘శివ’ నుంచి మనం తెలుసుకోవాల్సింది...
కాన్ఫిడెన్స్! నమ్మకం!! విశ్వాసం!!!

ఇవి ఉంటే వండర్స్ సృష్టించొచ్చు. పెద్దగా అసిస్టెంట్గా పనిచేయనివాడు... ఎక్కువ రోజులు ఇండస్ట్రీలో తిరగనివాడు... రామ్గోపాల్ వర్మ. కానీ నాగార్జున నమ్మాడు. నాగ్ నమ్మాడంటే, అతనిలో ఏదో విషయం ఉందని నిర్మాతలూ నమ్మారు. ఎస్. గోపాలరెడ్డి... అప్పటికి పాతిక సినిమాలు తీసిన బిజీయెస్ట్ కెమేరామేన్. తాతకు దగ్గులు నేర్పినట్టుగా తనకు షాట్స్, లైటింగ్ గురించి... స్టడీకామ్ గురించి వర్మ చెబుతుంటే... గోపాలరెడ్డి విసుక్కోలేదు. అతనిలోని ఉత్సాహాన్ని పాజిటివ్గా తీసుకున్నారు. కానీ, తీరా అవుట్పుట్ చూసి నిర్మాతలు బెంబేలెత్తి పోతుంటే ‘మై హూనా’ అంటూ ఇళయరాజా వచ్చి రీ-రికార్డింగ్తో మేజిక్ చేశాడు. ఎందుకంటే... ఈ ప్రాజెక్ట్నూ ఆయన నమ్మాడు కనుక. ఫైనల్గా... వర్మ తన కథను నమ్మాడు. తనలోని డెరైక్టర్ని నమ్మాడు. ఎస్... వర్మలోని ఆ కాన్ఫిడెన్సే అతనికి గాడ్ఫాదర్. వర్మ... వింటున్నారా!?
- పులగం చిన్నారాయణ
షూటింగ్ ఎక్కడెక్కడ..!
► 1989 ఫిబ్రవరి 16న అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభోత్సవం.ఉదయం 10.30 గంటలకు నాగార్జున, అమలపై ఫస్ట్ షాట్. కెమెరా స్విచాన్ ఏయన్నార్ చేశారు. క్లాప్ - పెన్మెత్స కృష్ణంరాజు ఇచ్చారు.
► ఈయన వర్మ నాన్నగారు. అన్నపూర్ణ స్టూడియోలో సౌండ్ ఇంజినీర్.
వర్కింగ్ డేస్ - 55 రోజులు.
► సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు సమీపంలోని కీస్ హైస్కూల్లో - కాలేజ్ సీన్స్
► ‘శుభలేఖ’ సుధాకర్ డెత్ సీన్ - కీసరగుట్ట
► రాంజగన్ డెత్ సీన్ - హైదరాబాద్లోని వెంగళరావునగర్ వీధులు
► క్లైమాక్స్ - సికింద్రాబాద్లోని స్వప్నలోక కాంప్లెక్స్
► క్లైమాక్స్లో లిఫ్ట్ సీన్ - మద్రాసులోని వీనస్ స్టూడియో
► రెయిన్ ఫైట్ - మద్రాసులోని వీనస్ స్టూడియో
► సైకిల్ ఛేజ్ - సోమాజీగూడ యశోదా హాస్పటల్ వెనుక స్లమ్ ఏరియా
► బస్ ఛేజ్ - యూసఫ్గూడ మెయిన్ చౌరస్తా
► ‘ఆనందో బ్రహ్మ’ సాంగ్ - వైజాగ్ సమీపంలోని బొర్రా గుహలు
► మిగతా పాటలు - అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్స్
► నాగ్, అమల బెడ్రూమ్ సీన్స్ - సికింద్రాబాద్లోని ఉస్మాన్ అలీ హౌస్
అసలు సైకిల్ చెయిన్ ఎపిసోడ్ పెట్టాలని ఎందుకనిపించింది? దానికి ఇన్స్పిరేషన్?

- రామ్గోపాల్ వర్మ
మనీ మేటర్స్...
1. రామ్గోపాల్వర్మ - 50 వేలు + లాభాల్లో 5% వాటా
2. ఇళయరాజా - 4 లక్షలు
3. తనికెళ్ల భరణి - 35 వేలు (రాసినందుకు + నానాజీ వేషం వేసినందుకు)
4. రఘువరన్ - 2 లక్షలు
5. శివ నాగేశ్వరరావు - 37 వేలు
6. మొత్తం సినిమా బడ్జెట్ - 85 లక్షలు
7. నైజాంలో కోటి రూపాయలు వసూలు చేసిన తొలి సినిమా.
8. నైజాం, వైజాగ్ ఉభయ గోదావరి జిల్లాల్లో నిర్మాతలే సొంతంగా పంపిణీ చేసుకున్నారు.
9. ‘గీతాంజలి’ నిర్మాత సీఎల్ నరసారెడ్డి గుంటూరు జిల్లాలో పంపిణీ చేశారు.
10. సినిమా రిలీజ్కు ముందు రీమేక్ హక్కులకు లక్ష రూపాయలు ఇస్తామన్నారు. రిలీజ్ తర్వాత తమిళంలో డబ్బింగ్ చేస్తే 85 లక్షలకు బిజినెస్ అయ్యింది. 2 కోట్లకు పైగా వసూలు చేసింది.
- పులగం చిన్నారాయణ
అయినవాడే అందరికీ... అయినా అందడు ఎవ్వరికీ..!
Sakshi | Updated: November 06, 2014 23:48 (IST)

తెలుగు చలన చిత్ర ప్రేక్షకులు ఇక్కడి వాళ్ళైనా, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళైనా, త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే ఇష్టం, అభిమానం లేని వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరేమో! ఆవిధంగా అందరిలాగే నేను కూడా అతని అభిమానిని! సినిమా ద్వారా అందరికీ సుపరిచితమైన అతని ప్రతిభా విశేషాల గురించి మరోసారి విస్తారంగా ప్రస్తావించవలసినది లేదు. దాదాపు దశాబ్దిన్నర పైగా, అతన్ని అతి సన్నిహితుడుగా ఎరిగి ఉన్న వాణ్ణి గనక, జన బాహుళ్యానికి అంతగా పరిచయం లేని అతని విశిష్ట వ్యక్తిత్వం గురించి (వ్యక్తిగత విషయాల గురించి కాదు) క్లుప్తంగా చెప్పడం సందర్భానికి సముచితంగా ఉంటుందనుకుటున్నాను.
