Tuesday, 24 February 2015
Monday, 23 February 2015
ntr
ఈ మహానేత ప్రజాకర్షక పథకాలివే
02:25 PM on 23rd February, 2015
ప్రజాకర్షక పథకాలతో నాడు రాష్ర్ట ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్
సాగించిన పాలన నేటికీ నేతలకు స్ఫూర్తినిస్తోంది. ముఖ్యంగా 40 పథకాలను
ప్రధానంగా చెప్పుకోవాలి.

1. 1983లో తాను ముఖ్యమంత్రి పదవిని చేపట్టాక తొలి సంవత్సరంలోనే ఉప లోక్పాల్ బిల్లును తెచ్చారు ఎన్టీఆర్. స్కేండినేవియన్ చట్టాల స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ఉప లోక్పాల్ బిల్లు (ఓంబుడ్స్మన్)ను తెచ్చిన ఎన్టీఆర్, అసెంబ్లీలో దీన్ని ఆమోదింపజేశారు. 1983 నవంబరు 1 నుంచి ఏపీ లోకాయుక్త చట్టం -2 అమల్లోకి వచ్చింది. న్యాయవ్యవస్థ, లాయర్లు, నేతలు, స్వతంత్ర ఇన్వెస్టిగేటర్ల సాయంతో ముఖ్యమంత్రి సహా అధికారంలోవున్న ఏ వ్యక్తిపైన ఐనా ఏ పౌరుడైనా దర్యాప్తు జరపడానికి అనుమతించే చట్టమిది.
2. నెలకు 500 రూపాయలలోపు ఆదాయమున్న వ్యవసాయ కూలీలకు రెండు రూపాయలకే కేజీ బియ్యం అందించే పథకం.

3. మహిళలకు ఆస్తిలో సమాన వాటా హక్కు కల్పించడానికి హిందూ వారసత్వ చట్టానికి సవరణలు చేశారు.

4. ఆల్విన్ మోటార్స్, మహీంద్ర అండ్ మహీంద్ర వంటి ఖాయిలా పరిశ్రమలను ప్రైవేటు రంగానికి బదలాయింపు

5. బలమైన కేంద్ర ఆర్థికవ్యవస్థతో కూడిన రాష్ర్టాలకు సంబంధించి ఎన్టీఆర్ చేసిన ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది.

6. మద్య నిషేధాన్ని విధించారు. మద్య నిషేధ బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసి, చీప్ లిక్కర్ను తయారు చేసే ప్రభుత్వ సంస్థలను రద్దు చేశారు.

7. భర్త ఆదాయంలో సగానికి మహిళలు పొందే హక్కును కల్పించారు. కేటగిరీ మూడు లేదా అంతకన్నా తక్కువ స్థాయి ఉద్యోగుల పే చెక్కుల మీద భార్య సంతకం వుంటేనే చెల్లుబాటయ్యే విధానాన్ని తెచ్చారు. అంటే భర్త ఆదాయంలో సమాన వాటా పొందే హక్కును మహిళలకు కల్పించారు.

8. తెలుగుదేశం పార్టీ వ్యవహారాలను కంప్యూటరీకరించేందుకు చర్యలు తీసుకున్నారు. గ్రామస్థాయిలోనే సుస్థిరమైన పార్టీగా టీడీపీని అభివృద్ధి పరిచి పూర్తిస్థాయిలో శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్ట్ చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో కొనసాగింది. తెలుగు ఓటర్లకు రెండుపార్టీల ఛాయిస్ నిచ్చేందుకు ఆయన రాష్ర్టంలో కాంగ్రెసేతర పార్టీల సంకీర్ణ కూటమిని ఏర్పాటు చేశారు.

9. విద్యా సంస్కరణలు, ఎంసెట్ విధానాన్ని ప్రవేశపెట్టారు. స్కూళ్లకు సంబంధించి మొత్తం విద్యావిధానాన్ని ప్రక్షాళన చేశారు. ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులతోబాటు ఉన్నత విద్యారంగంలోని అన్ని కేటగిరిలకు రాష్ర్టవ్యాప్తంగా ప్రవేశ పరీక్షల విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఎంసెట్లో పొందిన తమ ర్యాంకుల ఆధారంగా విద్యార్థులు, తమకు నచ్చిన ఏ కాలేజీలోనైనా చేరే వెసులుబాటును కల్పించారు.