రచయితగా, దర్శకుడిగా, అతని గురించి విశ్లేషిస్తూ పనిగట్టుకుని ప్రయత్నిస్తే అతనిలో ఒకటో, అరో లోపాలు వెతికి చూడగలవేమో కానీ, కొడుకుగా, అన్నగా, తమ్ముడిగా, భర్తగా, స్నేహితుడిగా, సామాజికుడిగా... ఇలా జీవితంలో ఎదురైన ప్రతి పాత్రకి పరిపూర్ణ న్యాయం కలిగించడంలో ఇంత చిన్న వయసులో (నా వయసుతో పోలిస్తే) అతను సాధించిన పరిణతి వేలెత్తి వంక చూపవీల్లేనిది. అతనంటే నాకున్న అపారమైన ఇష్టానికి ఇదొక ముఖ్య కారణం!విద్య, వివేకము, వినయం, సమపాళ్ళలో కలగలుపుకున్న అరుదైన వ్యక్తి. గుండెల్లో కొండంత నిబ్బరం, అపారమైన ఆత్మవిశ్వాసం, అణుమాత్రమైనా అహంకారం లేకపోవడం వంటి విలువైన లక్షణాలు జన్మసిద్ధంగా అబ్బిన వ్యక్తి. సునిశితమైన మేధస్సు, సున్నితమైన మనస్సు అతని సహజగుణాలు.
తన అంతర్గత శక్తులు, తన పరిమితులు, తన ప్రయాణ మార్గాలు, మజిలీలు అన్నిటి గురించి ఏమాత్రం తడబాటు లేని స్పష్టమైన అవగాహన అతనికే ప్రత్యేకమైన సుగుణం. ఒక చిట్టాలో పైన వల్లించిన ఉత్తమ లక్షణాలన్నీ అనడానికీ వినడానికీ బాగానే ఉంటాయి గానీ, అవన్నీ కలిగి ఉన్న వాళ్ళు నూటికో కోటికో ఒకళ్లుంటారు. అలాంటి వాళ్ళలో అతను ఒకడు.ఏ రకంగానూ, చుట్టుపక్కల నుంచి ఎవ్వరూ, ఏ చిన్న చేయూతని కూడా అందించలేని ఒకానొక దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి కేవలం తన స్వశక్తితో ఇంత ఎత్తుకి ఎదిగిన త్రివిక్రమ్, ఆ ఎదుగుదల క్రమంలో ఎంతమందికి, ఇంత అని చెప్పలేనంతగా చేయూతనందించాడో, పొందిన వారెవ్వరూ ఎప్పుడూ మరచిపోరు. అలా తానెందరికో ఆసరాగా నిలిచిన సంగతి అతనెన్నడూ గుర్తుపెట్టుకోడు.
ఒక నీడనిచ్చే చెట్టులా, నీటినిచ్చే ఏటిలా, ఊపిరిచ్చే గాలిలా, అలా అలా సింపుల్గా, న్యాచురల్గా అతను సాటి మనుషుల పట్ల స్పందించే తీరు నాకు అశ్చర్యానందాలు కలగజేస్తుంది.సుగంధం చిందడం పూలకెంత సహజమో, అలా తన ఈ ‘గొప్పతనం’ లేదా ఈ మంచితనం.. వీటిని అతను ప్రదర్శించడు... ప్రవర్తిస్తాడు. అంతే!అతని సహజ లక్షణం అతని చిత్రాల్లో, కథల్లో, కథనంలో, సంభాషణల్లో ప్రతిఫలిస్తుంటుంది. ‘అతి’ గాని, మెలోడ్రమెటైజేషన్ గాని, కాంప్లికేషన్గానీ లేకపోవడం అనే అతని శైలిని పరిశీలిస్తే, అవి కావాలని తెచ్చి పెట్టుకున్న ప్రక్రియలు కావనీ, అతని సొంత సంతకం అని తెలుస్తుంది.
అతను తన భావోద్వేగాలను (ఎమోషన్స్), అభిప్రాయాలనూ అదుపులో ఉంచుకునే సంవిధానం అత్యంత అరుదైన లక్షణం. ఇది నేర్పితే వచ్చేది కాదు. ఏ ఫార్మాలిటీస్ లేని వాడిలా కనిపిస్తూ, ఎక్కడ తన అవసరం ఉంటే అక్కడికి పిలవకుండానే వెళ్ళి అక్కడి (అక్కర) తీర్చి ఏవీ పట్టని వాడిలా ఇట్టే చటుక్కున మాయం అయిపోతాడు. ఎప్పుడో నేను రాసిన ఓ పాటలో ‘‘అయినవాడే అందరికీ... అయినా అందడు ఎవ్వరికీ’’ అన్నట్టుగా అనిపిస్తూ ఉండడం అతని ప్రత్యేకత. అతను మంచి వక్త. అయినా ఎప్పుడుపడితే అప్పుడు, ఎక్కడ బడితే అక్కడ, ఏది బడితే అది మాట్లాడేస్తూ ఉండడు. కనుకనే అతను ఎప్పుడైనా బహిరంగ వేదికల మీదుగా మాట్లాడుతూ ఉంటే ఏటికోసారి వచ్చే పండుగలా ఉంటుంది. అతను ప్రచార ప్రసార మధ్యమాల్లో కూడా తరచుగా కనబడడు. అతని సినిమాలే అతన్ని చూపిస్తాయి.
కాస్త వివరంగానే రాశానేమో... ఇది చదివితే అతను ‘కొంచెం ఎక్కువగా రాశారేమో కదండీ!’ అన్నా అంటాడు. అతని సినిమాలు చూస్తూ వాటి ద్వారా అతన్ని చూడడానికి ప్రయత్నించేవారికి నేను రాసిన ఈ పద్ధతి ‘మరీ ఎక్కువేమో’ అనిపించదని నా నమ్మకం.ఇక మా ఇద్దరికి ఉన్న వ్యక్తిగత, వృత్తిగత సంబంధ బంధవ్యాలకు సంబంధించి ఒకే మాట... ఇద్దరం పరస్పరం గౌరవించుకుంటాం. ఇరుకు అనిపించేంత దగ్గరగా ఉండం, అరిచినా వినిపించనంత దూరంగా ఉండం! శ్రీనూ! నీ గురించి నా మనసులో ఉన్న నాలుగు మాటలు నీకు చెప్పనివి నాకు చెప్పాలనిపించినవి చెప్పడానికి అవకాశమిచ్చిన సాక్షి పత్రిక వారికి కృతజ్ఞతలు...
శతాయుష్మాన్భవ!!!
త్రివిక్రమ్ పని చేసిన చిత్రాలకు నేను పాటల రచన చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో తన వంతు భాగం కూడా అందులో కలిసేది. పాట గురించి మా మధ్య చర్చ జరిగి, అందులో నుంచి రూపుదిద్దుకొన్న రచనకు ‘నువ్వేకావాలి’ చిత్రంలోని ‘అనగనగా ఆకాశం ఉంది...’ పాట ఓ ఉదాహరణ. అలా అతని భాగస్వామ్యమున్న పాటలు చాలానే ఉన్నాయి. ఆ మాటకొస్తే త్రివిక్రమ్లో కూడా మంచి పాటల రచయిత ఉన్నాడు. ఒక సినిమా (ఒక రాజు ఒక రాణి)కు పూర్తిగా పాటలన్నీ రాసిన అనుభవమూ అతనికి ఉంది. కానీ, అతని దృష్టి అంతా దర్శకత్వం మీదే!
త్రివిక్రమ్ సినిమాలకు పాటలు రాస్తున్నప్పుడు మా మధ్య చర్చలు రావా, వాదన ఉండదా అంటే... ఎందుకుండవు? ఉంటాయి. కాకపోతే, అది ఆ సన్నివేశానికి తగ్గ సరైన సాహిత్యంతో, భావంతో రచన కోసమే! అది అక్కడకే పరిమితం. అతని సినిమాల్లో కొన్ని మంచి పాటలు రాసే అవకాశం వచ్చింది, రాశాను. ‘జల్సా’ చిత్రంలో తెలుగు భాషలో భాగమైపోయిన ఇంగ్లీషు పదాలు వాడుతూ ‘మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా...’ పాట రాసినా, ‘చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్...’ లాంటి భావగర్భితమైన పాట రాసినా... జనం అంతే ఆనందంగా అర్థం చేసుకున్నారు... ఆస్వాదించారు... ఆనందించారు! ఇటీవల ‘జులాయి’లో కానీ, ‘అత్తారింటికి దారేది’లో కానీ నేను పాటలకు రాయకపోవడానికి కారణం - వాటిలో నేను రాయదగ్గ పాటలున్నాయని దర్శకుడు త్రివిక్రమ్ భావించకపోవడమే! నేను మాత్రమే రాయాల్సిన, రాయగల పాటలు ఉన్నప్పుడు అతను తప్పకుండా నా దగ్గరకు వస్తాడు. నాతోనే రాయించుకుంటాడు.
ఇట్లు
సిరివెన్నెల సీతారామశాస్త్రి
రచయితగా, దర్శకుడిగా, అతని గురించి విశ్లేషిస్తూ పనిగట్టుకుని ప్రయత్నిస్తే అతనిలో ఒకటో, అరో లోపాలు వెతికి చూడగలవేమో కానీ, కొడుకుగా, అన్నగా, తమ్ముడిగా, భర్తగా, స్నేహితుడిగా, సామాజికుడిగా... ఇలా జీవితంలో ఎదురైన ప్రతి పాత్రకి పరిపూర్ణ న్యాయం కలిగించడంలో ఇంత చిన్న వయసులో (నా వయసుతో పోలిస్తే) అతను సాధించిన పరిణతి వేలెత్తి వంక చూపవీల్లేనిది. అతనంటే నాకున్న అపారమైన ఇష్టానికి ఇదొక ముఖ్య కారణం!విద్య, వివేకము, వినయం, సమపాళ్ళలో కలగలుపుకున్న అరుదైన వ్యక్తి. గుండెల్లో కొండంత నిబ్బరం, అపారమైన ఆత్మవిశ్వాసం, అణుమాత్రమైనా అహంకారం లేకపోవడం వంటి విలువైన లక్షణాలు జన్మసిద్ధంగా అబ్బిన వ్యక్తి. సునిశితమైన మేధస్సు, సున్నితమైన మనస్సు అతని సహజగుణాలు.
తన అంతర్గత శక్తులు, తన పరిమితులు, తన ప్రయాణ మార్గాలు, మజిలీలు అన్నిటి గురించి ఏమాత్రం తడబాటు లేని స్పష్టమైన అవగాహన అతనికే ప్రత్యేకమైన సుగుణం. ఒక చిట్టాలో పైన వల్లించిన ఉత్తమ లక్షణాలన్నీ అనడానికీ వినడానికీ బాగానే ఉంటాయి గానీ, అవన్నీ కలిగి ఉన్న వాళ్ళు నూటికో కోటికో ఒకళ్లుంటారు. అలాంటి వాళ్ళలో అతను ఒకడు.ఏ రకంగానూ, చుట్టుపక్కల నుంచి ఎవ్వరూ, ఏ చిన్న చేయూతని కూడా అందించలేని ఒకానొక దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి కేవలం తన స్వశక్తితో ఇంత ఎత్తుకి ఎదిగిన త్రివిక్రమ్, ఆ ఎదుగుదల క్రమంలో ఎంతమందికి, ఇంత అని చెప్పలేనంతగా చేయూతనందించాడో, పొందిన వారెవ్వరూ ఎప్పుడూ మరచిపోరు. అలా తానెందరికో ఆసరాగా నిలిచిన సంగతి అతనెన్నడూ గుర్తుపెట్టుకోడు.
ఒక నీడనిచ్చే చెట్టులా, నీటినిచ్చే ఏటిలా, ఊపిరిచ్చే గాలిలా, అలా అలా సింపుల్గా, న్యాచురల్గా అతను సాటి మనుషుల పట్ల స్పందించే తీరు నాకు అశ్చర్యానందాలు కలగజేస్తుంది.సుగంధం చిందడం పూలకెంత సహజమో, అలా తన ఈ ‘గొప్పతనం’ లేదా ఈ మంచితనం.. వీటిని అతను ప్రదర్శించడు... ప్రవర్తిస్తాడు. అంతే!అతని సహజ లక్షణం అతని చిత్రాల్లో, కథల్లో, కథనంలో, సంభాషణల్లో ప్రతిఫలిస్తుంటుంది. ‘అతి’ గాని, మెలోడ్రమెటైజేషన్ గాని, కాంప్లికేషన్గానీ లేకపోవడం అనే అతని శైలిని పరిశీలిస్తే, అవి కావాలని తెచ్చి పెట్టుకున్న ప్రక్రియలు కావనీ, అతని సొంత సంతకం అని తెలుస్తుంది.
అతను తన భావోద్వేగాలను (ఎమోషన్స్), అభిప్రాయాలనూ అదుపులో ఉంచుకునే సంవిధానం అత్యంత అరుదైన లక్షణం. ఇది నేర్పితే వచ్చేది కాదు. ఏ ఫార్మాలిటీస్ లేని వాడిలా కనిపిస్తూ, ఎక్కడ తన అవసరం ఉంటే అక్కడికి పిలవకుండానే వెళ్ళి అక్కడి (అక్కర) తీర్చి ఏవీ పట్టని వాడిలా ఇట్టే చటుక్కున మాయం అయిపోతాడు. ఎప్పుడో నేను రాసిన ఓ పాటలో ‘‘అయినవాడే అందరికీ... అయినా అందడు ఎవ్వరికీ’’ అన్నట్టుగా అనిపిస్తూ ఉండడం అతని ప్రత్యేకత. అతను మంచి వక్త. అయినా ఎప్పుడుపడితే అప్పుడు, ఎక్కడ బడితే అక్కడ, ఏది బడితే అది మాట్లాడేస్తూ ఉండడు. కనుకనే అతను ఎప్పుడైనా బహిరంగ వేదికల మీదుగా మాట్లాడుతూ ఉంటే ఏటికోసారి వచ్చే పండుగలా ఉంటుంది. అతను ప్రచార ప్రసార మధ్యమాల్లో కూడా తరచుగా కనబడడు. అతని సినిమాలే అతన్ని చూపిస్తాయి.