10. గ్రామీణ యువతను ధ్యేయంగా తీసుకుని రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సంస్కరణలకు ప్రవేశపెట్టారు. 1972లో ఏర్పాటైన ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్సిటిట్యూషన్స్ సొసైటీని 1988లో ఎన్టీఆర్ ప్రభుత్వం రెండు సంస్థలుగా పునర్ వ్యవస్థీకరించింది. ఇందుకు అనువుగా జీవో ఎంఎస్ నెం.363 ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ బిల్లును ఆమోదించింది. పర్యవసానంగా ఏపీ రెసిడెన్షియర్ జూనియర్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. ఇవి ఐఐటీలు, బిట్స్ వంటి ఉన్నతస్థాయి సంస్థలకు ఐదురెట్లు ఎక్కువగా విద్యార్థులను పంపే విద్యాసంస్థలుగా మారాయి. దీంతో గ్రామీణ ప్రాంతాలవారు, టాలెంట్ వున్న పేదవిద్యార్థులను తీర్చిదిద్దే ఏకైక రాష్ర్టంగా ఏపీ ఆవిర్భవించింది.

11. ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ కమెండో ఫోర్స్ను ఎన్టీఆర్ ఏర్పాటు చేశారు. నక్సలిజాల్ని సిద్ధాంతపరంగాను, సైనికపరంగా కూడా ఎదుర్కోవడానికి కొత్తగా ఈ కమెండో ఫోర్స్ ఏర్పాటయ్యింది.

12. గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్లో ముఖ్యంగా ఓల్డ్ సిటీలో మత ఘర్షణలను పూర్తిగా నివారించారు.

13. విశాఖ ఉక్కు కర్మాగారానికి పునరుజ్జీవం కల్పించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటైనప్పటి నుంచీ ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న ఈ సంస్థ, ఎన్టీఆర్ హయాంలో ఉత్పత్తిని పెంచుకుంది. కేంద్రంతో ఆయన చేసిన లాబీయింగ్ ఫలితంగా ఇది సాధ్యమైంది.

14. అమెరికాలోని డాక్టర్లు ఇండియాకు తిరిగి వచ్చి దేశానికి సేవ చేయాల్సిందిగా ఎన్టీఆర్ ఆహ్వానించారు. హైదరాబాద్లో నిమ్స్, ఉస్మానియా ఆసుపత్రుల సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రపంచవ్యాప్త వైద్య నిపుణులను ఆహ్వానించారు. విజయవాడలో మెడికల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు.

15. పటేల్, పట్వారీ వ్యవస్థలను నిషేధించారు. దీంతో ముఖ్యంగా తెలంగాణలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీల అభ్యున్నతికి మార్గం సుగమమైంది. స్థానిక పంచాయితీ నేతలకు అధికారం లభించేలా ఫ్యూడల్ పటేల్, పట్వారీ, మునసబు, కరణం వ్యవస్థలను రద్దు చేశారు.

16. వేద సంబంధ సబ్జెక్ట్లకు ప్రవేశ పరీక్ష విధానాన్ని ఎన్టీఆర్ ప్రవేశపెట్టారు. ఆలయాల్లో బ్రాహ్మణేతరులను పూజారులుగా నియమించే విధానానికి శ్రీకారం చుట్టారు.

17. ఆసియాలోనే అతిపెద్ద బస్ స్టేషన్ను రాష్ర్టంలో నిర్మించారు. హైదరాబాద్లో మహాత్మాగాంధీ బస్స్టేషన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

18. హైదరాబాద్ ట్యాంక్ బండ్ రోడ్డులో తెలుగు మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. తెలుగువారి వారసత్వ సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేశారు.

19. ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులకు విద్యావకాశాలు కల్పించేందుకు ప్రతి ఇంటికీ ఒక బల్బు పథకాన్ని ప్రవేశపెట్టారు. విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలకు ఈ సౌకర్యాన్ని కల్పించారు. ఒక బల్బువున్న ఇంటికి సబ్సిడీ ఇచ్చారు.

20 రాష్ర్టంలో నీటి పంపిణీ విధానాన్ని ఎన్టీఆర్ సంస్కరించారు. ప్రణాళికా రచనలో రైతు సంఘాలకు ప్రాధాన్యం కల్పించారు.