కాస్త వివరంగానే రాశానేమో... ఇది చదివితే అతను ‘కొంచెం ఎక్కువగా రాశారేమో కదండీ!’ అన్నా అంటాడు. అతని సినిమాలు చూస్తూ వాటి ద్వారా అతన్ని చూడడానికి ప్రయత్నించేవారికి నేను రాసిన ఈ పద్ధతి ‘మరీ ఎక్కువేమో’ అనిపించదని నా నమ్మకం.ఇక మా ఇద్దరికి ఉన్న వ్యక్తిగత, వృత్తిగత సంబంధ బంధవ్యాలకు సంబంధించి ఒకే మాట... ఇద్దరం పరస్పరం గౌరవించుకుంటాం. ఇరుకు అనిపించేంత దగ్గరగా ఉండం, అరిచినా వినిపించనంత దూరంగా ఉండం! శ్రీనూ! నీ గురించి నా మనసులో ఉన్న నాలుగు మాటలు నీకు చెప్పనివి నాకు చెప్పాలనిపించినవి చెప్పడానికి అవకాశమిచ్చిన సాక్షి పత్రిక వారికి కృతజ్ఞతలు...
శతాయుష్మాన్భవ!!!
త్రివిక్రమ్ పని చేసిన చిత్రాలకు నేను పాటల రచన చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో తన వంతు భాగం కూడా అందులో కలిసేది. పాట గురించి మా మధ్య చర్చ జరిగి, అందులో నుంచి రూపుదిద్దుకొన్న రచనకు ‘నువ్వేకావాలి’ చిత్రంలోని ‘అనగనగా ఆకాశం ఉంది...’ పాట ఓ ఉదాహరణ. అలా అతని భాగస్వామ్యమున్న పాటలు చాలానే ఉన్నాయి. ఆ మాటకొస్తే త్రివిక్రమ్లో కూడా మంచి పాటల రచయిత ఉన్నాడు. ఒక సినిమా (ఒక రాజు ఒక రాణి)కు పూర్తిగా పాటలన్నీ రాసిన అనుభవమూ అతనికి ఉంది. కానీ, అతని దృష్టి అంతా దర్శకత్వం మీదే!
త్రివిక్రమ్ సినిమాలకు పాటలు రాస్తున్నప్పుడు మా మధ్య చర్చలు రావా, వాదన ఉండదా అంటే... ఎందుకుండవు? ఉంటాయి. కాకపోతే, అది ఆ సన్నివేశానికి తగ్గ సరైన సాహిత్యంతో, భావంతో రచన కోసమే! అది అక్కడకే పరిమితం. అతని సినిమాల్లో కొన్ని మంచి పాటలు రాసే అవకాశం వచ్చింది, రాశాను. ‘జల్సా’ చిత్రంలో తెలుగు భాషలో భాగమైపోయిన ఇంగ్లీషు పదాలు వాడుతూ ‘మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా...’ పాట రాసినా, ‘చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్...’ లాంటి భావగర్భితమైన పాట రాసినా... జనం అంతే ఆనందంగా అర్థం చేసుకున్నారు... ఆస్వాదించారు... ఆనందించారు! ఇటీవల ‘జులాయి’లో కానీ, ‘అత్తారింటికి దారేది’లో కానీ నేను పాటలకు రాయకపోవడానికి కారణం - వాటిలో నేను రాయదగ్గ పాటలున్నాయని దర్శకుడు త్రివిక్రమ్ భావించకపోవడమే! నేను మాత్రమే రాయాల్సిన, రాయగల పాటలు ఉన్నప్పుడు అతను తప్పకుండా నా దగ్గరకు వస్తాడు. నాతోనే రాయించుకుంటాడు.
ఇట్లు
సిరివెన్నెల సీతారామశాస్త్రి
విశ్లేషణం: మనసున్న మాంత్రికుడు
Sakshi | Updated: February 09, 2014 03:13 (IST)

మనసు మనిషి...
సినిమాల్లో మాటల తూటాలు పేల్చే త్రివిక్రమ్ బయట మాత్రం చాలా తక్కువగా మాట్లాడతాడు... ఈ మధ్యనే కొంచెం కొంచెం మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు గమనిస్తే... కూర్చుని ఉంటే కాళ్లు ఆడిస్తూ ఉంటాడు. నిల్చున్నా చాలా ఈజ్గా ఉంటాడు. తల కొంచెం కుడివైపుకు వంచి, తలాడిస్తూ మాట్లాడుతుంటాడు. ఇవన్నీ ఆయనది అనుభూతి ప్రధానమైన వ్యక్తిత్వమని చెప్తుంటాయి. ఈ వ్యక్తిత్వమున్నవారు మనుషులతో కలిసి ఉండటానికి ఇష్టపడుతుంటారు. మనుషుల గురించి తెలుసుకుంటారు. నచ్చినవారితో అనుబంధాన్ని పెంచుకుంటారు. వారితో బంధాలకు, బాంధవ్యాలకు ప్రాధాన్యతనిస్తుంటారు. వారితో గడపడానికి ఇష్టపడతారు. గట్టిగా మాట్లాడేవాళ్లంటే ఇష్టపడరు. అందుకేనేమో త్రివిక్రమ్కు మహేష్బాబు, పవన్కళ్యాణ్తో అంతగా అనుబంధం కుదిరింది. సునీల్తో స్నేహం ఏళ్లుగా కొనసాగుతోంది.
అయితే ఈ వ్యక్తిత్వమున్నవారు బాగా సెన్సిటివ్గా ఉంటారు. విషయాలను పర్సనల్గా తీసుకుంటారు. త్రివిక్రమ్ ఏదైనా విషయం గురించి మాట్లాడేటప్పుడు కళ్లనీళ్లు పెట్టుకోవడం, తరచుగా కన్నీరు తుడుచుకోవడం మనం గమనించవచ్చు. అలాగే తరచూ నవ్వుతుంటారు. సూటిగా చూస్తూ మాట్లాడతారు. ఇవన్నీ ఆయన ఎలాంటి దాపరికాలు లేకుండా మనస్ఫూర్తిగా వ్యవహరిస్తారని చెప్తుంటాయి. ఆయన మాట్లాడేటప్పుడు స్వరం మంద్రస్థాయిలో ఉంటుంది. మాటల్లో ఒక ఫ్లో, ఒక నిజాయితీ కనిపిస్తుంది. మాటలకు చేతుల కదలికలకు మధ్య చక్కని సమన్వయం కనిపిస్తుంది. రెండూ కలిసి ఒక డ్యూయట్లా ఉంటుంది. మాట్లాడేటప్పుడు చేతులు ఓపెన్గా ఉంటాయి. ఇది ఆయన ఓపెన్నెస్ను చూపిస్తుంది. నిర్ణయాలు కొంచెం నిదానంగా తీసుకోవడం, పనులను వాయిదా వేయడం ఈ మనస్తత్వమున్నవారి బలహీనతలు. అందుకేనేమో త్రివిక్రమ్ సినిమాలు తక్కువగా తీస్తుంటారు.