21. గుడిసెల స్థానే పేదల కోసం ఐదులక్షల ఇళ్లను నిర్మించారు. ఐదేళ్లలో ఇలా లో- ఇన్కమ్ హౌసింగ్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఆయన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మరో తొమ్మిదేళ్లు దీన్ని కొనసాగించి మరో 10 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు.

22. శాసనమండలి వ్యవస్థను రద్దు చేశారు ఎన్టీఆర్. దీనివల్ల ఖర్చులు పెరగడం తప్ప ఖజానాకు ఒరిగేదేమీ వుండదని అభిప్రాయపడ్డారు.

23. హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో అతిపెద్ద బుద్ధుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్కే దక్కింది.

24. ప్రైమరీ స్కూలు విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు.

25. రాయలసీమకు సేద్యపు నీటిని, చెన్నైకి మంచినీటిని సరఫరా చేసేందుకు తెలుగు గంగ ప్రాజెక్ట్ను చేపట్టారు. ఈ ప్రాజెక్ట్కు సత్యసాయి బాబా మద్దతు నిచ్చి తోడ్పాటు అందించారు.

26. ప్రభుత్వ ఉద్యోగులు సక్రమంగా పని చేసేందుకు చర్యలు తీసుకున్న ఎన్టీఆర్, ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 55 ఏళ్లకు తగ్గించారు. ఉద్యోగుల సార్వత్రిక సమ్మెను అణచివేసేందుకు నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ను ప్రయోగించారు.

27. స్థానిక సంస్థల యంత్రాంగాల్లో రిజర్వేషన్ల ప్రక్రియను అమలు చేశారు. మహిళలు, ఎస్సీలు, ఎస్టీల రిజర్వేషన్ల కోసం కృషి చేశారు. వృత్తిగత విద్యాసంస్థల్లో బీసీలకు 55శాతం రిజర్వేషన్ల కోసం ఆయన పాటుపడ్డారు.

28. ప్రైవేటు బస్సులకు అనుమతిచ్చిన ఎన్టీఆర్, వాటితో పోటీ పడాల్సిందిగా ఏపీఎస్ఆర్టీసీని కోరారు. ఏపీ సేఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ని రద్దు చేశారు.

29. రైతులకు ఏడాదికి 50 రూపాయలకే విద్యుత్ సౌకర్యాన్ని కల్పించారు. ఏడాదికి 12 వేల లోపు ఆదాయాన్ని సంపాదించే రైతులకు సింగిల్ పంప్ సెట్ మీద (సాలుకు రూ.50 లకే) సబ్సిడీ ఇస్తూ వచ్చారు.

30. మహిళల కోసం సబ్సిడీ వస్ర్త పథకాన్ని ప్రవేశపెట్టారు. తక్కువ ఆదాయం పొందుతున్న మహిళలకు సబ్సిడీ మీద వస్ర్త పథకాన్ని అమలు చేశారు.

31. తిరుపతిలో శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు.

32. తెలుగు చలన చిత్ర పరిశ్రమను చెన్నై నుంచి హైదరాబాద్కు తరలించేందుకు ఎన్టీఆర్ చేసిన కృషి వల్ల ఏపీలో తెలుగు సినీ నిర్మాతలకు డిస్ర్టిబ్యూటర్లకు ఎంతో మేలు జరిగింది. తెలుగు సినీ ఇండస్ర్టీకి గుర్తింపు లభించింది.

33. తెలుగువారికి గర్వకారణంగా పీవీ నరసింహారావుకు ఎన్నికల్లో మద్దతు ఇచ్చారు. భారత ప్రధానిగా తెలుగు వ్యక్తి ఢిల్లీ గద్దెనెక్కడానికి ఎన్టీఆర్ తోడ్పడ్డారు. ఎన్నికల్లో పీవీ గెలిచేందుకు అనువుగా టీడీపీ అభ్యర్థిని ఎన్టీఆర్ నిలబెట్టలేదు. దాంతో మొదటిసారిగా మంచి మెజార్టీతో కాంగ్రెస్ నేత పీవీ నరసింహారావు విజయం సాధించారు.

34. ఏవియేషన్, రోడ్డు రవాణా వ్యవస్థలను మరింత మెరుగుపరిచారు. తిరుపతి, విశాఖ, విజయవాడ, వరంగల్ల్లో విమానాశ్రయాల ఏర్పాటు అప్గ్రేడ్కు కృషి చేశారు. నెల్లూరు, మచిలీపట్నం, కాకినాడల్లో ఎయిర్ పోర్టుల ఏర్పాటుకు పెట్టుబడుల విషయంలో చొరవచూపిన ఎన్టీఆర్, రాష్ర్టంలో రూరల్ రోడ్ నెట్వర్క్ను విస్తృతం చేశారు.
35. విద్యావంతులైన యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. వారి కెరీర్ను మలుపు తిప్పారు. ప్రస్తుతం తెలుగు రాష్ర్టాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబు.. ఎన్టీఆర్ హయాంలో మంత్రులుగా పనిచేశారు. జయప్రకాశ్ నారాయణ్, దేవేందర్ గౌడ్, కోడెల శివప్రసాద్, యనమల వంటి వారికి రాజకీయ భవిష్యత్ ఇచ్చారు.

36. తెలంగాణ వారికి కూడా సమాన హక్కులు ఉండేందుకు ఎన్టీఆర్ పోరాడారు. కాసు బ్రహ్మానందరెడ్డి అడుగుజాడల్లో నడిచారు.

37. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటులో ఎన్టీఆర్ కీలకపాత్ర పోషించారు. దీనివల్ల తిరుపతిలో రాడార్ రీసెర్చ్ సెంటర్కు తగినన్ని నిధులు అందాయి.

38. మండల రెవిన్యూ వ్యవస్థను ఆయన ఏర్పాటు చేసి, అడ్మినిస్ర్టేటివ్ కార్యాలయాలను ఏకీకృతం చేశారు. ప్రజల వద్దకు పాలన పేరుతో అన్ని అడ్మిసిస్ర్టేటివ్ కార్యాలయాలను ప్రతి గ్రామ పరిధి కిందకు తెచ్చారు.

39. టీటీడీ అడ్మినిస్ట్రేషన్ను సంస్కరించారు. తిరుపతిని మోడరన్ టూరిస్ట్ అట్రాక్షన్ కేంద్రంగా తీర్చిదిద్దారు. రిజిస్టేషన్ ప్రక్రియను కంప్యూటరీకరించారు.

40. కేంద్రంలో తొలి నాన్- కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1989లో నేషనల్ ఫ్రంట్ పేరిట కాంగ్రెసేతర పార్టీలతో జాతీయ సంకీర్ణ కూటమిని ఏర్పాటు చేశారు. అదే ఏడాది కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది.

1. 1983లో తాను ముఖ్యమంత్రి పదవిని చేపట్టాక తొలి సంవత్సరంలోనే ఉప లోక్పాల్ బిల్లును తెచ్చారు ఎన్టీఆర్. స్కేండినేవియన్ చట్టాల స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ఉప లోక్పాల్ బిల్లు (ఓంబుడ్స్మన్)ను తెచ్చిన ఎన్టీఆర్, అసెంబ్లీలో దీన్ని ఆమోదింపజేశారు. 1983 నవంబరు 1 నుంచి ఏపీ లోకాయుక్త చట్టం -2 అమల్లోకి వచ్చింది. న్యాయవ్యవస్థ, లాయర్లు, నేతలు, స్వతంత్ర ఇన్వెస్టిగేటర్ల సాయంతో ముఖ్యమంత్రి సహా అధికారంలోవున్న ఏ వ్యక్తిపైన ఐనా ఏ పౌరుడైనా దర్యాప్తు జరపడానికి అనుమతించే చట్టమిది.

2. నెలకు 500 రూపాయలలోపు ఆదాయమున్న వ్యవసాయ కూలీలకు రెండు రూపాయలకే కేజీ బియ్యం అందించే పథకం.

3. మహిళలకు ఆస్తిలో సమాన వాటా హక్కు కల్పించడానికి హిందూ వారసత్వ చట్టానికి సవరణలు చేశారు.

4. ఆల్విన్ మోటార్స్, మహీంద్ర అండ్ మహీంద్ర వంటి ఖాయిలా పరిశ్రమలను ప్రైవేటు రంగానికి బదలాయింపు

5. బలమైన కేంద్ర ఆర్థికవ్యవస్థతో కూడిన రాష్ర్టాలకు సంబంధించి ఎన్టీఆర్ చేసిన ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది.

6. మద్య నిషేధాన్ని విధించారు. మద్య నిషేధ బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసి, చీప్ లిక్కర్ను తయారు చేసే ప్రభుత్వ సంస్థలను రద్దు చేశారు.