మాటల్లోనూ మనసుంది
మాటల గురించి చెప్పకుండా త్రివిక్రమ్ గురించి చెప్తే అది అసంపూర్తిగానే మిగిలిపోతుంది. ఏ సినిమాకు కథ రాస్తున్నా, ఎలాంటి కేరెక్టర్కు డైలాగ్స్ రాస్తున్నా అందులో రచయిత వ్యక్తిత్వం తప్పకుండా ప్రతిఫలిస్తుంది. త్రివిక్రమ్ సినిమాలు, ఆయన రాసే మాటల్లో ఎక్కడా ద్వంద్వార్థాలు లేకపోవడం, అసభ్యత కనిపించకపోవడం ఆయన పాటించే విలువలకు దర్పణంగా నిలుస్తాయి.
పిల్లను ఇచ్చేటప్పుడు డబ్బులు ఉన్నోడా? లేనోడా? అని కాదు, మనసున్నోడా, చెడు అలవాట్లు లేనోడా? అని చూడండి. ఎందుకంటే సంపాదిస్తే డబ్బు వస్తుంది, కానీ సంస్కారం రాదు. ఎక్కడ నెగ్గాలో కాదురా... ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు.
యుద్ధం అంటే శత్రువుని చంపడం కాదు, శత్రువుని ఓడించడం. శత్రువుని ఓడించడమే యుద్ధం యొక్క లక్ష్యం.
లాజిక్లు ఎవరూ నమ్మరు, అందరికీ మ్యాజిక్లే కావాలి. అందుకే మన దేశంలో సైంటిస్ట్లకన్నా బాబాలే బాగా ఫేమస్.
... ఈ మాటల్లో త్రివిక్రమ్ నమ్మే విలువలు, ఆయన సంస్కారం కనిపిస్తాయి, సమాజం పట్ల అవగాహన, అనురక్తి, సెటైర్ వినిపిస్తాయి. అంతేనా... ‘‘సింహం పడుకుంది కదా అని జూలుతో జడెయ్యకూడదురా... అలాగే పులి పలకరించిందికదా అని పక్కన నిలబడి ఫొటో తీయించుకోకూడదురోయ్...’’ అంటూ హాస్యాన్ని కూడా పండించగడు.
- విశేష్, సైకాలజిస్ట్
దేవుడు మంచి అకౌంటెంట్!
Sakshi | Updated: January 27, 2015 00:26 (IST)

హైదరాబాద్ శివారులోని కోకాపేటలోని భారీ సెట్ అది.అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతోన్న తాజా సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోందక్కడ.సోమవారం మధ్యాహ్నం లంచ్ బ్రేక్... ‘పద్మశ్రీ’ పురస్కార విజేతగా ఆదివారం రాత్రి ప్రభుత్వం ప్రకటించిన కోట శ్రీనివాసరావును యూనిట్ సభ్యులంతా కలసి అభినందించారు. సత్కరించారు. ‘మా మావకి ఇది ఓ పదిహేనేళ్లకు సరిపడా కిక్ వచ్చింది’ అన్నారు రాజేంద్రప్రసాద్, కోటకు కేక్ తినిపిస్తూ. కోటను అభినందిస్తూ వరుసగా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. మరోపక్క ఎవరెవరో పూలబొకేలు పంపిస్తున్నారు. ఇంటి నుంచి వచ్చిన ఉసిరికాయ పచ్చడి, వగైరాలతో భోజనం చేస్తూ కోట ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.
‘పద్మశ్రీ’ పురస్కారం గెలుచుకున్నందుకు అభినందనలు సార్?
ధన్యవాదాలండీ. ఈ అవార్డు రావడానికి కారకులైన నా దర్శక, నిర్మాతలకూ, సహనటులకూ, సాంకేతిక నిపుణులకూ, ప్రేక్షకులకూ - అందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నా. పద్మశ్రీ రావడం ఓ పక్క థ్రిల్గా, మరోపక్క చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడో విజయవాడ దగ్గర కంకిపాడులో నాటకాలతో మొదలైన ప్రస్థానం ఇక్కడకు చేరుకున్నందుకు ఏదో సాధించానని కించిత్ గర్వంగానూ ఉంది.
ఈ స్థాయికి చేరుకోవడానికి మీకు తోడ్పడిన అంశాలు ఏమిటనుకుంటున్నారు?
నేను నటనను వృత్తిగానే భావించాను కానీ, ఏనాడూ వ్యాపారంగా చూడలేదు. నటించినందుకు డబ్బులు తీసుకున్నాను కానీ, మరీ విచ్చలవిడిగా వసూలు చేయలేదు. సిన్సియారిటీనే నా కెరీర్కు శ్రీరామరక్ష. అప్పుడూ, ఇప్పుడూ శ్రద్ధగానే పనిచేశా, పనిచేస్తాను కూడా!
గుమ్మడికాయంత ప్రతిభతోపాటు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలని మీరే చాలాసార్లు చెబుతుంటారు. మరి మీ విషయంలో?
ఎవరికైనా అదే అప్లై అవుతుంది. ‘పద్మశ్రీ’ రాగానే చాలామంది నాకు ఫోన్లు చేసి ‘మీకెప్పుడో రావాలి... ఇప్పటికే చాలా ఆలస్యమైంది’’ అన్నారు. మనం అనుకుంటే అన్నీ జరిగిపోతాయా చెప్పండి. దేనికైనా ప్రాప్తం ఉండాలి. మనకెప్పుడు ప్రాప్తమో, ఎంత ప్రాప్తమో... అంతే! దేవుడు చాలా గొప్ప అకౌంటెంట్. ఆయనకు ఏ లెక్క ఎప్పుడు వేయాలో, ఎక్కడ ఎంత సరిపెట్టాలో బాగా తెలుసు. అయినా అవార్డులతో వ్యక్తుల ప్రతిభను ఎలా కొలవగలం! అలా అనుకుంటే... మహా నటుడు ఎన్టీఆర్కు ఏ నంది అవార్డు వచ్చిందని!!
ఇన్ని దశాబ్దాల మీ నట జీవితాన్ని ఒకసారి సింహావలోకనం చేసుకుంటే, ఎవరికి కృతజ్ఞతలు చెప్పాలనిపిస్తోంది?
నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, నాటకరంగంలో నాకు అన్నీ నేర్పిన తొమ్మిదిమంది గురువులను నేనెప్పటికీ మరిచిపోలేను. మా అన్నయ్య కోట నరసింహారావు, భావనాచారి, దేశ రాజు హనుమంతరావు, భానుప్రకాశ్, ఆయన తమ్ముడు శశాంక్, ఆదివిష్ణు, ఎల్బీ శ్రీరామ్, రత్నాసాగర్, కేజీ రామ్ప్రసాద్... ఈ తొమ్మండుగురు నాకు గురువులు. వీళ్లందరినీ గతంలో నేను ప్రత్యేకంగా సత్కరించాను కూడా!
అప్పటి ‘ప్రతిఘటన’లో తెలంగాణ మాండలికం మొదలు ‘అత్తారింటికి దారేది’లో చిత్తూరు యాస దాకా... అన్ని మాండలికాలనూ అవలీలగా పండిస్తారు. ఆ పట్టు ఎలా చిక్కింది?
ప్రత్యేకంగా నేర్చుకోవడమంటూ ఉండదు కానీ, శ్రద్ధగా గమనిస్తూ, పట్టుకుంటా. ఎవరైనా ప్రత్యేకమైన యాసలో మాట్లాడితే, వాళ్లతో కాసేపు మాట్లాడి గమనిస్తా. వాటిని మనసులో పెట్టుకొని, సమయం, సందర్భం, పాత్రను బట్టి, దర్శక, రచయితల సహకారంతో వాడుతుంటా. ‘అత్తారింటికి దారేది’లో చిత్తూరు మాండలికం కోసం త్రివిక్రమ్ ప్రత్యేకంగా నామిని రచనలను తెప్పించి, చదివించారు.
పుస్తకాలు బాగానే చదువుతారా?
అస్సలు లేదండీ. 35 ఏళ్ల నుంచి నటన తప్ప, నాకు వేరే పని లేదు. షూటింగులు లేకపోతే ఇల్లు. రామాయణ, భారతాలు కూడా ఆమూలాగ్రం చదవలేకపోయా.
మీ తొలి నాటకం గుర్తుందా?
ఎందుకు మర్చిపోతామండీ...! పినిశెట్టి శ్రీరామ్మూర్తి గారు రాసిన ‘ఆడది’ నాటకంలో శతభిషం పాత్ర నేనే చేశా. ఆ నాటకంలో ఒక్క స్త్రీ పాత్ర కూడా ఉండదు. గమ్మత్తేమిటంటే నా నక్షత్రం కూడా శతభిషమే.
నటనలో సహజత్వం కోసం ఏమైనా కసరత్తులు చేస్తారా?
రంగస్థలంపై నాటకాలు ఆడుతున్నప్పుడు కూడా నా గురువులు ఇలా యాక్ట్ చేయాలని నాకెప్పుడూ చేసి చూపించలేదు. ‘నాలుగు రోజులుగా నువ్వు ఆకలితో ఉన్నావనుకో! నువ్వైతే ఎలా యాక్ట్ చేస్తావో చేసి చూపించు’ అనేవారు. ఎందుకంటే ఎవరి భావోద్వేగాలు వాళ్లకు ఉంటాయి కదా! నేను మొదటి నుంచీ ఆ పంథానే అనుసరించా. అందుకే నా నటనలో అనుకరణ కాకుండా, సహజత్వం కనబడుతుందేమో!
ప్రాణం ఖరీదు’ మొదలుకుని ఇప్పటికి అన్ని భాషల్లో కలిపి 800పై చిలుకు సినిమాలు చేశారు. ఇంకా చేయాలనుకునే పాత్ర ఏమైనా మిగిలి ఉందా?
ఒకప్పుడు సినిమాల ప్రభావం మనుషులపై చాలా ఉండేది . ఎన్టీఆర్ ఫ్యాంట్, ఏఎన్నార్ కట్, శోభన్బాబు హెయిర్స్టైల్, వాణిశ్రీ చీర - జాకెట్... ఇలా అందరూ అనుసరించేవారు. అయితే, అప్పట్లో సాంఘికం, పౌరాణికం, చారిత్రకం, జానపదం, కౌబోయ్ - ఇలా ఏ తరహా అయినా ఆ పాత్రలకు కొన్ని లిమిటేషన్స్ ఉండేవి. కానీ, ఇప్పుడు నన్నడిగితే ప్రజల ప్రభావం, చుట్టుపక్కల సమాజం ప్రభావం సినిమాలపై ఉంది. అప్పట్లో రాజకీయ నాయకుడంటే ఒక గెటప్ ఫాలో అయితే సరిపోయేది. ఇప్పుడలా కుదురుతుందా! అసెంబ్లీకి వెళ్లి చూడండి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా... ఎన్ని రకాల వేషభాషలు కనిపిస్తాయో..? కాబట్టి, ఏ రోజుకు ఆ రోజు కొత్త రకంగా పాత్రను పోషించవచ్చు. అయినా, గెటప్స్, కేరెక్టర్ ఒక్క రోజులో తేలిగ్గా మర్చిపోతున్నప్పుడు ఇక డ్రీమ్ రోల్స్ ఏముంటాయ్!
రాజకీయ రంగానికి దూరంగా ఉన్నారా?
చిన్నప్పటి నుంచి నాలో కొంత ఆర్.ఎస్.ఎస్. భావజాలం, హిందూత్వ అభిమానం ఉండేవి. 1990లో బీజేపీలో చేరా. అప్పటి నుంచి ఆ పార్టీలోనే ఉన్నా. మిగతావాళ్లలాగా పార్టీలు మారలేదు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి, 1999లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. ప్రస్తుతం కొంత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నాను.
మీకు ‘పద్మశ్రీ’ రావడానికి ఆ రాజకీయ నేపథ్యం ఏమైనా ఉపయోగపడిందంటారా?
అలాగైతే ఈ పురస్కారం ఎప్పుడో వచ్చేది కదా!
మన తెలుగు పరిశ్రమలో పద్మ పురస్కారాలు అందుకోవాల్సిన వాళ్లు... మీ కన్నా సీనియర్లు ఇంకా చాలామందే ఉన్నారేమో?
అవును. నా కన్నా సీనియర్లయిన కైకాల సత్యనారాయణ, గిరిబాబు, గొల్లపూడి మారుతీరావు - ఇలా ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. కానీ, ఒకరికి రావడం, రాకపోవడం మన చేతుల్లో లేదు కదా.
నిర్మాణం, దర్శకత్వం చేయాలని ఎప్పుడైనా అనిపించిందా..?
నాకొద్దు సార్. అవి నాకు తెలియని పనులు. చేతకానివి. అవి చేయడానికి చాలా విద్వత్తు కావాలి. ఒకవేళ నేనే ప్రొడక్షన్ చేస్తే, ‘కష్టపడి సంపాదించిన సొమ్మును ఎందుకిలా తగలేస్తున్నాడ’ని మీరే కామెంట్ చేస్తారు.
ఇన్నేళ్ల అనుభవంతో చెప్పండి... తరువాతి తరానికి మీరిచ్చే సలహా?