7. భర్త ఆదాయంలో సగానికి మహిళలు పొందే హక్కును కల్పించారు. కేటగిరీ మూడు లేదా అంతకన్నా తక్కువ స్థాయి ఉద్యోగుల పే చెక్కుల మీద భార్య సంతకం వుంటేనే చెల్లుబాటయ్యే విధానాన్ని తెచ్చారు. అంటే భర్త ఆదాయంలో సమాన వాటా పొందే హక్కును మహిళలకు కల్పించారు.

8. తెలుగుదేశం పార్టీ వ్యవహారాలను కంప్యూటరీకరించేందుకు చర్యలు తీసుకున్నారు. గ్రామస్థాయిలోనే సుస్థిరమైన పార్టీగా టీడీపీని అభివృద్ధి పరిచి పూర్తిస్థాయిలో శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్ట్ చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో కొనసాగింది. తెలుగు ఓటర్లకు రెండుపార్టీల ఛాయిస్ నిచ్చేందుకు ఆయన రాష్ర్టంలో కాంగ్రెసేతర పార్టీల సంకీర్ణ కూటమిని ఏర్పాటు చేశారు.

9. విద్యా సంస్కరణలు, ఎంసెట్ విధానాన్ని ప్రవేశపెట్టారు. స్కూళ్లకు సంబంధించి మొత్తం విద్యావిధానాన్ని ప్రక్షాళన చేశారు. ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులతోబాటు ఉన్నత విద్యారంగంలోని అన్ని కేటగిరిలకు రాష్ర్టవ్యాప్తంగా ప్రవేశ పరీక్షల విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఎంసెట్లో పొందిన తమ ర్యాంకుల ఆధారంగా విద్యార్థులు, తమకు నచ్చిన ఏ కాలేజీలోనైనా చేరే వెసులుబాటును కల్పించారు.

10. గ్రామీణ యువతను ధ్యేయంగా తీసుకుని రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సంస్కరణలకు ప్రవేశపెట్టారు. 1972లో ఏర్పాటైన ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్సిటిట్యూషన్స్ సొసైటీని 1988లో ఎన్టీఆర్ ప్రభుత్వం రెండు సంస్థలుగా పునర్ వ్యవస్థీకరించింది. ఇందుకు అనువుగా జీవో ఎంఎస్ నెం.363 ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ బిల్లును ఆమోదించింది. పర్యవసానంగా ఏపీ రెసిడెన్షియర్ జూనియర్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. ఇవి ఐఐటీలు, బిట్స్ వంటి ఉన్నతస్థాయి సంస్థలకు ఐదురెట్లు ఎక్కువగా విద్యార్థులను పంపే విద్యాసంస్థలుగా మారాయి. దీంతో గ్రామీణ ప్రాంతాలవారు, టాలెంట్ వున్న పేదవిద్యార్థులను తీర్చిదిద్దే ఏకైక రాష్ర్టంగా ఏపీ ఆవిర్భవించింది.

11. ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ కమెండో ఫోర్స్ను ఎన్టీఆర్ ఏర్పాటు చేశారు. నక్సలిజాల్ని సిద్ధాంతపరంగాను, సైనికపరంగా కూడా ఎదుర్కోవడానికి కొత్తగా ఈ కమెండో ఫోర్స్ ఏర్పాటయ్యింది.

12. గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్లో ముఖ్యంగా ఓల్డ్ సిటీలో మత ఘర్షణలను పూర్తిగా నివారించారు.

13. విశాఖ ఉక్కు కర్మాగారానికి పునరుజ్జీవం కల్పించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటైనప్పటి నుంచీ ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న ఈ సంస్థ, ఎన్టీఆర్ హయాంలో ఉత్పత్తిని పెంచుకుంది. కేంద్రంతో ఆయన చేసిన లాబీయింగ్ ఫలితంగా ఇది సాధ్యమైంది.

14. అమెరికాలోని డాక్టర్లు ఇండియాకు తిరిగి వచ్చి దేశానికి సేవ చేయాల్సిందిగా ఎన్టీఆర్ ఆహ్వానించారు. హైదరాబాద్లో నిమ్స్, ఉస్మానియా ఆసుపత్రుల సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రపంచవ్యాప్త వైద్య నిపుణులను ఆహ్వానించారు. విజయవాడలో మెడికల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు.