సాధన. అది ఉంటేనే ఏ రంగంలోనైనా మనం దీర్ఘకాలం నిలబడగలుగుతాం. ‘సాధనమున పనులు సమకూరు ధరలోన...’ అని పెద్దలు ఊరకే అనలేదు కదా! అయినా ఇప్పుడు జనంలో సాధన తక్కువైంది, వాదన ఎక్కువైంది. ‘ఎడమవైపున నడవాలి’ అని చెప్పావనుకోండి ‘ఏం! కుడివైపున ఎందుకు నడవకూడదు?’ అని వాదిస్తారు.
మీరు వ్యంగ్యాస్త్రాలు విసురుతారని, కొటేషన్స్ చెబుతారని ప్రతీతి. వాటిలో మీకు నచ్చిన మాట?
ఆర్టిస్టులకూ, టెక్నీషియన్లకూ నేను తరచూ చెప్పే మాట ఒకటే... మనకు టైమొస్తే తీరిక టైమ్ ఉండదు. టైమ్ పోయిందా... మన బజారుకు కర్ప్యూ పెట్టినట్టే! ఒక్కడూ దగ్గరకు రాడు!
నటుడిగా మీకంటూ తీరని కోరికలు ఏమైనా...?
ఏమీ లేవు. ఒకటే కోరిక... చనిపోయే చివరి క్షణం వరకూ నటించాలి. రేపు మరణించినా నటునిగా చిరస్థాయిగా జీవించే ఉండాలి.
మై టాప్ టెన్
ప్రతిఘటన (1986) అహ నా పెళ్ళంట (1987)
శత్రువు (1990) అలెగ్జాండర్ (1992)
రక్షణ (1993) గాయం (1993)
హలో బ్రదర్ (1994) పంజరం (1997)
గణేశ్ (1998) ఆడవారి మాటలకు
అర్థాలే వేరులే (2007)
- పులగం చిన్నారాయణ
‘పద్మశ్రీ’ పురస్కారం గెలుచుకున్నందుకు అభినందనలు సార్?
ధన్యవాదాలండీ. ఈ అవార్డు రావడానికి కారకులైన నా దర్శక, నిర్మాతలకూ, సహనటులకూ, సాంకేతిక నిపుణులకూ, ప్రేక్షకులకూ - అందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నా. పద్మశ్రీ రావడం ఓ పక్క థ్రిల్గా, మరోపక్క చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడో విజయవాడ దగ్గర కంకిపాడులో నాటకాలతో మొదలైన ప్రస్థానం ఇక్కడకు చేరుకున్నందుకు ఏదో సాధించానని కించిత్ గర్వంగానూ ఉంది.
ఈ స్థాయికి చేరుకోవడానికి మీకు తోడ్పడిన అంశాలు ఏమిటనుకుంటున్నారు?
నేను నటనను వృత్తిగానే భావించాను కానీ, ఏనాడూ వ్యాపారంగా చూడలేదు. నటించినందుకు డబ్బులు తీసుకున్నాను కానీ, మరీ విచ్చలవిడిగా వసూలు చేయలేదు. సిన్సియారిటీనే నా కెరీర్కు శ్రీరామరక్ష. అప్పుడూ, ఇప్పుడూ శ్రద్ధగానే పనిచేశా, పనిచేస్తాను కూడా!
గుమ్మడికాయంత ప్రతిభతోపాటు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలని మీరే చాలాసార్లు చెబుతుంటారు. మరి మీ విషయంలో?
ఎవరికైనా అదే అప్లై అవుతుంది. ‘పద్మశ్రీ’ రాగానే చాలామంది నాకు ఫోన్లు చేసి ‘మీకెప్పుడో రావాలి... ఇప్పటికే చాలా ఆలస్యమైంది’’ అన్నారు. మనం అనుకుంటే అన్నీ జరిగిపోతాయా చెప్పండి. దేనికైనా ప్రాప్తం ఉండాలి. మనకెప్పుడు ప్రాప్తమో, ఎంత ప్రాప్తమో... అంతే! దేవుడు చాలా గొప్ప అకౌంటెంట్. ఆయనకు ఏ లెక్క ఎప్పుడు వేయాలో, ఎక్కడ ఎంత సరిపెట్టాలో బాగా తెలుసు. అయినా అవార్డులతో వ్యక్తుల ప్రతిభను ఎలా కొలవగలం! అలా అనుకుంటే... మహా నటుడు ఎన్టీఆర్కు ఏ నంది అవార్డు వచ్చిందని!!
ఇన్ని దశాబ్దాల మీ నట జీవితాన్ని ఒకసారి సింహావలోకనం చేసుకుంటే, ఎవరికి కృతజ్ఞతలు చెప్పాలనిపిస్తోంది?
నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, నాటకరంగంలో నాకు అన్నీ నేర్పిన తొమ్మిదిమంది గురువులను నేనెప్పటికీ మరిచిపోలేను. మా అన్నయ్య కోట నరసింహారావు, భావనాచారి, దేశ రాజు హనుమంతరావు, భానుప్రకాశ్, ఆయన తమ్ముడు శశాంక్, ఆదివిష్ణు, ఎల్బీ శ్రీరామ్, రత్నాసాగర్, కేజీ రామ్ప్రసాద్... ఈ తొమ్మండుగురు నాకు గురువులు. వీళ్లందరినీ గతంలో నేను ప్రత్యేకంగా సత్కరించాను కూడా!
అప్పటి ‘ప్రతిఘటన’లో తెలంగాణ మాండలికం మొదలు ‘అత్తారింటికి దారేది’లో చిత్తూరు యాస దాకా... అన్ని మాండలికాలనూ అవలీలగా పండిస్తారు. ఆ పట్టు ఎలా చిక్కింది?
ప్రత్యేకంగా నేర్చుకోవడమంటూ ఉండదు కానీ, శ్రద్ధగా గమనిస్తూ, పట్టుకుంటా. ఎవరైనా ప్రత్యేకమైన యాసలో మాట్లాడితే, వాళ్లతో కాసేపు మాట్లాడి గమనిస్తా. వాటిని మనసులో పెట్టుకొని, సమయం, సందర్భం, పాత్రను బట్టి, దర్శక, రచయితల సహకారంతో వాడుతుంటా. ‘అత్తారింటికి దారేది’లో చిత్తూరు మాండలికం కోసం త్రివిక్రమ్ ప్రత్యేకంగా నామిని రచనలను తెప్పించి, చదివించారు.
పుస్తకాలు బాగానే చదువుతారా?
అస్సలు లేదండీ. 35 ఏళ్ల నుంచి నటన తప్ప, నాకు వేరే పని లేదు. షూటింగులు లేకపోతే ఇల్లు. రామాయణ, భారతాలు కూడా ఆమూలాగ్రం చదవలేకపోయా.
మీ తొలి నాటకం గుర్తుందా?