15. పటేల్, పట్వారీ వ్యవస్థలను నిషేధించారు. దీంతో ముఖ్యంగా తెలంగాణలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీల అభ్యున్నతికి మార్గం సుగమమైంది. స్థానిక పంచాయితీ నేతలకు అధికారం లభించేలా ఫ్యూడల్ పటేల్, పట్వారీ, మునసబు, కరణం వ్యవస్థలను రద్దు చేశారు.

16. వేద సంబంధ సబ్జెక్ట్లకు ప్రవేశ పరీక్ష విధానాన్ని ఎన్టీఆర్ ప్రవేశపెట్టారు. ఆలయాల్లో బ్రాహ్మణేతరులను పూజారులుగా నియమించే విధానానికి శ్రీకారం చుట్టారు.

17. ఆసియాలోనే అతిపెద్ద బస్ స్టేషన్ను రాష్ర్టంలో నిర్మించారు. హైదరాబాద్లో మహాత్మాగాంధీ బస్స్టేషన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

18. హైదరాబాద్ ట్యాంక్ బండ్ రోడ్డులో తెలుగు మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. తెలుగువారి వారసత్వ సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేశారు.

19. ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులకు విద్యావకాశాలు కల్పించేందుకు ప్రతి ఇంటికీ ఒక బల్బు పథకాన్ని ప్రవేశపెట్టారు. విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలకు ఈ సౌకర్యాన్ని కల్పించారు. ఒక బల్బువున్న ఇంటికి సబ్సిడీ ఇచ్చారు.

20 రాష్ర్టంలో నీటి పంపిణీ విధానాన్ని ఎన్టీఆర్ సంస్కరించారు. ప్రణాళికా రచనలో రైతు సంఘాలకు ప్రాధాన్యం కల్పించారు.

21. గుడిసెల స్థానే పేదల కోసం ఐదులక్షల ఇళ్లను నిర్మించారు. ఐదేళ్లలో ఇలా లో- ఇన్కమ్ హౌసింగ్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఆయన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మరో తొమ్మిదేళ్లు దీన్ని కొనసాగించి మరో 10 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు.

22. శాసనమండలి వ్యవస్థను రద్దు చేశారు ఎన్టీఆర్. దీనివల్ల ఖర్చులు పెరగడం తప్ప ఖజానాకు ఒరిగేదేమీ వుండదని అభిప్రాయపడ్డారు.

23. హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో అతిపెద్ద బుద్ధుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్కే దక్కింది.

24. ప్రైమరీ స్కూలు విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు.

25. రాయలసీమకు సేద్యపు నీటిని, చెన్నైకి మంచినీటిని సరఫరా చేసేందుకు తెలుగు గంగ ప్రాజెక్ట్ను చేపట్టారు. ఈ ప్రాజెక్ట్కు సత్యసాయి బాబా మద్దతు నిచ్చి తోడ్పాటు అందించారు.

26. ప్రభుత్వ ఉద్యోగులు సక్రమంగా పని చేసేందుకు చర్యలు తీసుకున్న ఎన్టీఆర్, ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 55 ఏళ్లకు తగ్గించారు. ఉద్యోగుల సార్వత్రిక సమ్మెను అణచివేసేందుకు నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ను ప్రయోగించారు.

27. స్థానిక సంస్థల యంత్రాంగాల్లో రిజర్వేషన్ల ప్రక్రియను అమలు చేశారు. మహిళలు, ఎస్సీలు, ఎస్టీల రిజర్వేషన్ల కోసం కృషి చేశారు. వృత్తిగత విద్యాసంస్థల్లో బీసీలకు 55శాతం రిజర్వేషన్ల కోసం ఆయన పాటుపడ్డారు.

28. ప్రైవేటు బస్సులకు అనుమతిచ్చిన ఎన్టీఆర్, వాటితో పోటీ పడాల్సిందిగా ఏపీఎస్ఆర్టీసీని కోరారు. ఏపీ సేఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ని రద్దు చేశారు.

29. రైతులకు ఏడాదికి 50 రూపాయలకే విద్యుత్ సౌకర్యాన్ని కల్పించారు. ఏడాదికి 12 వేల లోపు ఆదాయాన్ని సంపాదించే రైతులకు సింగిల్ పంప్ సెట్ మీద (సాలుకు రూ.50 లకే) సబ్సిడీ ఇస్తూ వచ్చారు.