ఎందుకు మర్చిపోతామండీ...! పినిశెట్టి శ్రీరామ్మూర్తి గారు రాసిన ‘ఆడది’ నాటకంలో శతభిషం పాత్ర నేనే చేశా. ఆ నాటకంలో ఒక్క స్త్రీ పాత్ర కూడా ఉండదు. గమ్మత్తేమిటంటే నా నక్షత్రం కూడా శతభిషమే.
నటనలో సహజత్వం కోసం ఏమైనా కసరత్తులు చేస్తారా?
రంగస్థలంపై నాటకాలు ఆడుతున్నప్పుడు కూడా నా గురువులు ఇలా యాక్ట్ చేయాలని నాకెప్పుడూ చేసి చూపించలేదు. ‘నాలుగు రోజులుగా నువ్వు ఆకలితో ఉన్నావనుకో! నువ్వైతే ఎలా యాక్ట్ చేస్తావో చేసి చూపించు’ అనేవారు. ఎందుకంటే ఎవరి భావోద్వేగాలు వాళ్లకు ఉంటాయి కదా! నేను మొదటి నుంచీ ఆ పంథానే అనుసరించా. అందుకే నా నటనలో అనుకరణ కాకుండా, సహజత్వం కనబడుతుందేమో!
ప్రాణం ఖరీదు’ మొదలుకుని ఇప్పటికి అన్ని భాషల్లో కలిపి 800పై చిలుకు సినిమాలు చేశారు. ఇంకా చేయాలనుకునే పాత్ర ఏమైనా మిగిలి ఉందా?
ఒకప్పుడు సినిమాల ప్రభావం మనుషులపై చాలా ఉండేది . ఎన్టీఆర్ ఫ్యాంట్, ఏఎన్నార్ కట్, శోభన్బాబు హెయిర్స్టైల్, వాణిశ్రీ చీర - జాకెట్... ఇలా అందరూ అనుసరించేవారు. అయితే, అప్పట్లో సాంఘికం, పౌరాణికం, చారిత్రకం, జానపదం, కౌబోయ్ - ఇలా ఏ తరహా అయినా ఆ పాత్రలకు కొన్ని లిమిటేషన్స్ ఉండేవి. కానీ, ఇప్పుడు నన్నడిగితే ప్రజల ప్రభావం, చుట్టుపక్కల సమాజం ప్రభావం సినిమాలపై ఉంది. అప్పట్లో రాజకీయ నాయకుడంటే ఒక గెటప్ ఫాలో అయితే సరిపోయేది. ఇప్పుడలా కుదురుతుందా! అసెంబ్లీకి వెళ్లి చూడండి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా... ఎన్ని రకాల వేషభాషలు కనిపిస్తాయో..? కాబట్టి, ఏ రోజుకు ఆ రోజు కొత్త రకంగా పాత్రను పోషించవచ్చు. అయినా, గెటప్స్, కేరెక్టర్ ఒక్క రోజులో తేలిగ్గా మర్చిపోతున్నప్పుడు ఇక డ్రీమ్ రోల్స్ ఏముంటాయ్!
రాజకీయ రంగానికి దూరంగా ఉన్నారా?
చిన్నప్పటి నుంచి నాలో కొంత ఆర్.ఎస్.ఎస్. భావజాలం, హిందూత్వ అభిమానం ఉండేవి. 1990లో బీజేపీలో చేరా. అప్పటి నుంచి ఆ పార్టీలోనే ఉన్నా. మిగతావాళ్లలాగా పార్టీలు మారలేదు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి, 1999లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. ప్రస్తుతం కొంత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నాను.
మీకు ‘పద్మశ్రీ’ రావడానికి ఆ రాజకీయ నేపథ్యం ఏమైనా ఉపయోగపడిందంటారా?
అలాగైతే ఈ పురస్కారం ఎప్పుడో వచ్చేది కదా!
మన తెలుగు పరిశ్రమలో పద్మ పురస్కారాలు అందుకోవాల్సిన వాళ్లు... మీ కన్నా సీనియర్లు ఇంకా చాలామందే ఉన్నారేమో?
అవును. నా కన్నా సీనియర్లయిన కైకాల సత్యనారాయణ, గిరిబాబు, గొల్లపూడి మారుతీరావు - ఇలా ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. కానీ, ఒకరికి రావడం, రాకపోవడం మన చేతుల్లో లేదు కదా.
నిర్మాణం, దర్శకత్వం చేయాలని ఎప్పుడైనా అనిపించిందా..?
నాకొద్దు సార్. అవి నాకు తెలియని పనులు. చేతకానివి. అవి చేయడానికి చాలా విద్వత్తు కావాలి. ఒకవేళ నేనే ప్రొడక్షన్ చేస్తే, ‘కష్టపడి సంపాదించిన సొమ్మును ఎందుకిలా తగలేస్తున్నాడ’ని మీరే కామెంట్ చేస్తారు.
ఇన్నేళ్ల అనుభవంతో చెప్పండి... తరువాతి తరానికి మీరిచ్చే సలహా?
సాధన. అది ఉంటేనే ఏ రంగంలోనైనా మనం దీర్ఘకాలం నిలబడగలుగుతాం. ‘సాధనమున పనులు సమకూరు ధరలోన...’ అని పెద్దలు ఊరకే అనలేదు కదా! అయినా ఇప్పుడు జనంలో సాధన తక్కువైంది, వాదన ఎక్కువైంది. ‘ఎడమవైపున నడవాలి’ అని చెప్పావనుకోండి ‘ఏం! కుడివైపున ఎందుకు నడవకూడదు?’ అని వాదిస్తారు.
మీరు వ్యంగ్యాస్త్రాలు విసురుతారని, కొటేషన్స్ చెబుతారని ప్రతీతి. వాటిలో మీకు నచ్చిన మాట?
ఆర్టిస్టులకూ, టెక్నీషియన్లకూ నేను తరచూ చెప్పే మాట ఒకటే... మనకు టైమొస్తే తీరిక టైమ్ ఉండదు. టైమ్ పోయిందా... మన బజారుకు కర్ప్యూ పెట్టినట్టే! ఒక్కడూ దగ్గరకు రాడు!
నటుడిగా మీకంటూ తీరని కోరికలు ఏమైనా...?
ఏమీ లేవు. ఒకటే కోరిక... చనిపోయే చివరి క్షణం వరకూ నటించాలి. రేపు మరణించినా నటునిగా చిరస్థాయిగా జీవించే ఉండాలి.
మై టాప్ టెన్
ప్రతిఘటన (1986) అహ నా పెళ్ళంట (1987)
శత్రువు (1990) అలెగ్జాండర్ (1992)
రక్షణ (1993) గాయం (1993)
హలో బ్రదర్ (1994) పంజరం (1997)
గణేశ్ (1998) ఆడవారి మాటలకు
అర్థాలే వేరులే (2007)
- పులగం చిన్నారాయణ
No comments:
Post a Comment