30. మహిళల కోసం సబ్సిడీ వస్ర్త పథకాన్ని ప్రవేశపెట్టారు. తక్కువ ఆదాయం పొందుతున్న మహిళలకు సబ్సిడీ మీద వస్ర్త పథకాన్ని అమలు చేశారు.

31. తిరుపతిలో శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు.

32. తెలుగు చలన చిత్ర పరిశ్రమను చెన్నై నుంచి హైదరాబాద్కు తరలించేందుకు ఎన్టీఆర్ చేసిన కృషి వల్ల ఏపీలో తెలుగు సినీ నిర్మాతలకు డిస్ర్టిబ్యూటర్లకు ఎంతో మేలు జరిగింది. తెలుగు సినీ ఇండస్ర్టీకి గుర్తింపు లభించింది.

33. తెలుగువారికి గర్వకారణంగా పీవీ నరసింహారావుకు ఎన్నికల్లో మద్దతు ఇచ్చారు. భారత ప్రధానిగా తెలుగు వ్యక్తి ఢిల్లీ గద్దెనెక్కడానికి ఎన్టీఆర్ తోడ్పడ్డారు. ఎన్నికల్లో పీవీ గెలిచేందుకు అనువుగా టీడీపీ అభ్యర్థిని ఎన్టీఆర్ నిలబెట్టలేదు. దాంతో మొదటిసారిగా మంచి మెజార్టీతో కాంగ్రెస్ నేత పీవీ నరసింహారావు విజయం సాధించారు.

34. ఏవియేషన్, రోడ్డు రవాణా వ్యవస్థలను మరింత మెరుగుపరిచారు. తిరుపతి, విశాఖ, విజయవాడ, వరంగల్ల్లో విమానాశ్రయాల ఏర్పాటు అప్గ్రేడ్కు కృషి చేశారు. నెల్లూరు, మచిలీపట్నం, కాకినాడల్లో ఎయిర్ పోర్టుల ఏర్పాటుకు పెట్టుబడుల విషయంలో చొరవచూపిన ఎన్టీఆర్, రాష్ర్టంలో రూరల్ రోడ్ నెట్వర్క్ను విస్తృతం చేశారు.

35. విద్యావంతులైన యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. వారి కెరీర్ను మలుపు తిప్పారు. ప్రస్తుతం తెలుగు రాష్ర్టాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబు.. ఎన్టీఆర్ హయాంలో మంత్రులుగా పనిచేశారు. జయప్రకాశ్ నారాయణ్, దేవేందర్ గౌడ్, కోడెల శివప్రసాద్, యనమల వంటి వారికి రాజకీయ భవిష్యత్ ఇచ్చారు.

36. తెలంగాణ వారికి కూడా సమాన హక్కులు ఉండేందుకు ఎన్టీఆర్ పోరాడారు. కాసు బ్రహ్మానందరెడ్డి అడుగుజాడల్లో నడిచారు.

37. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటులో ఎన్టీఆర్ కీలకపాత్ర పోషించారు. దీనివల్ల తిరుపతిలో రాడార్ రీసెర్చ్ సెంటర్కు తగినన్ని నిధులు అందాయి.

38. మండల రెవిన్యూ వ్యవస్థను ఆయన ఏర్పాటు చేసి, అడ్మినిస్ర్టేటివ్ కార్యాలయాలను ఏకీకృతం చేశారు. ప్రజల వద్దకు పాలన పేరుతో అన్ని అడ్మిసిస్ర్టేటివ్ కార్యాలయాలను ప్రతి గ్రామ పరిధి కిందకు తెచ్చారు.

39. టీటీడీ అడ్మినిస్ట్రేషన్ను సంస్కరించారు. తిరుపతిని మోడరన్ టూరిస్ట్ అట్రాక్షన్ కేంద్రంగా తీర్చిదిద్దారు. రిజిస్టేషన్ ప్రక్రియను కంప్యూటరీకరించారు.

40. కేంద్రంలో తొలి నాన్- కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1989లో నేషనల్ ఫ్రంట్ పేరిట కాంగ్రెసేతర పార్టీలతో జాతీయ సంకీర్ణ కూటమిని ఏర్పాటు చేశారు. అదే ఏడాది కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది.
Subscribe to:
Posts (Atom)